పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు…

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

అల్లు అర్జున్ కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో ‘పుష్ప’ 116 కోట్ల గ్రాస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.

పుష్ప రాజ్ అరాచకం మాములుగా లేదు…

 ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ హై వోల్టేజ్ యాక్షన్...

   

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి … వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా సుకుమార్ తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు .. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. .ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే అద్భుతమైన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో అల్లు అర్జున చాలా పవర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఈ సినిమాలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి .. అలానే ట్రక్ డ్రైవర్ గా అల్లు అర్జున నటన సూపర్బ్ గా ఉంది . అల్లు అర్జున యాక్టింగ్ లోని మరో కోణాన్ని సుకుమార్ బలే ప్రెజెంట్ చేసారు , ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లోనూ , మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లోను మంచి రెస్పాన్స్ వస్తుంది .. అదే విధంగా ఈ ట్రైలర్ లో అనసూయ , మరియు సునీల్ డైలాగ్స్ మరియు వారి లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు .ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన ఫహద్ ఫాసిల్ ట్రైలర్ చివరి షాట్ లో మంచి విలనిజం తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు . పుష్ప ట్రైలర్ కు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ వస్తుంది , అలానే ఈ ట్రైలర్ తో సినిమా మీద ఒక్క సారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి .డైరెక్టర్ సుకుమార్ -అల్లు అర్జున పడిన కష్టం ట్రైలర్ లో కనబడుతుంది .. అలానే మైత్రి మూవీ మేకర్స్ సినిమా విషయంలో ఖర్చు కు ఏమాత్రం వెనుకాడలేదు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది .. పుష్ప సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇంత అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ బాగా సంతోసపడుతున్నారు ..

.

అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన సమంత…

పుష్ప సినిమా కోసం ఐటమ్ సమంత సాంగ్...

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ..పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ,, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు .. పుష్ప సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. ..పుష్ప సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు , తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎనౌన్సుమెంట్ చేస్తూ ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..ఈ పోస్టర్ లో డిసెంబర్ 6 న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ఎనౌన్సమెంట్ చేశారు .. .ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .ఈ సినిమా లో డైరెక్టర్ సుకుమార్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు . సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ కంపల్సరీ గా ఉండాలిసిందే , సుకుమార్ మొదటి సినిమా నుండి చివరి సినిమా రంగస్థలం సినిమా వరకు తన ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పక్కాగా ఉంటుంది ..పుష్ప సినిమా విషయంలో నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు , ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ సమంత ను రంగంలోకి దింపారు ..

ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సమంత అద్భుతమైన పోస్టర్‌ను షేర్ చేసింది .. ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్ గా ఉంటుంది అని డైరెక్టర్ సుకుమార్ పూర్తి నమ్మకంగా ఉన్నారు …సమంత షేర్ చేసిన పిక్ లో సామ్ మొహం చూపకపోయినా, రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న సామ్ తో పాటు ఈ పాట ఎలా ఉండబోతుందో ఓ ఐడియా ఇచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నారు .పుష్ప సినిమాకు సంబంధించి సమంత షేర్ చేసిన పిక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది .. పుష్ప సినిమా లోని ఈ ఐటమ్ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు , మరి డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ – సమంత లతో ఐటమ్ సాంగ్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..

క్రేజీ ఆఫర్ దక్కించుకున్న బుచ్చి బాబు…

సీనియర్ హీరోను లైన్లో పెట్టిన బుచ్చిబాబు

క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ శిష్యుడు బుచ్చి బాబు దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా ‘ఉప్పెన” .. మెగాస్టార్‌ చిరంజీవి మేనల్లుడు, సుప్రీంహీరో సాయి తేజ్ తమ్ముడు పంజా వైష్ణవ్ తేజ్ , హీరోగా లాంచ్ చేస్తూ , అలానే సుకుమార్ డైరెక్షన్ టీమ్ లో ఒకరు అయిన డైరెక్టర్ బుచ్చి బాబు ఉప్పెన సినిమా తోనే ఇద్దరు టాలీవుడ్ కి పరిచయము అయ్యారు .. మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని టాప్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరారు దర్శకుడు బుచ్చిబాబు .. ఉప్పెన సినిమా తరువాత బుచ్చిబాబు మరొక సినిమా ఎనౌన్సమెంట్ చేయలేదు .. మొదటి సినిమా తోనే భారీ హిట్ అందుకున్న బుచ్చిబాబు , ఆ తరువాత ఏ స్టార్ హీరోతో సినిమా ఎనౌన్సుమెంట్ చేస్తారో అన్న విషయము ఫై ఎటువంటి క్లారిటీ లేదు .. జనాలు కరోనా భయం ఉన్నా కూడా కంటెంట్ బాగుంటే థియేటర్లకు వస్తారని ఉప్పెన సినిమా నిరూపించింది. గత ఏడాదిలోనే రావాల్సిన ఉప్పెన కరోనా వల్ల ఆలస్యం అయ్యింది. మంచి సమయంలో విడుదల అయిన ఉప్పెన వంద కోట్లకు పైగా రాబట్టింది. ఉప్పెన సినిమా సూపర్ హిట్ అయిన నేపథ్యంలో కొందరు నిర్మాతలు డైరెక్టర్ బుచ్చిబాబు కి అడ్వాన్స్ లు ఇచ్చేందుకు ముందుకు వచ్చారు ..బుచ్చి బాబు తదుపరి సినిమా ఏంటీ అంటే అంతా ఒకే మాట చెప్తున్నారు… ఎన్టీఆర్ హీరోగా బుచ్చి బాబు దర్శకత్వంలో సినిమా రాబోతుంది అని సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి ..

సోషల్ మీడియా లో డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా గురించి గత కొన్ని రోజులు గా న్యూస్ బాగా వైరల్ అయింది .. తాజాగా ఈ కాంబినేషన్ గురించి మరోసారి న్యూస్ వినిపిస్తుంది .. డైరెక్టర్ బుచ్చిబాబు ఒక పెద్ద హీరోకు స్టోరీ లైన్ చెప్పాను. ఆయన ఓకే చెప్పాడు.. ప్రస్తుతం స్క్రిప్ట్ వర్క్ జరుగుతుందని తెలుస్తుంది .. ఇది ఎన్టీఆర్ అభిమానులకు ఖచ్చితంగా గుడ్ న్యూస్ అని తెలుస్తుంది .. ఎన్టీఆర్ కోసం ఒక ప్రాంతీయ కథను సిద్దం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి ..ఎన్టీఆర్ తో డైరెక్టర్ బుచ్చి బాబు సినిమా దాదాపుగా కన్ఫర్మ్ అయ్యింది. ప్రస్తుతం ఆర్ ఆర్ ఆర్ సినిమా ప్రమోషన్స్ లో జాయిన్ అయ్యేందుకు సిద్దం అవుతున్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్నట్లుగా అధికారిక ప్రకటన వచ్చింది. కొరటాల శివ సినిమా తర్వాత ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఒక సినిమాను ఎన్టీఆర్ సినిమా చేయాల్సి ఉంది. మొత్తానికి ఉప్పెన సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని తారక్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ డైరెక్టర్ బుచ్చుబాబు సిద్దంచేసుకున్నారు .. మరి డైరెక్టర్ బుచ్చిబాబు – ఎన్టీఆర్ కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అనే విషయం పై క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే …

బిడ్డా ఇది నా అడ్డా… అల్లు అర్జున్ వార్నింగ్

పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ రిలీజ్

     

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి కి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . పుష్ప సినిమా టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎందుకు చెప్పారో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో మటుకు సాంగ్స్ , ఫైట్స్ , లొకేషన్స్ , హీరోయిజం , బన్నీ క్యారెక్టర్ లో సుకుమార్ ఎక్కడ తగ్గట్లేదు .. పుష్ప సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ చేసి , మూడు సాంగ్స్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం , ఆర్య , ఆర్య 2 సినిమాల తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రావడం అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి .

అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులు పుష్ప సీనిమా గురించి గోల చేస్తున్నారు .. పుష్ప సినిమా సబ్జెక్ట్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్ నటిస్తున్నది .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఈ క్రమంలో ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే నాల్గో పాట ను నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది సుకుమార్ టీమ్ ..ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది .. పుష్ప సినిమా నుండి వస్తున్న నాల్గో సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా అభిమానులను అలరించనుంది . సుకుమార్ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఒక స్టైల్ ఉంది అలానే మాస్ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు .. మొత్తానికి నవంబర్ 19న పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు …