రాక్ స్టార్ యశ్ నటించిన… రారాజు… ట్రైలర్ ను రిలీజ్ చేసిన డైరెక్టర్ వి వి వినాయక్

స్టార్, రాక్ స్టార్ యష్ కథానాయకుడిగా నటించిన చిత్రం రారాజు.కన్నడలో విడులై బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న ఈ చిత్రాన్ని పద్మావతి పిక్చర్స్ సంస్థ రెండు తెలుగు రాష్ట్రాలలో జూన్ ద్వితీయార్థంలో బారీ ఎత్తున రిలీజ్ చేయబోతుంది. ఈ సందర్భంగా ఈ మూవీ ట్రైలర్ ను మెగా డైరెక్టర్ వి వి వినాయక్ విడుదల చేసారుఈ సందర్భంగా డైరెక్టర్ వి వి వినాయక్ గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ సుబ్బారావు గారు గత 25 సంవత్సరాలనుంచీ ఎన్నో సినిమాలను రిలీజ్ చేశారు. నాకు బాగా కావాల్సిన వ్యకి. ఇప్పుడు కొత్తగా ప్రొడక్షన్ లోకి వస్తున్నారు. యష్ .. కే జీ ఎఫ్ సినిమా కు ముందు నటించిన సినిమాని తెలుగులో రారాజు పేరుతో పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో జూన్ లో రిలీజ్ అవుతుంది.ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలి. మరిన్ని మంచి సినిమా లు పద్మావతి పిక్చర్స్ బ్యానర్ నుంచి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.నిర్మాత: వి.ఎస్.సుబ్బారావు గారు మాట్లాడుతూ: పద్మావతి పిక్చర్స్ బ్యానర్ లో కన్నడ రాక్ స్టార్ యశ్ నటించిన రారాజు చిత్రాన్ని రెండు తెలుగు రాష్ట్రాలలోజూన్ లో రిలీజ్ చేస్తున్నాము. మా ట్రైలర్ ను రిలీజ్ చేసిన మెగా డైరెక్టర్ వి వి వినాయక్ గారికి కృతజ్ఞతలు యశ్ అతని భార్య రాధిక పండిట్ ఇద్దరు కలిసిన నటించిన చిత్రం కన్నడ లో సూపర్ హిట్ అయినట్టు తెలుగు లో కూడా ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని అన్నారు.రాక్ స్టార్ యశ్ , హీరోయిన్ రాధిక పండిట్, కిక్ శ్యామ్, సీత, రవిశంకర్ తదితరులు ప్రధాన తారాగణంపద్మావతి పిక్చర్స్ బ్యానర్మ్యూజిక్ హరికృష్ణడీ ఓ పి.. ఆండ్రూనిర్మాత.. వి ఎస్. సుబ్బారావుడైరెక్టర్ . మహేష్ రావు

గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…


శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ బ్రాండ్‌ అంబాడిసర్‌గా మెగాస్టార్‌ చిరంజీవి…

వెండితెరపై తన నటనతో కోట్లాది ప్రేక్షకుల హృదయాలను గెలుచుకోవడంతో పాటు తనదైన సామాజిక సేవా కార్యక్రమాలతో మహోన్నత వ్యక్తిగా పేరుపొందిన మెగాస్టార్‌ చిరంజీవి గారు మా ‘శుభగృహ’ రియల్‌ ఎస్టేట్‌ సంస్థకు బ్రాండ్‌ అంబాడిసర్‌గా వుండేందుకు ఒప్పుకోవడం మాకు ఎంతో ఆనందంగా, గర్వంగా వుందని శుభగృహ రియల్‌ ఎస్టేట్‌ సంస్థ చైర్మన్‌ నంబూరు కళ్యాణ్‌చక్రవర్తి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ అందమైన ఊహకు పొందికైన రూపం’ అంటూ లక్షలాది మంది కస్టమర్లకు చేరువైన మా సంస్థకు మెగాస్టార్‌ చిరంజీవి గారి లాంటి గొప్ప వ్యక్తి ప్రచారకర్తగా వుండటం ఎంతో సంతోషంగా వుంది. ‘పుష్ప’ చిత్రంతో భారతదేశం గర్వించదగ్గ దర్శకుల జాబితాలో చేరిన జీనియస్‌ దర్శకుడు సుకుమార్‌ గారి దర్శకత్వంలో, నట శిఖరం చిరంజీవి గారు నటించగా, ఇటీవల మా సంస్థకు ఓ యాడ్‌ షూట్‌ చేశాం. ఈ ప్రచార చిత్రం అవుట్‌పుట్‌ చూసిన తరువాత చిరంజీవి గారు ఎంతో హ్యాపీగా ఫీలయ్యారు. సుకుమార్‌ గారి దర్శకత్వ ప్రతిభతో ఆ యాడ్‌ ఎంతో అద్భుతంగా వచ్చింది. ఈ ఉగాది పర్వదినం నుండి ఈ ప్రచార చిత్రం అన్ని ప్రముఖ టీవీ ఛానెల్స్‌తో పాటు సోషల్‌ మీడియాలో ప్రసారం కానుంది. చిరంజీవి గారు మా సంస్థకు ప్రచారకర్తగా వుండటంతో పాటు ఉగాది పర్వదినాన ప్రసార కానున్న ప్రచారం చిత్రం మా సంస్థ ప్రతిష్టను ఎంతో పెంచుతుంది’ అన్నారు…

ఫెవేరేట్ హీరో ను డైరెక్ట్ చేయబోతున్న హరీష్ శంకర్…

2006 లో డైరెక్టర్ హరీష్ శంకర్ – మాస్ మహారాజ్ రవితేజ కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ మూవీ షాక్ .. ఈ మూవీ కంటే ముందు హరీష్ శంకర్ పలు సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా రచయితగా పనిచేశారు .. ఈ సినిమాను డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ నిర్మించారు .. షాక్ మూవీ తో హరీష్ శంకర్ టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి డైరెక్టర్ గా అడుగుపెట్టారు , మొదటి సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయింది .. ఇక షాక్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర నిరుత్సాహపరిచిన , ఆ తరువాత డైరెక్టర్ హరీష్ కొంత గ్యాప్ తీసుకొని సెకండ్ టైమ్ మల్లి మాస్ మహారాజ్ రవితేజ తో మిరపాకాయ్ సినిమాను తెరకెక్కించి బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. . ఇక ఆ తరువాత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ తెరకెక్కించిన గబ్బర్ సింగ్ సినిమా పవర్ స్టార్ స్టామినాని , హరీష్ శంకర్ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది .. .. ఈ హిట్ మూవీతో డైరెక్టర్ హరీష్ శంకర్ టాప్ దర్శకుల లిస్ట్ లోకి చేరిపోయాడు.

ఇక అసలు విషయానికి వెళ్ళితే హరీష్ శంకర్ రీమేక్ మూవీస్ తో నే హిట్ అందుకోగలడు అని సోషల్ మీడియా లో గత కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి , .. ఇక హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన గద్దల కొండ గణేష్ మూవీ కూడా రీమేక్ మూవీ కావడం మరో విశేషం .. ఇక ఈ మూవీ తరువాత హరీష్ శంకర్ పవన్ తో స్ట్రెయిట్ మూవీ
భవదీయుడు భగత్ సింగ్ సినిమా చేస్తున్నాడు .. ప్రస్తుతం పవన్ కమిట్ అయిన హరిహర వీర మల్లు సినిమా పూర్తయిన తర్వాత హరీష్ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.

హరీష్ శంకర్ పవన్ కళ్యాణ్ సినిమా తరువాత తాను డైరెక్ట్ చేయబోయే నెక్స్ట్ మూవీ గురించి సోషల్ మీడియా లో ఓ వార్త చక్కర్లు కొడుతుంది .. హరీష్ పవన్ సినిమా తరువాత చిరంజీవితో ఒక ప్రాజెక్టు చేయనున్నట్టుగా ఒక వార్త సోషల్ మీడియా లో వినిపిస్తుంది .. ఇక మలయాళంలో వచ్చిన ‘బ్రో డాడీ’ మూవీ భారీ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే .. మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ మూవీని తెలుగు లో రీమేక్ చేయాలని మెగాస్టార్ భావిస్తున్నారు .. అయితే . ఆ బాధ్యతలను డైరెక్టర్ హరీష్ శంకర్ కు అప్పగించారని టాక్ వినిపిస్తుంది .. ఇక డైరెక్టర్ హరీష్ శంకర్ కు మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయాలనీ కోరిక బలంగా ఉంది , సరైన స్టోరి కోసం ఎదురుచూస్తున్నాడు , ఈ నేపథ్యంలో ఈ ఆఫర్ హరీష్ శంకర్ కు రావడం చాలా లక్ .. రీమేక్ మూవీ అయినా తెలుగు నేటివిటీ కోసం హరీష్ శంకర్ తనదైన మార్పులు చేసి హరీష్ శంకర్ సక్సెస్ అందుకుంటారు .. ప్రస్తుతం తెలుగు వెర్షన్ కి సంబంధించిన మార్పుల గురించి చర్చలు జరుగుతున్నాయని తెలుస్తుంది. ఇక త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పై పూర్తిగా క్లారిటీ వస్తుంది ..

ఏపీ సియం జగన్ తో చిరు భేటీ సమస్య పరిష్కారం .. దటీజ్ మెగాస్టార్

సినిమా టికెట్ ధరల విషయంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారం రోజుల్లో కొత్త జీవోను జారీ చేస్తుందని మెగాస్టార్ చిరంజీవి ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యలపై అందరితో కలిసి ముఖ్యమంత్రి జగన్ మరోసారి మాట్లాడుతానని చెప్పారు. అప్పటి వరకు సినీ పరిశ్రమలోని వ్యక్తులేవరూ నోరు జారవద్దని సినిమా బిడ్డగా మెగాస్టార్ హితవు పలికారు. త్వరలోనే అందరికి ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకుందని తెలిపారు. ముఖ్యమంత్రి జగన్ తో సమావేశం ముగిసిన అనంతరం మీడియాతో మాట్లాడిన చిరంజీవి… వన్ టూ వన్ మాత్రమే చర్చ జరిగిందని తెలిపారు. ఆ చర్చలో మాట్లాడిన వివరాలను వెల్లడించిన చిరంజీవి… సినీ పరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య నెలకొన్న వివాదాలు ఇక ముగిసినట్లేననే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

టికెట్ వివాదం జటిలం అవుతున్న తరుణంలో సీఎం వైఎస్ జగన్ సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తి గా నన్ను ఆహ్వానించారు. అలాగే ఎగ్జిబిటర్లు కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్పాను. రెండువైపులా అంశాలను తెలుసుకోవాలని సీఎం జగన్ ఆకాక్షించారు. కోవిడ్ సమయంలో సినీ పరిశ్రమ లో కార్మికులు దయనీయ పరిస్థితి లో గడిపారు
సినిమా టికెట్ల విషయంలో పునరాలోచన చేస్తున్నమని చెప్పారు.సినీ పెద్దగా కాదు బిడ్డగా నేను ఇక్కడి కి వచ్చా.త్వరలోనే జీవో ఇస్తామని సీఎం చెప్పారు.
ఐదో షో ఉండాలా లేదా అన్న విషయం పై కూడా ఆలోచన చేస్తామని చెప్పారు.పెద్ద బడ్జెట్ సినిమానా లేక చిన్న సినిమానా అన్న భేదం లేకుండా అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం వస్తుందని ఆశిస్తున్నా. రెండు మూడు వారాల్లో ప్రభుత్వం నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. త్వరలోనే కమిటీ సమావేశనికి ప్రభుత్వ ఆహ్వానం మేరకు వస్తాం.

మరోసారి దాన గుణం చాటిన మెగాస్టార్ చిరంజీవి…

చిరంజీవి మరోసారి తన దాన గుణం చాటుకున్నారు. ఈసారి ఒకరో ఇద్దరికో కాకుండా, మొత్తం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్నా అన్ని క్రాఫ్ట్స్ లో పనిచేస్తున్న అందరికి లైఫ్ టైం హెల్త్ కార్డులు ఇష్యూ చేసారు ఇంకా చేస్తున్నారు. చిరంజీవి ఆధ్వర్యంలో వున్న చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా యోదా డయాగ్నసిస్ సెంటర్ ద్వారా ఈ కార్డులు ఇష్యూ చేసారు. కరోనా మహమ్మారి వాళ్ళ వ్యవస్థలు చిన్నాభిన్నం అయ్యాయి, ఆర్ధికంగా చాలామంది ఛిద్రం అయ్యారు. ఆర్ధికంగా అయితే పరవాలేదు, మల్లి నిలదొక్కుకోవచ్చు కానీ చాలామంది మిత్రులను, శ్రేయోభిలాషులను కోల్పోయాం. ఆరోగ్యమే మహాభాగ్యము అన్నారు కదా, అప్పుడు అనిపించింది ఈ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి నేను ఇండస్ట్రీ కి ఏమి చెయ్యగలను అని ఆలోచించా. అప్పుడే యోదా డయాగ్నసిస్ కి వెళ్ళినప్పుడు వాళ్ళతో మన సినిమా ఇండస్ట్రీ లో వున్న కార్మికుల ఆరోగ్యం గురించి ప్రస్తావించటం జరిగింది. యోదా డయాగ్నసిస్ చైర్మన్ కంచర్ల సుధాకర్ వెంటనే నా ఆలోచనని ఆమోదించి ముందుకు వచ్చారు. అయితే కొంతమంది మిత్రులు సభ్యుడు ఒక్కడికే కాకుండా, కుటుంబం లో వున్న రక్త సంభందీకులు అయినా మిగతా సభ్యులని కూడా కలిపితే బాగుంటుంది అని చెప్పారు. వెంటనే మళ్ళీ సుధాకర్ గారితో ప్రస్తావించటం జరిగింది, అయన కూడా వెంటనే సానుకూలంగా స్పందించి వెంటనే దానికి కూడా అంగీకారం తెలిపారు.
ఈ విధంగా చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా చిరంజీవి గారు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ లో వున్న అన్ని క్రాఫ్ట్స్ లో వున్న సభ్యుల నాయకులకు ఈ కార్డులను అందచేశారు. ఈ కార్డులో సభ్యుడి మొత్తం డాటా నే కాకుండా మరియు అతని కుటుంబ సభ్యుల డాటా కూడా పొందు పరచటం జరిగింది. ఇది అంత డిజిటల్ ఫార్మాట్ లో చేసారు. దీని కోసం ఒక టీం ని పెట్టి ఒక సాఫ్ట్ వేర్ కూడా డెవలప్ చేసారు. ఇప్పటికే కొన్ని వేల కార్డులు రెడీ అయ్యాయి. ఇంకా మిగతా సభ్యుల డాటా అంత కూడా ఫీడ్ చేస్తున్నారు. ఈ కార్డు ద్వారా ఏ టెస్ట్ అయినా చేయించుకోవచ్చు, వీళ్ళు 50శాతం మాత్రమే ఛార్జ్ చేస్తారు. ఇంకా కూడా తగ్గించడానికి ప్రయత్నిస్తున్నారు.

ఈ సందర్భంగా చిరంజీవి తాను కళామతల్లి కి చెందిన వాడినని, అందువల్ల ఆ కళామతల్లి బిడ్డగా తన తమ్ముళ్ళకి, మిగతా సోదర సోదరీమణులకు తాను ఈ పని చేస్తున్నట్టు చెప్పారు. ఇండస్ట్రీ లో ఏ కార్మికుడికి ఏ కష్టం వచ్చినా, ఆ కళామతల్లి బిడ్డగా నేను వాళ్ళకి నా వాళ్ళ ఆయన సేవ చేస్తున్నాను. ఇది నా ధర్మం మరియు నా బాధ్యత. నా కుటుంబాన్ని నేను కాపాడుకోవడంలో భరోసాగా ఉండాలని నేను చెప్పాలనుకున్నా. నా కళామతల్లి కుంటుంబంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న భావనతో, వాళ్ళ కుటుంబసభ్యుడిగా నేను చేస్తున్న పని ఇది, అంతే కానీ ఇది వేరే ఇంకే రకంగా చేస్తున్న పని కాదు అని చెప్పారు చిరంజీవి. ఈ విధంగా మరోసారి తన దాన సేవా గుణం చాటుకున్నారు చిరంజీవి.

మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు న్యూ ఇయర్ గిఫ్ట్…”భోళా శంకర్” నుంచి ‘స్వాగ్ ఆఫ్ భోళా’ విడుదల…

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న మాసివ్ యాక్షన్ ఎంటర్ టైనర్ “భోళా శంకర్”. ఈ చిత్రాన్ని స్టైలిష్ డైరెక్టర్ మేహర్ రమేష్ తెరకెక్కిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా ఇవాళ ఈ సినిమాలోని ప్రీ లుక్ పోస్టర్ స్వాగ్ ఆఫ్ భోళాను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు.

స్వాగ్ ఆఫ్ భోళాలో కంప్లీట్ మాస్ లుక్ లో ఉన్న మెగాస్టార్ స్టైలిష్ మేకోవర్ అదిరిపోయింది. ముఖ్యంగా మెగా ఫ్యాన్స్ కు స్వాగ్ ఆఫ్ భోళా న్యూ ఇయర్ గిఫ్ట్ గా భావించవచ్చు. స్వాగ్ ఆఫ్ భోళాతో పాటు సినిమా థీమ్ మ్యూజిక్ తో విడుదల చేసిన మోషన్ వీడియో కూడా ఆకట్టుకుంటోంది.

మెగాస్టార్ సరసన బ్యూటిఫుల్ హీరోయిన్ తమన్నా నటిస్తున్న భోళా శంకర్ చిత్ర షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. చిత్రంలో కీలక షెడ్యూల్ ను ఇటీవలే కంప్లీట్ చేశారు. కీర్తి సురేష్ చిరంజీవి సోదరిగా కనిపించనుంది.

యంగ్ సెన్సేషన్ మహతి స్వర సాగర్ ఈ చిత్రానికి సంగీతాన్ని అందిస్తున్నారు. డడ్లీ కెమెరామెన్‌గా వ్యవహరిస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్స్ సహకారంతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. కథా పర్యవేక్షణ సత్యానంద్.. మార్తాండ్ కే వెంకటేష్ ఎడిటర్‌గా బాధ్యతలను నిర్వర్తించనున్నారు. ఏ ఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనర్‌గా, కిషోర్ గరికపాటి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు.

నటీనటులు – చిరంజీవి, తమన్నా, కీర్తి సురేష్, రఘు బాబు, రావు రమేష్, మురళీ శర్మ, రవి శంకర్, వెన్నెల కిషోర్, తులసి, ప్రగతి, శ్రీముఖి, బిత్తిరి సత్తి, సత్య, గెటప్ శ్రీను, రశ్మీ గౌతమ్, ఉత్తేజ్, ప్రభాస్ శీను తదితరులు


పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు…

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

ఉదయపూర్ లో కన్నుల పండుగగా జరిగిన బందర్ ఎం పి బాలశౌరి కుమారుని వివాహం…

మచిలీపట్నం ఎం.పి. బాలశౌరి కుమారుడు అనుదీప్ వివాహం రాజస్థాన్ లోని ఉదయపూర్ లోని ప్రముఖ ప్యాలెస్ నందు వధువు స్నికితతో సోమవారం తెల్లవారు ఝామున ఘనంగా జరిగింది.. ఈ మధ్య కాలంలో సెలెబ్రిటీల వివాహాలన్ని డెస్టినేషన్ వెడ్డింగ్ రూపంలో జరుగుతున్న విషయం అందరికీ తెలిసిందే. రెండు రోజులు పాటు ఘనంగా జరిగిన వేడుకలలో భాగంగా సంగీత్, హల్ది, పెండ్లి కొడుకు, పెళ్లి కూతురు రిసెప్షన్ తో పాటు వివాహ వేడుకలు రంగ రంగ వైభవంగా జరిగి ఆహుతులను అలరించాయి.ఈ వేడుకలో సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలతో పాటు పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ఈ వివాహానికి ముఖ్య అతిథులుగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దంపతులు సతీ సమేతంగా హాజరై నూతన వధూవరులను అశ్వీరదించారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి వర్యులు పేర్ని నానితో పాటు, అరకు ఎం.పి.మాధవి, రాజ్యసభ సభ్యులు సి.ఎం.రమేష్, వేమిరెడ్డి ప్రభాకర రెడ్డి, శాసన సభ్యులు పార్థ సారధి, అనిల్ కుమార్, సింహాద్రి రమేష్, జోగి రమేష్, రెడ్డి శాంతి, గ్రీన్ కో MD చలమల శెట్టి గోపి, AMR గ్రూప్ అధినేత మహేశ్ రెడ్డి, నిర్మాత దాసరి కిరణ్ కుమార్, ప్రముఖ పారిశ్రామికవేత్తలు శ్రీనివాస నాయుడు, విడుదల కుమార స్వామి, భైరా దిలీప్ చక్రవర్తి తదితరులు పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదించారు.

ఆచార్య అంచనాలను పెంచేసిన సిద్దా టీజర్…

సిద్దా రోల్ లో రామ్ చరణ్ మైండ్  బ్లోయింగ్   పెర్ఫామెన్స్...   

 

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది .

ఆచార్య సినిమా షూటింగ్ దదాపు ముగింపు దశకు చేరుకుంది . ..ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … రామ్ చరణ్ సిద్దా క్యారెక్టర్ టీజర్ చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గా ఉంది .. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలింగ్ , మరియు యాక్షన్ సీన్స్ లోను , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని మెగా స్టార్ చిరంజీవి తో పోటీ పడి నటించారు .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ రోల్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ అండ్ టీమ్ .. ప్రతుతం సిద్దా టీజర్ గురించి అభిమానులు సోషల్ మీడియా లో బాగా మాట్లాడుకుంటున్నారు ..ఖైది no 150 వ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి తో – రామ్ చరణ్ ఒక సాంగ్ లో డాన్స్ చేసి ఆకాసేపు ప్రేక్షకులను అలరించారు , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించేది కాసేపు అయినా ప్రేక్షకులను బాగా అలరిస్తారు అని పూర్తి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .మొత్తానికి రామ్ చరణ్ టీజర్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది …


1 2