శివ నిర్వాణ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన రౌడీ హీరో…

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు స్టోరీ వినిపించిన శివ నిర్వాణ...     

రౌడీ హీరో విజయ్ దేవరకొండ కు టాలివుడ్ లో మంచి క్రేజ్ ఉంది .. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో అయిపోయాడు , హీరోగా , ప్రొడ్యూసర్ గా కూడా మారి ప్రేక్షకుల్లో మంచి స్థానం సంపాదించుకున్నారు .. పెళ్లిచూపులు సినిమా తో హీరోగా కెరీర్ మొదలు పెట్టి మొదటి సినిమాతోనే మంచి నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు ..అర్జున్ రెడ్డి సినిమా ఇండస్ట్రీ హిట్ అవ్వడంతో విజయ్ దేవరకొండ వరుసగా సినిమాలు చేస్తూ ముందుకు దూసుకువెళ్తున్నాడు .. అర్జున్‌ రెడ్డి లాంటి బోల్డ్‌ సబ్జెక్ట్‌ సినిమా తరువాత విజయ్ ఓ డీసెంట్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌తో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు .. 2018 లో డైరెక్టర్ పరశురామ్ దర్శకత్వంలో రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌ గా విజయ్ గీతా గోవిందం సినిమా లో నటించి బాక్స్ ఆఫీస్ హిట్ అందుకున్నారు .. గీత గోవిందం సినిమా తరువాత , డియర్ కామ్రేడ్, టాక్సీవాలా వంటి సినిమాలతో యూత్ లో ఫుల్ క్రేజ్ సొంతం చేసుకున్నారు .. ప్రస్తుతం ఈ యంగ్ హీరో డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ అనే పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు.. ఈ సినిమాని డైరెక్టర్ పూరి జగన్నాథ్, చార్మి లతోపాటు బాలీవుడ్ అగ్ర నిర్మాత కరణ్ జోహార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు ..ఈ సినిమాలో విజయ్ బాక్సర్ గా కనిపిస్తున్నారు ..

ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ శరవేగంగా జరుగుతుంది . లైగర్ సినిమా తరువాత హీరో విజయ్ దేవరకొండ ఏ డైరెక్టర్ తో సినిమా కమిట్ అయ్యారు అనే వార్త హాట్ టాపిక్ గా మారింది . లైగర్ సినిమా తరువాత విజయ్ చేయబోయే నెక్స్ట్ సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది … ఈ నేపథ్యంలోనే నిన్నుకోరి, మజిలీ,టక్ జగదీష్ వంటి సినిమాలను తెరకెక్కించిన శివ నిర్వాణ తో విజయ్ సినిమా చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. టక్ జగదీష్ సినిమా తరువాత డైరెక్టర్ శివ నిర్వాణ ఏ సినిమా అఫీషియల్ గా ఎనౌన్సుమెంట్ చేయాలేదు .. అలాగే విజయ్ దేవరకొండ కూడా డైరెక్టర్ శివ నిర్వాణ తో సినిమా చేస్తున్నారు అనే విషయం పై ఎలాంటి కన్ఫర్మేషన్ లేదు . మొత్తానికి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఉంటుందా లేదా అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు అగలిసిందే …

నాగ్ సినిమా లో స్పెషల్ సాంగ్ చేస్తున్న ఫరియా…

స్పెషల్ సాంగ్ చేస్తున్న ఫరియా అబ్దుల్లా …

టాలీవుడ్ లో విభిన్నమైన స్టోరీస్ , కంటెంట్ ఉన్న సినిమాలకు డిమాండ్ బాగానే ఉంటుంది , ప్రేక్షకులు అభిరుచులు సినిమా విషయంలోనూ ఎప్పటికప్పుడు మారుతూనే ఉంది .. కొత్తరకమైన స్టోరీస్ , ఎక్స్పెరిమెంటల్ స్టోరీస్ , కధలో దమ్ము ఉంటే తెలుగు ప్రేక్షకులు ఆ సినిమాని బాగా ఆదరిస్తారు .. ‘ఏజెంట్ సాయి శ్రీ‌నివాస ఆత్రేయ’ సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్న నవీన్‌ పొలిశెట్టి ఆ తరువాత అప్ కమింగ్ డైరెక్టర్ తో ‘జాతి రత్నాలు అనే కామిడీ సినిమా చేశారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమాలో హీరో నవీన్‌ పొలిశెట్టి సరసన కొత్త హీరోయిన్ ఫరియా అబ్దుల్లా నటించింది ఆరు అడుగుల ఎత్తు , గుడ్ లుకింగ్ స్మైల్ , యాక్టింగ్ తో మొదటి సినిమాతోనే హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకుంది .. ఫరియా అబ్దుల్లా అంటే గుర్తు పట్టడం కాస్త కష్టమవుతుందేమో కానీ, చిట్టి అంటే మాత్రం చాలా త్వరగా గుర్తుపడతారు .. . ఈ సినిమాలో ఫరియా నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు . జాతిరత్నాలు సూపర్ హిట్ అవ్వడంతో ఈ ముద్దుగుమ్మకు వరుసగా ఆఫర్స్ వస్తున్నాయి ..

తాజాగా ఈ మూడుగుమ్మగా గోల్డెన్ ఛాన్స్ దక్కింది … నాగ్ ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. 2016లో విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచిన సోగ్గాడే చిన్నినాయనా చిత్రానికి సీక్వెల్ గా రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో నాగార్జున సరసన రమ్యకృష్ణ నటిస్తోంది. అలాగే నాగ చైతన్య, కృతి శెట్టిలు జంటగా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అయితే ఈ చిత్రంలో ఓ అదిరిపోయే ఐటెం సాంగ్ ను ప్లాన్ చేస్తున్నారు చిత్ర యూనిట్ . ఈ సాంగ్ కోసం మేకర్స్ తాజాగా ఫరియాను సంప్రదించారని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . నాగార్జున, ఫరియాలపై చిత్రీకరించనున్న ఈ స్పెషల్ సాంగ్ ఎంతో ప్రత్యేకంగా ఉండనుందని తెలుస్తోంది. మొత్తానికి సీనియర్ హీరో నాగార్జున తో స్పెషల్ సాంగ్ చేసే అవకాశం లభించడంతో ఈ అమ్మడు చాలా ఆనందంగా ఉంది …

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న బుచ్చి బాబు…

సీనియర్ హీరోను లైన్లో పెట్టిన బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఉప్పెన” .. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ , హీరోగా లాంచ్ చేస్తూ , అలానే సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో ఒకరు అయిన డైరెక్టర్ బుచ్చి బాబు ఉప్పెన సినిమా తోనే ఇద్దరు టాలీవుడ్ కి పరిచయము అయ్యారు .. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు దర్శకుడు బుచ్చిబాబు .. ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు మరొక సినిమా ఎనౌన్సమెంట్ చేయలేదు .. మొదటి సినిమా తోనే భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు , ఆ తరువాత ఏ స్టార్ హీరోతో సినిమా ఎనౌన్సుమెంట్ చేస్తారో అన్న విషయము ఫై ఎటువంటి క్లారిటీ లేదు .. జనాలు కరోనా భయం ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే థియేటర్లకు వస్తారని ఉప్పెన సినిమా నిరూపించింది. గత ఏడాదిలోనే రావాల్సిన ఉప్పెన కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. మంచి సమయంలో విడుదల అయిన ఉప్పెన వంద కోట్లకు పైగా రాబట్టింది. ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కొందరు నిర్మాతలు డైరెక్టర్ బుచ్చిబాబు కి అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ..బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటీ అంటే అంతా ఒకే మాట చెప్తున్నారు… ఎన్టీఆర్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా రాబోతుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..

సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా గురించి గత కొన్ని రోజులు గా న్యూస్ బాగా వైరల్ అయింది .. తాజాగా ఈ కాంబినేషన్ గురించి మరోసారి న్యూస్ వినిపిస్తుంది .. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన ఓకే చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది .. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని తెలుస్తుంది .. ఎన్టీఆర్ కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ..ఎన్టీఆర్ తో డైరెక్టర్ బుచ్చి బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. మొత్తానికి ఉప్పెన సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తారక్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ డైరెక్టర్ బుచ్చుబాబు సిద్దంచేసుకున్నారు .. మరి డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …

చిరంజీవి కోసం వస్తున్న సల్లూ భాయ్…

గాడ్ ఫాదర్ సినిమా లో పవర్ ఫుల్ రోల్ లో సల్మాన్ ఖాన్

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా “ఆచార్య ” ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత , చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవితో సినిమా తీస్తున్నారు , కొరటాల శివ సినిమాలకు ఒక మార్కు ఉంటుంది , ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు . ఈ క్రమంలో ఆచార్య సినిమా తరువాత , మోహన్ రాజా డైరెక్షన్ లో ఒక సినిమా , డైరెక్టర్ మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళాశంకర్ సినిమా , మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో ఒక సినిమా లు లైన్ లో ఉన్నాయి . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమా ను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి .

తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఆచార్య సినిమా పూర్తి కాగానే చిరంజీవి గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ కి ఎటెండ్ అవుతారు . మలయాళం లో సూపర్ హిట్ అయిన లూసిఫర్ సినిమాకు రీమేక్ గా వస్తున్న సినిమా కాబట్టి ఈ సినిమా విషయంలో డైరెక్టర్ మోహన్ రాజా స్క్రిప్ట్ , మరియు కాస్టింగ్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. మెగా స్టార్ చిరంజీవి ఒకే సారి ఇప్పుడు మూడు సినిమాలను సెట్స్ మీదకి తీసుకు వెళ్లి జెట్ స్పీడ్ తో సినిమాల షూటింగ్ పూర్తి చేసే పనిలో ఉన్నారు .. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న మలయాళ సినిమా లూసిఫర్ రీమేక్ గాడ్ ఫాదర్ సినిమా గురించి ఏదోఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తున్నాయి .. ప్రస్తుతం గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో ఒకటి వైరల్ గా మారింది .. ఈ సినిమా , ఒరిజినల్ లూసిఫర్ లో హీరో పృథ్వీరాజ్ ఓ పవర్ ఫుల్ పాత్రలో నటించాడు . ఇప్పుడు తెలుగు రీమేక్ లో అంతకు మించిన పవర్ ఫుల్ గా ఈ పాత్రను తీర్చిదిద్దగా ,, డైరెక్టర్ మోహన్ రాజా చాలా కసరత్తలు చేస్తున్నారు , ముందుగా ఈ రోల్ కు చాలా పేర్లు అనుకున్నారు , కానీ ఈ రోల్ కోసం బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ కోసం సంప్రదిస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి .. చిరంజీవికి – సల్మాన్ కు మంచి ఫ్రెండ్ షిప్ ఉంది కాబట్టి ఇది నిజం కావచ్చని మెగా అభిమానులు ఆశ పడుతున్నారు. మొత్తానికి గాడ్ ఫాదర్ సినిమాలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నాడు అని వచ్చే వార్తల్లో నిజం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …

స్పీడ్ పెంచుతున్న వైష్ణవ తేజ్ …

గీత ఆర్ట్స్ బ్యానర్ లో సినిమా కమిట్ అయిన పంజా వైష్ణవ తేజ్  

మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ తేజ్ హీరోగా ఉప్పెన సినిమా తో హీరోగా టాలీవుడ్ లో కి పరిచయము అయ్యారు . సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా ఉప్పెన సినిమా తో డైరెక్టర్ గా ,మరియు , పంజా వైష్ణవ తేజ్ హీరో గా లాంచ్ చేసే భాద్యతను తీసుకున్నారు .. లవ్ అండ్ ఎమోషనల్ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ఉప్పెన సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వైష్ణవ తేజ్ యాక్టింగ్ , బుచ్చిబాబు టేకింగ్ , మరియు దేవిశ్రీప్రసాద్ సాంగ్స్ అన్ని కుదిరి హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ బుచ్చి బాబు మరియు వైష్ణవ తేజ్ ఇద్దరు టాలీవుడ్ ఇండస్ట్రీ నుండి మంచి ప్రశంసలు అందుకున్నారు .. మొదటి సినిమా తో హిట్ అందుకోవడమే కాకుండా వంద కోట్ల క్లబ్ లో చేరారు పంజా వైష్ణవ తేజ్ .. ఉప్పెన సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ కు చాలా ఆఫర్స్ వచ్చాయి . మొదటి సినిమా లవ్ బ్యాక్ డ్రాప్ చేసిన వైష్ణవ తేజ్ ఆ తరువాత సినిమా ఏది అయినా డిఫెరెంట్ గా చెయ్యాలని అనుకున్నారు …

ఉప్పెన సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న పంజా వైష్ణవ తేజ్ ,కొంత గ్యాప్ తీసుకొని తన సెకండ్ సినిమా క్రిష్ డైరెక్షన్ లో కొండపోలం సినిమా లో నటించారు .. క్రిష్‌ లాంటి టాలెంటెడ్‌ డైరక్టర్‌ తెరకెక్కించడంతో ‘కొండపొలం’పై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కొండ పొలం సినిమా తో డీసెంట్ హిట్ అందుకున్నాక పంజా వైష్ణవ తేజ్ తరువాత సినిమా ఏమిటి ఏ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నాడు అని క్లారిటీ లేదు .. కొండ పొలం సినిమా తరువాత పంజా వైష్ణవ తేజ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు .. పంజా వైష్ణవ తేజ్ తన చేయబోయే సినిమాలు గురించి సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. వైష్ణవ్ తేజ్ హీరోగా టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ 2 లో కొత్త చిత్రం నిఱిమిస్తున్నారు అని తెలుస్తుంది .. ప్రస్తుతం పంజా వైష్ణవ తేజ్ స్పీడ్ పెంచి వరుసగా ప్రాజెక్ట్స్‌ను లైన్‌లో పెడుతున్నాడు. వైష్ణవ్ తేజ్ హీరోగా గిరీశయ్య దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతుండగా, బీవీఎస్ ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ మూవీ తరువాత షైన్ స్క్రీన్ బ్యానర్‌లో ఒక సినిమా చేస్తున్నాడు ..ఈ క్రమంలోనే గీతా ఆర్ట్స్ 2 లోను తను ఒక సినిమా చేయడానికి సిద్దమౌతున్నట్లు వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి గీతా ఆర్ట్స్ బ్యానర్ లో పంజా వైష్ణవ తేజ్ సినిమా ఎప్పుడు మొదలౌతుందో అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …

బాలయ్యకి విలన్ గా కన్నడ స్టార్ …

గోపీచంద్ మలినేని - బాలయ్య సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ... 

2021 లో డైరెక్టర్ గోపీచంద్ మలినేని – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన చివరి హ్యాట్రిక్ సినిమా “క్రాక్” . క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు ఏవి అనుకున్నంతగా సక్సెస్ కాలేదు , సాలిడ్ కంటెంట్ , రవితేజ పవర్ ఫుల్ యాక్షన్ , గోపీచంద్ మలినేని టేకింగ్ , తో , ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . డైరెక్టర్ గోపీచంద్ మలినేని 2021 బాగా కలిసి వచ్చింది .. గోపీచంద్ మలినేని క్రాక్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాకా హీరో నందమూరి బాలకృష్ణ తో సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. బాలకృష్ణ ను పవర్ ఫుల్ అండ్ మాస్ గా చూపించాలి అంటే , ఒక్క బోయపాటి శ్రీను ఒక్కరే అని ఇండస్ట్రీ టాక్ .. గోపీచంద్ మలినేని డాన్ శ్రీను సినిమా తో ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి క్రాక్ సినిమా తో హిట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకొని స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు …ప్రస్తుతము బాలకృష్ణ – బోయపాటి శ్రీను డైరెక్షన్ లో వస్తున్న అఖండ సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అయింది . అఖండ సినిమా తరువాత బాలకృష్ణ వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , అయితే ముందుగా వాటిలో డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఒక సినిమా అఫీషియల్ గా లాంచ్ చేశారు .. ఒక డిఫెరెంట్ కాంబినేషన్ , డైరెక్టర్ గోపీచంద్ మలినేని , రవితేజ తో మూడు సినిమాలు , సీనియర్ హీరో వెంకేటేష్ తో ఒక సినిమా , మరియు హీరో రామ్ పోతినేని తో ఒక సినిమా చేశారు , కానీ క్రాక్ సినిమా హిట్ తో ఒక్కసారి ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ ని చేసింది .. గోపీచంద్ – బాలకృష్ణ సినిమా ఎనౌన్సుమెంట్ వినగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి …

డైరెక్టర్ గోపీచంద్ మలినేని మొదటి సారిగా బాలకృష్ణను డైరెక్ట్ చేసే అవకాశం దక్కింది , బాలయ్యను తమ అభిమానులు ఎలా చూడాలి అని కోరుకుంటున్నారో , అలా చుపించాడానికి , స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు .. వీరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా గురించి రోజా ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. గోపీచంద్ మలినేని – ముందుగా ఈ సినిమా లో విలన్ క్యారెక్టర్ కోసం తమిళ్ స్టార్ హీరో విజయ సేతుపతి అయితే బాగుటుంది అని ఫిక్స్ అయ్యారు అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. బాలయ్య బాబు – పక్కన విలన్ రోల్ చెయ్యాలి అంటే చాలా గట్స్ ఉండాలి , అలానే బాలయ్య బాబు తో ఢీ అంటే ఢీ అనేలా పవర్ ఫుల్ గా విలన్ రోల్ ఉండాలి , డైరెక్టర్ గోపీచంద్ మలినేని విలన్ రోల్ కోసం చాలా పేర్లు ముందుగా అనుకున్నారు .. ఈ సినిమా , కొన్ని వాస్తవిక ఘటనల ఆధారంగా మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనున్నది .. ఈ సినిమా లో విలన్ రోల్ గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది , బాలకృష్ణ ఢీ కొట్టే విలన్ పాత్రలో ప్రముఖ కన్నడ నటుడు దునియా విజయ్ ని ఎంపిక చేసిందట యూనిట్. …. కన్నడలో పలు సినిమాల్లో నెగటివ్ రొల్స్ చేసి మంచి పేరు అందుకున్న విజయ్, తొలిసారిగా తెలుగులో బాలకృష్ణ సరసన నటించే ఛాన్స్ దక్కించుకున్నాడు అని సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి డైరెక్టర్ గోపీచంద్ మలినేని – బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న సినిమాలో కన్నడ యాక్టర్ దునియా విజయ్ నటిస్తున్నారు అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే కొద్దీ రోజులు ఆగలిసిందే …

పట్టువదలని పూరీ – అన్నయ్య తో సినిమా గ్యారెంటీ …

చిరు తో సినిమా తగ్గేదే లేదంటున్న పూరి...

              

2007 లో మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన సినిమా శంకర్ దాదా జిందాబాద్ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది . శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు .. మెగాస్టార్ చిరంజీవి సుమారు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఖైదీ no 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు . అన్నయ 150 వ సినిమా కోసం చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చాలా లాంగ్ గ్యాప్ తరువాత అన్నయ్య రీ ఎంట్రీ ఇస్తుండటం , మరియు 150 వ సినిమా కాబట్టి మెగా స్టార్ తన 150 వ సినిమా కోసం చాలా స్టోరీస్ విన్నారు , చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చిరంజీవి 150 వ సినిమా కాబట్టి , మొదటగా ఈ ఆఫర్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు అవకాశం వచ్చింది , అయితే డైరెక్టర్ పూరీ దగ్గర స్క్రిప్ట్ లేదు జస్ట్ “ఆటో జానీ ” అన్న ఒక్క టైటిల్ ఒక్కటే ఉంది , ఈ టైటిల్ ను మెగా స్టార్ కోసం డైరెక్టర్ పూరీ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు .. మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం డైరెక్టర్ పూరీ ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసి నేరేషన్ కూడా ఇచ్చారు , కానీ మెగా స్టార్ చిరంజీవికి ఫస్ట్ ఆఫ్ నచ్చింది కానీ సెకండ్ ఆఫ్ , మరియు క్లైమాక్స్ నచ్చకపోవడంతో పూరీ ఆఫర్ మిస్ అయింది ..

డైరెక్టర్ పూరీ మిస్ చేసుకున్నాకా ,ఈ ఛాన్స్ డైరెక్టర్ వి వి వినాయక్ కు లభించింది , మెగాస్టార్ చిరంజీవి ది – డైరెక్టర్ వి .వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది , మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు .. మెగా స్టార్ చిరంజీవికి ఈ సినిమా 150 వ సినిమా కావడం విశేషం , ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు ..ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ సఫీస్ దగ్గర బిగెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నర్సింహా రెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా , మరియు మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ , మరియు డైరెక్టర్ మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. మెగా స్టార్ చిరంజీవి 154 వ సినిమా డైరెక్టర్ బాబీ తో ఎనౌన్సమెంట్ చేశారు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య క్రమాల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరు అయ్యారు . ఈ క్రమంలో మల్లి డైరెక్టర్ పూరి తో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో త్వరలో , సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. పూరి జగన్నాథ్ కు మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చెయ్యాలని బలంగా ఉంది .. ప్రస్తుతము మెగా స్టార్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , అలానే డైరెక్టర్ పూరి చేతిలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ఉంది . మరి మొత్తానికి డైరెక్టర్ పూరి లైగర్ సినిమా పూర్తి అయిన తరువాత , గాని మరొక సినిమా ఎనౌన్సుమెంట్ చెయ్యరు , అలానే మెగా స్టార్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది , చిరంజీవి కోసం డైరెక్టర్ మారుతి కూడా ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి , డైరెక్టర్ పూరి కి గత కొంత కాలంగా బలమైన హిట్స్ లేవు పోకిరి , టెంపర్ లాంటి హిట్స్ తప్ప మరి ఏ సినిమాలు ఆశించినంత హిట్స్ అందుకోలేదు , ప్రస్తుతము పూరి ఫోకస్ అంతా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా మీదనే ఉంది , అయితే తాజాగా పూరి -మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుంది .. చిరంజీవి 154వ సినిమా ఓపెనింగ్ రోజు పూజా కార్యక్రమాల్లోడైరెక్టర్ పూరి కనిపించారు. ఆయన ప్రత్యేక గెస్ట్ గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేసారు. అక్కడికి పూరితో పాటు చాలా మంది దర్శకులు వచ్చారు. కానీ పూరి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే హైలైట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆటోజానీని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. మెగాస్టార్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరి కి వస్తే మరొక అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఖాయం .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి , మొత్తానికి పూరి – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సీనిమా కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు , ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …

ప్రభాస్ తో మారుతీ మూవీ ….గోల్డెన్ ఛాన్స్ కొట్టేశాడు

ప్రభాస్ కి స్టోరీ వినిపించిన మారుతి

టాలీవుడ్ డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి సినిమాలకు యూత్ లో బాగా క్రేజ్ ఉంటుంది .. యూత్ పల్స్ , కామిడీ టైమింగ్ , కాన్సెప్ట్ సినిమాలు తీయాలన్న మారుతి రూటే వేరు , పాన్ ఇండియా సినిమాలు మధ్య చిన్న సినిమాలు వస్తున్న తరుణంలో పక్కాగా డైరెక్టర్ మారుతి సినిమా ఒకటి ఉంటుంది ..ప్రస్తుతం డిమాండ్ ఉన్న డైరెక్టర్స్ లో డైరెక్టర్ మారుతి ఒకరు . చిన్న సినిమాలతో డైరెక్టర్ గా టాలీవుడ్ లోకి అడుగు పెట్టి ఒక్కో మెట్టు ఎక్కి స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు ..మారుతి సినిమాలు అంటేనే మినిమమ్ గ్యారెంటీ ఉంటాయి అని నిర్మాతలు చెబుతుంటారు , రొటీన్ కి బిన్నంగా మారుతి స్టోరీస్ ఉంటాయి , మారుతి డైరెక్షన్ లో ఏ హీరో నటించిన వారికి బెస్ట్ సినిమా అవుతుంది ..

మారుతి – సాయి ధరమ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ప్రతిరోజూ పండగే . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్ ” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి స్పీడ్ పెంచి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్సుమెంట్ చేస్తున్నారు ..ప్రస్తుతము డైరెక్టర్ మారుతి చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి , వాటిలో . గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ , మరియు సంతోష్ శోభన్ నటించిన ‘మంచిరోజులు వచ్చాయి’ సినిమా , సంతోష్ శోభన్ నటించిన మంచిరోజులు వచ్చాయి’ సినిమా దీపావళి పండుగన ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకుంది .. ఈ సినిమా తరువాత మాస్ హీరో గోపీచంద్ తో ‘పక్కా కమర్షియల్” సినిమాను తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , రిలీజ్ చేసి , గోపీచంద్ అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి కి సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. ప్రస్తుతము చేస్తున్న “పక్కా కమర్షియల్” సినిమా తరువాత , మెగా స్టార్ చిరంజీవి కోసం స్టోరీ రెడీ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి , తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .

డైరెక్టర్ మారుతి కెరీర్ మొదటి నుంచి మీడియం రేంజ్ హీరోలోతో సినిమాలు డైరెక్ట్ చేసి హిట్స్ అందుకున్నారు . మారుతి డైరెక్షన్ లో సీనియర్ స్టార్ హీరో వెంకటేశ్ తో మాత్రమే ‘బాబు బంగారం” అనే సినిమా చేసారు.. ప్రస్తుతము డైరెక్టర్ మారుతి సీనియర్ హీరోల కోసం స్టోరీస్ రెడీ చేస్తున్నట్లు తెలుస్తుంది .. ఇప్పటికే మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక స్టోరీ సిద్ధంచేయగా , తాజాగా మరో బాంబ్ లాంటి న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది .. ఈ నేపథ్యంలో ప్రభాస్ కి కూడా మారుతి ఒక లైన్ వినిపించాడనీ .. అది ఆయనకి బాగా నచ్చేయడంతో గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. ప్రభాస్ తో సినిమా అంటే పాన్ ఇండియా సినిమా అనుకోవలసిందే. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి , చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి , అలానే ప్రభాస్ చేతిలో పాన్ ఇండియా సినిమాలు ఉన్నాయి , అలానే డైరెక్టర్ మారుతి చేస్తున్న పక్కా కమ్మర్షియల్ సినిమా పూర్తి అయితే కానీ మరోక సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది . మొత్తానికి డైరెక్టర్ మారుతి ఒక్క పెద్ద స్టార్ తో సినిమా చేసే ఛాన్స్ కోసం బాగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది . మొత్తానికి సోషల్ మీడియా లో మారుతి – ప్రభాస్ కాంబినేషన్ లో సినిమా ఉంటుంది అన్న విషయం వైరల్ అవుతుంది .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో కనుక సినిమా వస్తే డైరెక్టర్ మారుతి ,పాన్ ఇండియా డైరెక్టర్స్ లిస్ట్ లో చేరినట్లే .మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్ళనుందో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే …

మెగాఆఫర్ ను దక్కించుకున్న మారుతి …

మెగా స్టార్ చిరంజీవి కోసం పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసిన డైరెక్టర్ మారుతి 
        

టాలీవుడ్ డైరెక్టర్స్ లో మారుతి దారి వేరు .. 2012 లో ఈరోజుల్లో అనే యూత్ ఫుల్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి , మెల్లగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు డైరెక్టర్ మారుతి .. మారుతి సీని కెరీర్ కనుక చూసినట్లు అయితే లో బడ్జెట్ సినిమా తో సినిమా కెరీర్ పారంబించి , ఇటు యూత్ లోను ఫ్యామిలీ ఆడియెన్స్ లోను తన సినిమాకు ప్రత్యేకమైన మార్కు ను క్రియేట్ చేసుకొని మంచి డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు .. మారుతి , రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ కాన్సెప్ట్ బేస్ స్టోరీస్ ను , సెలెక్ట్ చేసుకొని , వాటిని పెర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసి డైరెక్టర్ గా సక్సెస్ అయి ఇటు ప్రేక్షకుల్లోనూ , ఇండస్ట్రీ లోను అందరి చేత మంచి ప్రశంసలు అందుకుంటున్నారు ..మారుతి సినిమాలు చాలా విభిన్నంగా ఉంటాయి , ఏ సినిమా చుసిన ఎదో కొత్త పాయింట్ కనబడుతుంది .. మారుతి కెరీర్ మొదట్లో యూత్ ఫుల్ స్టోరీస్ కె ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవాడు , కానీ ఆ తరువాత రూట్ మార్చి ఫ్యామిలీ సినిమాలను కూడా డైరెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్స్ అందుకున్నారు .. ఫ్యామిలీ ఆడియన్స్ ని టార్గెట్ చేసి వచ్చిన ‘మహానుభావుడు’ .. ‘భలే భలే మగాడివోయ్’ సినిమాలు మారుతి కి మంచి పేరు తీసుకొచ్చాయి ..

మారుతి – సాయి ధరమ్ తేజ్ , కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ప్రతిరోజూ పండగే . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. ప్రతిరోజూ పండగే సినిమా తరువాత డైరెక్టర్ మారుతి చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మాస్ హీరో గోపీచంద్ తో “పక్కా కమర్షియల్ ” అనే సినిమా డైరెక్ట్ చేస్తున్నారు .. గోపీచంద్ తో సినిమా చేస్తూనే , మరో యంగ్ హీరో సంతోష్‌ శోభన్‌ తో మంచిరోజులు వచ్చాయి అనే సినిమాను డైరెక్ట్ చేసి దీపావళి రోజున ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు .. ప్రస్తుతము డైరెక్టర్ మారుతి కి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. మారుతి మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక పవర్ ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేశారు అని , అతి త్వరలోనే మెగా స్టార్ చిరంజీవి తో సినిమా డైరెక్ట్ చేస్తాను అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . ప్రస్తుతం డైరెక్టర్ మారుతి చేతిలో పక్కా కమర్షియల్ అనే సినిమా ఉంది . ఈ సినిమా పూర్తి అయితేనే గాని మరొక సినిమా మొదలు పెట్టరు . ప్రస్తుతము , మెగా స్టార్ చిరంజీవి వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు , మారుతి ఒక వైపున చిన్న హీరోలతో .. మరో వైపున పెద్ద , హీరోలతో సినిమాలను సెట్ చేస్తూ మారుతి తనదైన ప్రత్యేకతను చూపిస్తూ మందుకు వెళ్తతున్నాడు .. మెగా స్టార్ చిరంజీవి కి నచ్చే స్టోరీ డైరెక్టర్ మారుతి రెడీ చేస్తే ఈ కాంబినేషన్ సెట్ అయినట్లే . మొత్తానికి డైరెక్టర్ మారుతి – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు మొదలౌతుంది అని విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …

తగ్గేదే లే అంటున్న బోయపాటి …

అఖండ సినిమాకు లైన్ క్లియర్...

బోయపాటి శ్రీను ది – నందమూరి బాలకృష్ణ ది హిట్ కాంబినేషన్ .. గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గస్ట్ హిట్స్ అందుకున్నాయి .. . బాలకృష్ణ – బోయపాటి సినిమా అంటే బాలయ్య అభిమానుల్లో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి , బాలయ్య తో సినిమా అంటేనే , బోయపాటి శ్రీను ముందు నుండి పక్కా ప్లానింగ్ తో ఉంటారు , బాలయ్యను ఎలా చూపించాలి , డైలాగ్ దగ్గర నుండి టెక్నీషియన్ , ఆర్టిస్ట్స్ , మ్యూజిక్ విషయంలో ముందు నుండి డైరెక్టర్ బోయపాటి శ్రీను ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు .. బాలకృష్ణ ను స్క్రీన్ ముందు బోయపాటి చూపించినట్లు గా మరి ఏ డైరెక్టర్ చూపించలేరు అని నందమూరి అభిమానులు చెబుతారు .. బోయపాటి శ్రీను కెరీర్ లోనే సింహా , లెజెండ్ సినిమాలు రెండు బిగ్గెస్ట్ హిట్స్ అవ్వడమే కాకుండా – ఇటు బలకృష్ణ కు డైరెక్టర్ బోయపాటి శ్రీను కు స్టార్ డైరెక్టర్ గా గుర్తింపు వచ్చింది .. బోయపాటి శ్రీను తో ఏ స్టార్ హీరో అయిన సినిమా చేస్తే వారికి ది బెస్ట్ సినిమా ఇస్తాడు , అలానే ప్రతి హీరో ఒక్క సినిమా అయినా డైరెక్టర్ బోయాపాటి శ్రీను డైరెక్షన్ లో చెయ్యాలని కోరుకుంటాడు ..

బోయాపాటి శ్రీను – మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “వినయ విధేయ రామ ” . ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచింది .. రంగస్థలం సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న రామ్ చరణ్ , కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ బోయపాటి శ్రీను తో వినయ విధేయ రామ సినిమాను తెరకెక్కించారు .. సరైనోడు , జయ జానకి నాయక , సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న డైరెక్టర్ బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని , రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా డైరెక్ట్ చేశారు. బోయాపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ అనగానే రామ్ చరణ్ అభిమానుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి .. 2019 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వినయ విధేయ రామ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా , ఇటు డైరెక్టర్ బోయపాటి శ్రీను కూడా ఫిల్మ్ క్రిటిక్స్ నుండి ఎన్నో విమర్శలు అందుకున్నారు ..

విధేయ రామ సినిమా తరువాత , డైరెక్టర్ బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని బాలకృష్ణ తో హ్యాట్రిక్ గా అఖండ సినిమా చేస్తున్నాడు .. బాలకృష తో బోయపాటి శ్రీను సినిమా ఎనౌన్స్ చెయ్యగానే , ఈ సినిమా మీద నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . బాలకృష్ణ – మరియు డైరెక్టర్ బోయపాటి శ్రీను ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సింహా , లెజెండ్ సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి . ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమా గా రాబోతున్న అఖండ సినిమా మీద ప్రేక్షకుల్లో హై ఎక్సపెక్టేషన్స్ ఉన్నాయి . నందమూరి అభిమానులంతా ఇప్పుడు ‘అఖండ’ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా .ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ , రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. …ఈ సినిమాలో బాలకృష్ణ అఘోరగా కనిపించనున్నారు. . ఈ సినిమాను మిరియాల రవీందర్ రెడ్డి భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు , ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది , అయితే ఈ సినిమాను ముందుగా దసరా పండుగకి విడుదల చేయాలనే అనే ఆలోచనలో ఉన్నట్లు సోషల్ మీడియా లో కొన్ని వార్తలు వినిపించాయి .. దసరా పండుగ కి కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు కాబట్టి , ఇక దీపావళి పండుగ కి అయిన వస్తుందేమోనని అభిమానులు ఎంతగానో ఆశపడ్డారు . మొత్తానికి ఈ సినిమాను డిసెంబరులోనే విడుదల చేయాలని ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మొత్తానికి అఖండ సినిమా డిసెంబర్ లో రిలీజ్ అవ్వబోతుంది అని వచ్చే వార్తల్లో క్లారిటీ రావాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

1 2 3