గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…


పాన్ ఇండియా మీదనే ఫోకస్ పెట్టిన రౌడీ హీరో…

                      

 ఒక్క హిట్ తో అందరికి సమాధానం చెబుతాను  అంటున్న రౌడీ హీరో...

                      

ఇండస్ట్రీ లో అవకాశాలు రావడమే చాలా కష్టం .. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళాలి .. ఇక అసలు విషయానికి వెళ్ళితే … ఓవర్ నైట్ స్టార్ హీరోలు అయిన హీరోల్లో రౌడీ హీరో విజయ దేవరకొండ ఒకరు .. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా కెరీర్ మొదలు పెట్టి , అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు .. అర్జున్ రెడ్డి ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారాడు .. ఇక అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ చేసిన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి ..

2018 లో డైరెక్టర్ పరుశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామిడీ మూవీ గీత గోవిందం . ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. గీత గోవిందం సినిమాల తరువాత విజయ్ దేవరకొండ చేసిన మూవీస్ ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి .. ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న సామెత విజయ్ దేవరకొండకు వర్తిస్తుంది ..

విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఉన్న ఈ రౌడీ హీరో కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఇక 2019 లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ .. ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ సాంగ్స్ , రామ్ ఇంటెన్స్ యాక్టిన్గ్ పూరీ డైలాగ్స్ , పూరీ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఈ మూవీ తో సక్సెస్ బిగ్ అందుకున్న డైరెక్టర్ పూరీ కొంత గ్యాప్ ఆ తీసుకొని రౌడీ హీరో విజయ్ తో పాన్ ఇండియా మూవీగా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు .. ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ..

ఇక విజయ్ లైగర్ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైన్ లో పెడుతున్నాడు .. తమిళ్ స్టార్ సూర్య కూడా సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు ఇటీవలే ‘ఈటి’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన బాధపడుతూ కూర్చోలేదు. బాలతోను .. వెట్రి మారన్ తోను రెండు సినిమాలు లైన్లో పెట్టాడు ఈ నేపథ్యంలో ఆల్రెడీ రెండు హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ రిలీజ్ కి మరో రెండు సినిమాలు రెడీ చేశాడు. ఆ సినిమాల్లో ‘గని’ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొక మూవీ మే 27న ‘ఎఫ్ 3’ పలకరించనుంది.

విజయ్ దేవరకొండ .. పూరి ఇద్దరూ కూడా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారే. కానీ కరోనా కారణంగా ‘లైగర్’ మూవీ లేటు అవుతూ వచ్చింది. ఆగస్ట్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ లోగానే తమ కాంబినేషన్లో వెంటనే మరో సినిమాగా ‘ జన గణ మన’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ..

ఇక విజయ్ రేస్ లో వెనుక పడినట్లుగా తెలుస్తుంది .. కానీ విజయ ఆశలు అన్ని లైగర్ మూవీ మీద నే ఉన్నాయి , ఈ మూవీ కనుక హిట్ అయితే విజయ్ కెరీర్ మరో లెవెల్ లో ఉంటుంది .. ఇక లైగర్ మూవీ తరువాత కూడా విజయ్ పూరీ తోనే జన గణ మన’ సినిమాను లైన్ లో ఉంది , ఆ తరువాత సుకుమార్ , శివ నిర్వాణ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. హిట్ అందుకికొని చాలా కాలం అయింది అని అంటున్న ప్రేక్షకులకు విజయ్ లైగర్ మూవీ తో గట్టిగా సమాధానం చెబుతాను అని ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది…


జనగణమన మొదలు పెట్టిన విజయ్ … పూరి

బాక్సర్ నుండి ఆర్మీ ఆఫీసర్ లుక్ లోకి మారిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ…

రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , క్రియేటివ్ గా సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒకరు .. పూరి డైలాగ్స్ , హీరో క్యారెక్టరైజేషన్ , హీరో కి ఒక డిఫరెంట్ మ్యానరిజమ్స్ క్రియేట్ చేయాలన్న , ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సృష్టించాలి అన్నా అది కేవలం డైరెక్టర్ పూరీ కె సాధ్యం .. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో సినిమాలు గురించి చెప్పాలి అంటే శివ సినిమాకు ముందు శివ సినిమా తరువాత అని అనేవారు , కానీ ఇప్పుడు ఇప్పుడు పూరీ జగన్నాధ్ రాకముందు , పూరీ జగన్నాధ్ వచ్చినా తరువాత అని అంటున్నారు ..

పూరీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కంటిన్యూ గా చేస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు బాడ్ రివ్యూస్ వచ్చాయి .. దాంతో పూరీ జగన్నాద్ టైమ్ అయిపోయింది అని అనుకున్నారు ప్రేక్షకులు , ఈ కామెంట్స్ పూరీ ని చాలా బాధపెట్టాయి , అలానే పూరీ మధ్యలో ఫైనాన్షియల్ గా కూడా కొన్ని సమస్యలు ఎదురుకొన్నారు .. అయితే పూరి పెన్ పవర్ మాత్రం తగ్గలేదు . 2019 లో డైరెక్టర్ పూరీ – ఎనర్జిటిక్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇస్మార్ట్ శంకర్ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

ఇక అసలు విజయానికి వెళ్ళితే .. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ – విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమా గా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నారు .. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మరో మెట్టు ఎక్కుతున్నాడు .. ఈ క్రమంలో లైగర్ మూవీ తరువాత డైరెక్టర్ పూరీ నెక్స్ట్ మూవీ ఏమిటి అనే బుజ్ సోషల్ మీడియా లో క్రియేట్ అయింది .. అసలు పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన మూవీ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరిగింది .. అసలు పూరీ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ – జన గణ మన మూవీ మహేష్ బాబు తో తెరకెక్కిద్దాం అని అనుకున్నారు , కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ..’విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుగుతుంది .. ఈ క్రమంలో మల్లి పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన” మూవీ ఏ స్టార్ హీరోతో ఈ మూవీ తెరకెక్కుతున్నదో అనే వార్తలు సోషల్ మీడియా లో బాగా వినపడినాయి .. అయితే ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి డైరెక్టర్ ఫుల్ స్టాప్ పెడుతూ .. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ తో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేసాడు .. ఇది పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం… విజయ్ దేవరకొండ లాంటి పెర్ఫామర్‌ హీరోగా ఉండటంతో.. సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా ఉన్నాయి .. . ఈ సినిమా కథకు సంబంధించి ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇదొక ఫిక్షన్ కథ అని చెప్పిన పూరి జగన్నాథ్… తన దేశం కోసం, తన దేశ పౌరుల కోసం ఒక సైనికుడు కనే కలనే ఈ సినిమా అని తెలిపారు. దేశభక్తి, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా చేయాలని చాలా ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని… విజయ్ దేవరకొండ వల్ల ఇన్నాళ్లకి ఆ కల నిజం కాబోతోందని చెప్పారు.

ఇదే ప్రెస్ మీట్‌లో నటి, నిర్మాత చార్మి మాట్లాడుతూ.. జన గణ మన సినిమాలో పూర్తి భిన్నమైన విజయ్ దేవరకొండను చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ఎగ్జయిటింగ్ అనిపించిందని.. ఇందులో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

. విజయ్ సబ్జెక్ట్‌కి పర్ఫెక్ట్ అని భావించడంతో అతనితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న జన గణ మన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు పూరి ప్రకటించేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదలకు ముందే.. మరో మూవీ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది..


పట్టువదలని పూరీ – అన్నయ్య తో సినిమా గ్యారెంటీ …

చిరు తో సినిమా తగ్గేదే లేదంటున్న పూరి...

              

2007 లో మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ ప్రభుదేవా కాంబినేషన్ లో వచ్చిన సినిమా శంకర్ దాదా జిందాబాద్ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది . శంకర్ దాదా జిందాబాద్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి సినిమాలకు ఫుల్ స్టాప్ పెట్టి రాజకీయాల్లోకి వెళ్లారు .. మెగాస్టార్ చిరంజీవి సుమారు 10 ఏళ్ళు గ్యాప్ తీసుకొని ఖైదీ no 150 సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు . అన్నయ 150 వ సినిమా కోసం చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చాలా లాంగ్ గ్యాప్ తరువాత అన్నయ్య రీ ఎంట్రీ ఇస్తుండటం , మరియు 150 వ సినిమా కాబట్టి మెగా స్టార్ తన 150 వ సినిమా కోసం చాలా స్టోరీస్ విన్నారు , చాలా మంది డైరెక్టర్స్ లైన్ లో ఉన్నారు , చిరంజీవి 150 వ సినిమా కాబట్టి , మొదటగా ఈ ఆఫర్ డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు అవకాశం వచ్చింది , అయితే డైరెక్టర్ పూరీ దగ్గర స్క్రిప్ట్ లేదు జస్ట్ “ఆటో జానీ ” అన్న ఒక్క టైటిల్ ఒక్కటే ఉంది , ఈ టైటిల్ ను మెగా స్టార్ కోసం డైరెక్టర్ పూరీ ఎప్పుడో రిజిస్టర్ చేయించారు .. మెగా స్టార్ చిరంజీవి 150 వ సినిమా కోసం డైరెక్టర్ పూరీ ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసి నేరేషన్ కూడా ఇచ్చారు , కానీ మెగా స్టార్ చిరంజీవికి ఫస్ట్ ఆఫ్ నచ్చింది కానీ సెకండ్ ఆఫ్ , మరియు క్లైమాక్స్ నచ్చకపోవడంతో పూరీ ఆఫర్ మిస్ అయింది ..

డైరెక్టర్ పూరీ మిస్ చేసుకున్నాకా ,ఈ ఛాన్స్ డైరెక్టర్ వి వి వినాయక్ కు లభించింది , మెగాస్టార్ చిరంజీవి ది – డైరెక్టర్ వి .వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఠాగూర్ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది , మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు .. మెగా స్టార్ చిరంజీవికి ఈ సినిమా 150 వ సినిమా కావడం విశేషం , ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది. ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు ..ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ సఫీస్ దగ్గర బిగెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నర్సింహా రెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి ఫుల్ స్పీడ్ పెంచి వరుసగా సినిమాలు లైన్ లో పెడుతున్నారు ఈ నేపథ్యంలో కొరటాల శివ డైరెక్షన్ లో ఆచార్య సినిమా , మరియు మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ , మరియు డైరెక్టర్ మెహెర్ రమేష్ డైరక్షన్ లో భోళా శంకర్ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. మెగా స్టార్ చిరంజీవి 154 వ సినిమా డైరెక్టర్ బాబీ తో ఎనౌన్సమెంట్ చేశారు ఈ సినిమాకు సంబంధించి పూజా కార్య క్రమాల్లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ హాజరు అయ్యారు . ఈ క్రమంలో మల్లి డైరెక్టర్ పూరి తో మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో త్వరలో , సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. పూరి జగన్నాథ్ కు మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చెయ్యాలని బలంగా ఉంది .. ప్రస్తుతము మెగా స్టార్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , అలానే డైరెక్టర్ పూరి చేతిలో లైగర్ అనే పాన్ ఇండియా సినిమా ఉంది . మరి మొత్తానికి డైరెక్టర్ పూరి లైగర్ సినిమా పూర్తి అయిన తరువాత , గాని మరొక సినిమా ఎనౌన్సుమెంట్ చెయ్యరు , అలానే మెగా స్టార్ సినిమాల లిస్ట్ చాలా పెద్దగానే ఉంది , చిరంజీవి కోసం డైరెక్టర్ మారుతి కూడా ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేస్తున్నారు అని వార్తలు వస్తున్నాయి , డైరెక్టర్ పూరి కి గత కొంత కాలంగా బలమైన హిట్స్ లేవు పోకిరి , టెంపర్ లాంటి హిట్స్ తప్ప మరి ఏ సినిమాలు ఆశించినంత హిట్స్ అందుకోలేదు , ప్రస్తుతము పూరి ఫోకస్ అంతా విజయ్ దేవరకొండ నటిస్తున్న లైగర్ సినిమా మీదనే ఉంది , అయితే తాజాగా పూరి -మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ గురించి ఓ వార్త సోషల్ మీడియా లో హల్ చల్ అవుతుంది .. చిరంజీవి 154వ సినిమా ఓపెనింగ్ రోజు పూజా కార్యక్రమాల్లోడైరెక్టర్ పూరి కనిపించారు. ఆయన ప్రత్యేక గెస్ట్ గా హాజరై ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్చాన్ చేసారు. అక్కడికి పూరితో పాటు చాలా మంది దర్శకులు వచ్చారు. కానీ పూరి మాత్రం సమ్ థింగ్ స్పెషల్ గానే హైలైట్ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆటోజానీని మళ్లీ తెరపైకి తెస్తున్నారా? అన్న సందేహాలు మొదలయ్యాయి. మెగాస్టార్ తో సినిమా డైరెక్ట్ చేసే ఛాన్స్ పూరి కి వస్తే మరొక అతి పెద్ద ఇండస్ట్రీ హిట్ ఖాయం .. మరి వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా అంటే అంచనాలు భారీగా ఉంటాయి , మొత్తానికి పూరి – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సీనిమా కోసం మెగా అభిమానులు ఎదురు చూస్తున్నారు , ఈ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు ఉంటుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే …