పవర్ స్టార్ అభిమానులకు విజువల్ ట్రీట్ ఇవ్వనున్న హరీష్ శంకర్ …

పవన్ కళ్యాణ్ లోని మరో యాంగిల్ చూపిస్తాను అంటున్న హరీష్ శంకర్ …

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. పవన్ కళ్యాణ్ చేతిలో హరి హర వీర మల్లు , మరియు భీమ్లా నాయక్ సినిమాలు ఉన్నాయి , వీటిలో ముందుగా భీమ్లా నాయక్ సినిమా రిలీజ్ కానుంది , భీమ్లా నాయక్ సినిమా తరువాత , హరి హర వీర మల్లు సినిమా రిలీజ్ కు సిద్ధంగా ఉంది , పవన్ కళ్యాణ్ హరి హర వీర మల్లు సినిమా తరువాత డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు .

పవన్ కళ్యాణ్ మరియు డైరెక్టర్ హరీష్ శంకర్ ది హిట్ కాంబినేషన్ , గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ” గబ్బర్ సింగ్ ” ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ కు గబ్బర్ సింగ్ హిట్ అవ్వడమే కాకుండా ఈ సినిమా తో స్టార్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు .. డైరెక్టర్ హరీష్ శంకర్ గబ్బర్ సింగ్ ఇండస్ట్రీ హిట్ అందుకున్నాకా మల్లి ఆ రేంజ్ హిట్ కోసం గట్టిగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ కు , పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో మల్లి సెకండ్ ఛాన్స్ రావడం , ఈ సారి గబ్బర్ సింగ్ కంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ సినిమా తీయాలి అని ఎంతో కసి మీద ఉన్నట్లు తెలుస్తుంది .. డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమాకు సంబంధించి ఫస్ట్ లుక్ మరియు టైటిల్ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబినేషన్ రెండొవ సారి రిపీట్ అవుతుంది కాబట్టి , గబ్బర్ సింగ్ కంటే మించిపోయే బ్లాక్ బస్టర్ హిట్ సినిమా ఇవ్వడానికి డైరెక్టర్ హరీష్ శంకర్ , సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కావడం లేదు అని తెలుస్తుంది .. ఈ సినిమా టైటిల్ , “భవదీయుడు భగత్ సింగ్” అనే టైటిల్ ను ఖరారు చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసింది , ఈ పోస్టర్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్టైలిష్ మరియు యంగ్ లుక్‌లో కనిపించడం చూసి పవన్ అభిమానులు బాగా సంతోష పడుతున్నారు ..ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఈ సినిమా సబ్జెక్ట్ హై ఓల్టేజి పొలిటికల్ థ్రిల్లర్ గా రాబోతుంది అని వార్తలు వినిపిస్తున్నాయి .. అంతే కాదు , ఈ సినిమా పాలిటిక్స్ మీద కొన్ని అంశాలు డైరెక్టర్ హరీష్ శంకర్ టచ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. గతంలో పవన్ కళ్యాణ్ – పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా లో కూడా కొన్ని పొలిటికల్ పాయింట్స్ ను డైరెక్టర్ పూరి జగన్నాథ్ చూపించారు .. 2012 లో వచ్చిన కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తరువాత పవన్ కళ్యాణ్ – డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో రాబోతున్న భవదీయుడు భగత్ సింగ్” సినిమా లో కూడా కొన్ని ఢిల్లీ పోల్టిక్స్ మీద కొన్ని అంశాలు కచ్చితంగా ఉంటాయని డైరెక్టర్ హరీష్ శంకర్ సినిమా పోస్టర్ రిలీజ్ చేసి ప్రేక్షకులకు చిన్న హింట్ ఇచ్చేసారు .. మొత్తానికి డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ తో సాలిడ్ కంటెంట్ ఉన్న సినిమా తో ప్రేస్క్షకుల ముందుకు వస్తున్నట్లు సినిమా పోస్టర్ చూస్తే అర్ధము అవుతుంది .. మొత్తానికి డైరెక్టర్ హరీష్ శంకర్ – పవన్ కళ్యాణ్ కాంబో లో వస్తున్న సినిమా లో పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో రాబోతుంది అని సోషల్ మీడియా లో వచ్చే వార్తల్లో నిజం ఎంత వరకు ఉన్నదో తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే ..

కన్నడ సినీ పరిశ్రమలో పెద్ద విషాదం …


” కన్నడ నటుడు రాజ్‌కుమార్‌ ఇక లేరు ” ..

కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హీరోగా సంతోష్ ఆనంద్ రామ్ దర్శకత్వంలో అటు కన్నడ మరియు తెలుగులో విడుదలైన సినిమా “యువరత్న”. కన్నడ సినీ ఇండస్ట్రీ లో హీరో పునీత్ రాజ్ కుమార్ కు భారీ అభిమానులు ఉన్నారు .. పునీత్ రాజ్ కుమార్ ను కన్నడ పవర్ స్టార్ గా ఫుల్ పాపులర్ అయ్యారు .. పునీత్ రాజ్ కుమార్ ను ముద్దుగా అప్పు అని కూడా పిలుస్తారు ,కన్నడ లో వచ్చిన అప్పు అనే సినిమా సూపర్ హిట్ కావడంతో అప్పు అని పిలవడం స్టార్ట్ చేశారు ..
పునీత్ రాజ్ కుమార్ , హీరోగా నే కాకుండా సింగర్ గా నిర్మాతగా టెలివిజన్ రంగంలో కూడా పాపులర్ అయ్యారు .. కన్నడ కంటినో రాజ్ కుమార్ కి ముగ్గురు కొడుకులు మొదటి కొడుకు శివ రాజ్ కుమార్ సినిమా హీరో , రెండొవ కొడుకు రాఘవేంద్ర రాజ్ కుమార్ , దర్శకుడు గా నిర్మాతగా మరియు కొన్ని సినిమాల్లో హీరోగా కూడా యాక్ట్ చేసారు , ఇప్పుడు మూడవ కొడుకు పునీత్ రాజ్ కుమార్ హీరోగా కన్నడలో 29 సినిమాలు చేసి పవర్ స్టార్ అని గుర్తింపు తెచ్చుకున్నారు …. పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు జిమ్ చేస్తూ గుండెపోటుకు గురైన పునీత్‌రాజ్ కుమార్ , కన్నడ ఇండస్ట్రీ లో ఈ వార్త వినగానే అక్కడ అభిమానులందరూ ఒక్కసారిగా బిగ్ షాక్ కి గురి అయ్యారు .. ప్రస్తుతము , బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి ICUలో చేరిన పునీత్ రాజ్ కుమార్ , కుటుంబ సభ్యులను ఆస్పత్రిలో పరామర్శించిన కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మరియు , ఆస్పత్రి వద్దకు భారీగా చేరుకున్న పునీత్ రాజ్ కుమార్ అభిమానులు .. ఐదేళ్ల వయసులోనే బాలనటుడిగా ఇండస్ట్రీ లోకి అడుగు పెట్టారు .. పునీత్ రాజ్ కుమార్ గురించి ఈ వార్త విని అభిమానులందరూ సోషల్ మీడియా లో తమ అభిప్రాయాన్ని వ్యక్త పరుస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ బ్రతికి రావాలి , అని తమ అభిమానులు పూజలు చేస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ వార్త విని నటుడు కృష్ణం రాజు వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలిపారు .. కన్నడ స్టార్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ ఈ రోజు ఉదయాన్నే జిమ్ చేస్తూ గుండెపోటు రావడం , అలా వెంటనే
బెంగళూరులోని విక్రమ్ ఆస్పత్రి కి తీసుకువెళ్లడం , కొంత ఆలస్యం అవ్వడం వల్లన తుది శ్వాస విడిచారు .. పునీత్ రాజ్ కుమార్ మొదటి సినిమా అప్పు తో బ్లాక్ బస్టర్ హిట్ హిట్ అందుకొని ఒక్కో మెట్టు ఎక్కి , నటుడిగా , సింగర్ గా నిర్మాత గా కన్నడ ఇండస్ట్రీ కి ఎన్నో సేవలు చేశారు .. పునీత్ రాజ్ కుమార్ ఎప్పుడు ట్విట్టర్ లోను సోషల్ మీడియా లో ఇప్పుడు యాక్టివ్ గా ఉండే వారు , పునీత్ రాజ్ కుమార్ చివరిగా చేసిన ట్వీట్ , బెస్ట్ విషెస్ టూ బజరంగీ భాయిజాన్ , అంతే కాకుండా పునీత్ రాజ్ కుమార్ చేసిన కొన్ని సినిమాలకు నిర్మాతగా వ్యహరించి బిగ్ సక్సెస్ అందుకున్నారు .. పునీత్ రాజ్ కుమార్ విక్రమ్ ఆస్పత్రి దగ్గర అభిమానులు పవర్ స్టార్ , అప్పు అని ఒక్క సారి అయిన చూడాలి అని అరుస్తున్నారు .. పునీత్ రాజ్ కుమార్ చాలా గొప్ప సింగర్ , తాను నటించిన
సినిమాలకు కూడా కొన్ని పాటలు పాడి అలరించారు .. పునీత్ రాజ్ కుమార్ ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు , ఆరోగ్యమే మహాభాగ్యం అనే విషయం అని నమ్మి జిమ్ లోనే ఎక్కువ సేపు కసరత్తులు చేస్తుంటారు .. కన్నడ ఇండస్ట్రీ లో ఈ వార్త విని కన్నడ ఇండస్ట్రీ లోని డైరెక్టర్స్ , అందరూ ఈ విషయాన్ని నమ్మలేకపొతున్నారు ..

టాలీవుడ్ కి మరో రాక్ స్టార్…

ర్యాప్ రాక్ షకీల్

మంచి బజ్ తో అక్టోబర్ 29 న రిలీజ్ ఐన మిషన్ 2020 కి సంగీతాన్ని అందిచాడు , ఈ సినిమా మంచి బజ్ రావటానికి ముఖ్యమైన కారణాల్లో రాప్ రాక్ షకీల్ మ్యూజిక్, ‘అల్లుడు గారెలు వండలా… అనే సాంగ్ జనాల్లో ఇప్పటికే జనాల్లో నానుతూ ఉంది. ఈ సినిమా తర్వాత డైరెక్టర్ ‘సముద్ర’ సినిమా కి మ్యూజిక్ డైరెక్టర్ గా అవకాశాన్ని అందుకున్నాడు…

రాప్ రాక్ షకీల్ రణం 2 సినిమాతో రాగాలు పలికించి , అలా మొదలైన ప్రస్తానం… మిషన్ 2020 నుండి సక్సెస్ ఫుల్ గా సంగీతాన్ని అందించాడు . చిన్న సినిమా ప్రొడ్యూసర్స్ కి వరం లా దొరికాడు . ఇప్పుడు తన పాటలు విపరీతంగా ప్రేక్షకులని అలరించడం తో పెద్ద పెద్ద సినిమా టీమ్స్ రాప్ రాక్ షకీల్ నీ వారి సినిమాలలో మ్యూజిక్ డైరెక్టర్ గా పెట్టుకోవాలని ఆఫర్స్ కూడా వస్తున్నాయి . త్వరలో ఎవ్వరూ ఊహించని పెద్ద సినిమా తో రాబోతున్నాడు , త్వరలో వీటి వివరాలు అధికారికంగా ప్రకటించనున్నారు…

ఇప్పటి వరకు రాప్ రాక్ షకీల్ మ్యూజిక్ అందించిన సినిమాల వివరాలు…

2017 – చిన్ని చిన్ని ఆశలు నాలో రేగేనే
2018 – రా రా (2018 చిత్రం)
2019 – ఆపరేషన్
2019 – మనసంతా నువ్వే
2021 – మిషన్ 2020
TBA – గంధర్వ
TBA – దర్జా

వీటితోపాటు రాప్ రాక్ షకీల్ చేయబోతున్న సినిమాలో యాక్షన్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ వాళ్ళు నిర్మిస్తున్న సినిమా గంధర్వ ( జార్జ్ రెడ్డి హీరో సందీప్ ) , దర్జా ( అనసూయ , సునీల్ ) . వీటితో పాటు రాప్ రాక్ షకీల్ యొక్క పనితీరు తెలుగు లోనే కాదు ఇతర భాషల దర్శక నిర్మాతలకు నచ్చి వారి సినిమాలకు మ్యూజిక్ డైరెక్టర్ గా చేయమని అప్రోచ్ అయినట్లు తెలుస్తుంది.

అతి తక్కువ సమయం లో ఇంతటి స్థాయికి రావడం రాప్ రాక్ షకీల్ యొక్క కృషి , పట్టుదల. వీటన్నిటి మధ్య రాప్ రాక్ షకీల్ తో పని చేసిన దర్శక నిర్మాతలు ఈ విధంగా చెప్పారు ” దేవీశ్రీ ప్రసాద్ , తమన్ , మణిశర్మ తర్వాత ఆ స్థాయి లో మ్యూజిక్ కొట్టగలిగే డైరెక్టర్ రాప్ రాక్ షకీల్ అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదు. “

అలాగే కరోనా విలయతాండవం చేస్తున్న సమయంలో లో ప్రజల కోసం సోషల్ అవార్నెస్ కోసం కరోనా పై పాడిన పాటతో ఆయన్ని మరింత దగ్గర చేసి ప్రజల్లో మంచి పేరు తెచ్చిపెట్టింది …

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ తో మెగా స్టార్ పాన్ ఇండియా మూవీ …

హాట్ టాపిక్ గా మారుతున్న డైరెక్టర్ కృష్ణవంశీ-మెగాస్టార్ కాంబినేషన్ ...

               

క్రిష్ణ వంశీ సినిమాలు అంటేనే ఎదో కొత్తదనం ఉంటాయి .. తాను తీసిన సినిమాలు అన్నిటిలో ప్రేక్షకులకు ఎదో కొత్తదనం చూపించాలి అని ప్రతి సారి ప్రయత్నిస్తుంటాడు .. టాలీవుడ్ ఇండస్ట్రీ లో డైరెక్టర్స్ అందరిదీ ఒక దారి అయితే , డైరెక్టర్ క్రిష్ణ వంశీ ది ఒక దారి , తాను ఎంచుకున్న సబ్జెక్ట్స్ , మరియు ఫ్యామిలీ ఎమోషన్స్ , సెంటిమెంట్స్ , ప్రేక్షకులు చాలా త్వరగా కనెక్ట అవుతారు .. రొటీన్ సినిమాలకు విభిన్నంగా క్రిష్ణ వంశీ సినిమాలు ఉంటాయి .. ఒక సారి తీసిన జానర్ సినిమాను మల్లి అదే రిపీట్ చెయ్యమని నిర్మాతలు కోరి మరి అడగగా ముక్కు సూటిగా చెప్పే అతి కొద్దీ మంది దర్శకుల్లో కృష్ణ వంశీ ఒకరు .. తన సినిమాలు హిట్ అండ్ ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు క్రిష్ణ వంశీ తనదైన పంధాలో ముందుకు వెళ్తున్నారు ..క్రిష్ణ వంశీ కి ఒక సరి అయిన హిట్ పడాలిసిన టైమ్ వచ్చింది .. 20009 లో డైరెక్టర్ క్రిష్ణ వంశీ – హీరో శ్రీకాంత్ కాంబినేషన్ లో వచ్చిన 100 వ సినిమా “మహాత్మ ” .. ఈ సినిమా శ్రీకాంత్ కు 100 వ సినిమా కావడం విశేషం.. ఖడ్గం సినిమా తరువాత శ్రీకాంత్ తో మల్లి కృష్ణ వంశీ సినిమా డైరెక్ట్ చేయడం , ఈ సినిమా ట్రైలర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. మహాత్మ సినిమా తరువాత కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన మొగుడు , పైసా , గోవిందుడు అందరివాడేలే , నక్షత్రం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచాయి .. గోవిందుడు అందరివాడేలే సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ గా నిలిచింది .. కృష్ణ వంశీ టైమ్ అయిపోయింది అని ఇండస్ట్రీ లో ఉన్న వారందరు అనుకున్నారు , డైరెక్టర్స్ కు హిట్స్ అండ్ ఫ్లాప్స్ సహజం , ఒక్క హిట్ సినిమా పడితే చాలు మల్లి ఫుల్ ఫామ్ లోకి వస్తాడు .. గోవిందుడు అందరివాడేలే సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిన , బెస్ట్ స్టోరీ గా నంది అవార్డు గెలుచుకుంది .. టాలీవుడ్ ఇండస్ట్రీ కృష్ణ వంశీ నీ మర్చిపోయిన తాను తీసిన సినిమాలను మర్చిపోలేరు . కృష్ణ వంశీ డైరెక్షన్ లో వచ్చిన నిన్నే పెళ్ళాడుతా సినిమా ఒక ట్రెండ్ సెట్ చేసింది .. ప్రస్తుతము కృష్ణ వంశీ రంగ మార్తాండ అనే సినిమాను తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి క్యారెక్టర్లను పరిచయం చేయడానికి వాయిస్ ఓవర్ ని మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. సినిమా సినిమాకు ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా ప్రోమోట్ చేస్తారు , మెగాస్టార్ చిరంజీవి ఇచ్చారు. సినిమా సినిమాకు ఒక్కో డైరెక్టర్ ఒక్కో లా ప్రోమోట్ చేస్తారు , మెగాస్టార్ చిరంజీవి తో వాయిస్ ఓవర్ చేప్పిస్తే బాగుటుంది అని కృష్ణ వంశీ డిసైడ్ అయ్యారు .. కృష్ణ వంశీ ఒక సినిమా పూర్తి అయిన తరువాత నే నెక్స్ట్ సినిమా ఎమౌంసెమెంట్ చేస్తారు , ప్రస్తుతము కృష్ణ వంశీ దృష్టి అంతా రంగమార్తాండ సినిమా మీదనే ఉంది … ఈ సినిమా కంప్లీట్ అయితే నే తాను నెక్స్ట్ సినిమా ఎనౌన్సుమెంట్ చేస్తారు .. అయితే సోషల్ మీడియా లో కొన్ని రోజుల నుంచి కృష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం సినిమా మీద కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి .. క్రిష్ణ వంశీ వందేమాతరం అన్న పేరుతో దేశ భక్తి చిత్రం తీయాలని చాలా కాలంగా అనుకున్నాడు. ఆ మూవీ కోసం చాలా రిసెర్చ్ కూడా చేశాడు.
తాను ఎన్ని మంచి సినిమాలు చేసినా తన పేరు చెప్పగానే గుర్తుకువచ్చేలా వందేమాతరం సినిమా ఉండాలన్నదే క్రిష్ణ వంశీ ఆలోచన అని పలు ఇంటర్వ్యూ లో తెలిపారు . ఈ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవినే హీరో అనుకున్నాడు అని కొన్ని కామెంట్స్ కూడా వినిపించాయి . అయితే ఎందుకో ఆ ప్రాజెక్ట్ మాత్రం ఈ రోజుకీ మెటీరియలైజ్ కాలేదు. డైరెక్టర్ క్రిష్ణ వంశీ మీద ఉన్న ప్రేమ గౌరవం తో మెగా స్టార్ రంగ మార్తాండ సినిమాకు వాయిస్ ఓవర్ చెప్పడం జరిగింది .. మెగా స్టార్ వాయిస్ ఓవర్ చెబుతున్న సమయంలో క్రిష్ణ వంశీ డ్రీమ్ ప్రాజెక్ట్ వందేమాతరం లో అన్నయ
అయితే సూపర్ అని కూడా ఆలోచిస్తున్నారు అని వార్తలు వచ్చాయి . క్రిష్ణ వంశీ తన సబ్జెక్ట్ కి సరైన హీరో మెగాస్టార్ అనే ఈ రోజుకీ అనుకుంటున్నాడు. మరి మెగాస్టార్ వరసబెట్టి సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతము డైరెక్టర్ కృష్ణ వంశీ చేతిలో రంగ మార్తాండ సినిమా ఒక్కటే ఉంది , ఈ సినిమా కంప్లీట్ అయితే నే గాని కృష్ణ వంశీ మరో సినిమా గురించి ఆలోచించరు , సోషల్ మీడియా లో వస్తున్న మెగాస్టార్ చిరంజీవి కృష్ణ వంశీ కాంబినేషన్ లో వందేమాతరం సినిమా ఎప్పుడు ఉండబోతుంది అనే విషయం అధికారికంగా క్లారిటీ రావాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరుకు వెయిట్ చెయ్యాలిసిందే …

బోయపాటి శ్రీను అల్లు అర్జున్ మూవీ లేటెస్ట్ అప్ డేట్

బోయపాటి శ్రీను-అల్లు అర్జున్ కాంబో లో మూవీ ఫిక్స్ ...

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. అల వైకుంఠపురములో సినిమా బన్నీ కెరీర్ లో నే హైయెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్.. అల్లు అర్జున్ అల వైకుంఠపురములో సినిమా తరువాత తానూ చేయబోయే సినిమాల విషయంలో చాలా జాగ్రతాలు తీసుకుంటున్నారు .. అల వైకుంఠపురములో సినిమా తరువాత తాను ఏ డైరెక్టర్ తో ఎలాంటి స్టోరీ ని ఒకే చెయ్యాలి , కొత్త స్టోరీస్ ను చాలా జాగ్రత్తగా వినడానికి చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి..

అల్లు అర్జున్ – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పుష్ప సినిమా రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు , ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. పుష్ప సినిమా పూర్తి కాగానే అల్లు అర్జున్ , డైరెక్టర్ ఏ ఆర్ మురుగదాస్ , మరియు వేణు శ్రీ రామ్ , ప్రశాంత్ నీల్ లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. పుష్ప సినిమా తరువాత బన్నీ చేయబోయే ప్రాజెక్ట్ ఐకాన్ అని చిత్ర పోస్టర్ కూడా రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా తరువాత , డైరెక్టర్ కొరటాల శివ కూడా అల్లు అర్జున్ కోసం పవర్ఫుల్ స్టోరీని రెడీ చేసినట్లు సోషల్ మీడియా లో వార్తలు వచ్చాయి అంతే కాకుండా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ప్రస్తుతము కొరటాల శివ ఆచార్య సినిమా చేస్తున్నారు , ఈ సినిమా పూర్తి అయినా తరువాత ఎన్టీఆర్ తో సినిమా చేస్తున్నారు , మరి తారక్ తో సినిమా పూర్తి కాగానే కొరటాల శివ తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఎనౌన్సుమెంట్ చేస్తారు .. ప్రస్తుతానికి బన్నీ ఫోకస్ అంతా పుష్ప సినిమా మీదనే ఉంది .. పుష్ప సినిమా పూర్తి అయిన తరువాతనే బన్నీ తన నెక్స్ట్ సినిమా అనౌన్సుమెంట్ చేస్తారు ….

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ -మాస్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో చాలా రోజులుగా సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి .. బోయపాటి శ్రీను – రామ్ చరణ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా వినయ విధేయ రామ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , అండ్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది .. వినయ విధేయ రామ సినిమా తరువాత బోయపాటి శ్రీను కొంత గ్యాప్ తీసుకొని , బాలయ్యతో హ్యాట్రిక్ సినిమా గా అఖండ సినిమాను తెరకెక్కిస్తున్నారు , బాలకృష్ణ – బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వస్తున్న అఖండ సినిమా మీద భారీ అంచనాలు ఉన్నాయి .. బోయపాటి శ్రీను అఖండ సినిమా తరువాత నెక్స్ట్ ప్రాజెక్ట్ తమిళ్ స్టార్ సూర్య తో చేయబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు కూడా వచ్చాయి , అలానే కన్నడ స్టార్ యశ్ కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు వార్తలు కూడా వినిపించాయి …

ఈ వార్తలు అన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ , అల్లు అర్జున్ – బోయాపాటి శ్రీను కాంబినేషన్ లో ఒక సినిమా ఉండబోతుంది అని గత కొంత కాలంగా సోషల్ మీడియా లో వార్తలు గట్టిగా వినిపించాయి , ఇక అసలు విషయానికి వెళ్ళితే , బోయపాటి శ్రీను అఖండ సినిమా పూర్తి కాగానే మాస్ మహారాజ్ రవితేజ , మరియు అల్లు అర్జున్ కోసం స్టోరీస్ రెడీ చేసుకొన్నారు . అయితే మాస్ మహారాజ్ రవితేజ క్రాక్ సినిమా తరువాత ఖిలాడీ సినిమా చేస్తున్నారు ఈ సినిమా తరువాత ఇంకో సినిమా సెట్స్ మీద ఉన్నది . ఈ క్రమంలో మొత్తానికి బోయపాటి మళ్లీ బన్నీ తో సినిమా ఖరారు అయినట్లే తెలుస్తోంది. గతంలో వీరిద్దరి కలయికలో తెరకెక్కిన సరైనోడు బ్లాక్ బస్టర్ అయిన సంగతి తెలిసిందే. భారీ మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన సినిమా బన్నీ కెరీర్ లోనే భారీ వసూళ్ల చిత్రంగా రికార్డు సృష్టించింది. గీతా ఆర్స్ట్ సాధించిన బ్లాక్ బస్టర్ వసూళ్లలో మగధీర సినిమా తర్వాత సరైనోడు సినిమానే నిలిచింది. ఆ కాన్ఫిడెన్స్ తోనే స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ కి మరో ఛాన్స్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం బోయపాటి అఖండ పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రాన్ని ఇదే ఏడాది రిలీజ్ చేయాలని నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు .. బన్ని సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా చిత్రం పుష్పలో నటిస్తున్నాడు, ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ క్లైమాక్స్ కి చేరుకుంది అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి….. పుష్ప సినిమా తరువాత అల్లు అర్జున్ – తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ బోయపాటి శ్రీను తో ఉంటుందా లేక డైరెక్టర్ వేణు శ్రీ రామ్ తో ఐకాన్ సినిమా ఉండబోతుందా అనే విషయం పై క్లారిటీ రావాలంటే కొద్దీ రోజులు ఆగాలిసిందే ……..

“సర్కారు వారి పాట” సినిమా లేటెస్ట్ అప్ డేట్ …

“సర్కారు వారి పాట” అప్ డేట్ …

సంక్రాంతి పండుగ సీజన్‌లో ప్రేక్షకులను ఎంటర్‌టైన్‌ చేయడానికి వచ్చిన మరో బిగ్‌ మూవీ ‘సరిలేరు నీకెవ్వరు’. సూపర్ స్టార్ మహేశ్‌ బాబు, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి క్రేజీ కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగెస్ట్ హిట్ అందుకుంది .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు మహేష్ బాబు యాక్టింగ్ , మరియు ఈ సినిమాతో లేడీ సూపర్‌స్టార్‌ విజయశాంతి 13ఏళ్ల తర్వాత రీ ఎంట్రీ ఇవ్వడం , మహేష్ బాబు కామెడీ టైమింగ్ , అనిల్ రావిపూడి టేకింగ్ అన్ని సినిమాకు ప్లస్ అయి మహేష్ బాబు కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయింది .. . . ‘భరత్ అనే నేను, మహర్షి వంటి హిట్స్ తర్వాత మహేశ్‌ నటిస్తున్నఔట్ అండ్ ఔట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా ‘సరిలేరు నీకెవ్వరు సినిమా కావడం మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. ‘సరిలేరు నీకెవ్వరు సినిమా తరువాత మహేష్ బాబు – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు , కానీ ఈ సినిమా కొద్దీ పాటి క్రియేటివ్ కారణాల వల్ల ఈ సినిమా ఆగిపోయింది .. మహేష్ బాబు – పరశురాం కాంబినేషన్ లో సినిమా సినిమా ఎనౌన్స్ చేయగానే ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి .. “సర్కారు వారి పాట” సినిమా మోషన్ పోస్టర్ , టీజర్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ సినిమా స్పెయిన్ లో పాటల చిత్రీకరణ జరుగుతోంది. అలాగే బ్యాలెన్స్ సన్నివేశాలు కూడా పూర్తిచేస్తున్నారు. మహేష్..కీర్తి సురేష్ పై రెండు పాటలు అక్కడే చిత్రీకరిస్తున్నారు. ఈ రెండు పాటలు ప్రత్యేక ఆకర్షణ గా నిలుస్తాయని యూనిట్ తెలిపింది .. అయితే ఈ సినిమాకు సంబంధించి లేటెస్ట్ అప్ డేట్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది ..ఈ సినిమాను నవంబర్ 4న దీపావళి సందర్భంగా అభిమానులకు కోసం చిత్ర యూనిట్ స్పెషల్ ట్రీట్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..సర్కారు వారి పాట` నుంచి తొలి లిరికల్ సాంగ్ ని దీపావళి కి రిలీజ్ చేయబోతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి ..ఇప్పటికే సర్కారు వారి పాట ఫస్ట్ లుక్.. టీజర్ ఓ రేంజ్ లో దూసుకుపోయింది. బొమ్మ బ్లాక్ బస్టర్ అవుతుంది అనే నమ్మకంగా ఉన్నారు చిత్ర యూనిట్ .. ఇక చిత్రాన్ని జనవరిలో సంక్రాంతి కానుకగా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది ..మొత్తానికి ఈ సినిమాకు సంబంధించి మొదటి లిరికల్ సాంగ్ దీపావళి కానుకగా రిలీజ్ చేస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉందొ తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

మరోక్రేజీ ప్రాజెక్ట్ లైన్ లో పెట్టిన నాగ చైతన్య …

నాగ చైతన్య న్యూ మూవీ లేటెస్ట్ అప్ డేట్ ….

అక్కినేని నాగ చైతన్య – శేఖర్ కమ్ముల డైరెక్షన్ లో వచ్చిన సినిమా లవ్ స్టోరీ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది … రొటీన్ కి బిన్నంగా సినిమాలు తీసే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో శేఖర్ కమ్ముల ఒకరు . ప్రేమ కధలను శేఖర్ కమ్ముల డైరెక్ట్ చేసే విధానం వేరు .. శేఖర్ కమ్ముల నాగ చైతన్య కాంబినేషన్ లో వచ్చిన లవ్ స్టోరీ సినిమా నాగ చైతన్య కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా ఇండస్ట్రీ నుండి మంచి కాంప్లిమెంట్స్ అందుకున్నారు .. లవ్ స్టోరీ సినిమా తరువాత నాగ చైతన్య ఫుల్ స్పీడ్ మీద ఉన్నారు , వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు .. ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న నాగ చైతన్య ఈ ఏడాది చివర్లో బాలీవుడ్ మూవీ లాల్ సింగ్ చద్దా తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. అమీర్ ఖాన్ హీరోగా నటించిన ఈ సినిమాతో నాగ చైతన్య కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. మొదటి సారి చైతూ బాలీవుడ్ లో నటించిన ఈ సినిమా పై తెలుగు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. .లాల్ సింగ్ చద్దా సినిమా తో నాగ చైతన్య బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి అడుగు పెడుతున్నాడు .. బాలీవుడ్ సినిమా తరువాత చై విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థ్యాంక్యూ’ సినిమా లైన్ లో ఉంది .. గ్యాంగ్ లీడర్ సినిమా తో ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన డైరెక్టర్ విక్రమ్ కుమార్ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని నాగచైతన్య తో థ్యాంక్యూ సినిమా ను తెరెకెక్కిస్తున్నారు , ఈ సినిమాను స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు నిర్మిస్తున్నారు .. థ్యాంక్యూ సినిమా చిత్రీకరణ ఇప్పటికే చివరి దశకు వచ్చినట్లుగా సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి ..అక్కినేని నాగ చైతన్య థ్యాంక్యూ సినిమా తరువాత నాగార్జున బంగార్రాజు సినిమాను కూడా చైతూ చేసేందుకు సిద్దం అయ్యాడు. తండ్రి తో కలిసి ఇప్పటికే మనం సినిమాలో నటించిన చైతూ ఈసారి బంగార్రాజు సినిమాలో చాలా విభిన్నమైన పాత్రలో నటించేందుకు సిద్దం అయ్యాడు. అక్కినేని నాగ చైతన్య , మోహన కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో ఒక సినిమా ఉంటుంది అని సోషల్ మీడియా లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి ..ఇక అసలు విషయానికి వెళ్ళితే లవ్ స్టోరీ సినిమా తరువాత నాగ చైతన్య వరుస పెట్టి సినిమాలు లైన్ లో పీఠిన మాట వాస్తవమే ,కానీ ప్రస్తుతము నాగ చైతన్య బాలీవుడ్ లో అమీర్ ఖాన్ తో సినిమా పూర్తి కాగానే ఆ తరువాత , థ్యాంక్యూ సినిమా , ఆ తరువాత బంగార్రాజు సినిమా లైన్ లో ఉన్నాయి .. ప్రస్తుతము డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి సుధీర్ బాబు తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమా పూర్తి అయితే నే మరో సినిమా ఎనౌన్సమెంట్ చేస్తారు .నాగ చైతన్య డైరెక్టర్ మోహన్ కృష్ణ ఇంద్రగంటి కాంబినేషన్ లో సినిమా ఎప్పుడు అనేది తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంతవరకు కొద్దీ రోజులు ఆగాలిసిందే …….

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

           భీమ్లా  నాయక్  సినిమా  లేటెస్ట్   వర్కింగ్  స్టీల్..                                               

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగులో తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. భీమ్లా నాయక్‌ సినిమా నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఇప్పటికే పవన్ టీజర్ కు సంబంధించి సోషల్ మీడియా లో పవన్ అభిమానుల నుంచి భారీ లెవెల్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. పవన్ కళ్యాణ్ టీజర్ తో పాటు రానా టీజర్ కూడా రిలీజ్ చేసి , అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలను పెంచేలా చేసింది చిత్ర యూనిట్ .. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది ……ఈ సినిమా కు సంబంధించి ఓక పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది , ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు కలిసి విశ్రాంతి తీసుకున్నటు ఈ పిక్ లో కనబడుతుంది .. పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ సాధారణ బ్లూ షర్ట్ లో కనబడుతుంటే , రానా వైట్ అండ్ వైట్ షర్ట్ పంచ కట్టు తో ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .. ఈ పిక్ చూసి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు ..

రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు: ఐటీ శాఖ

రూ.20కోట్లకు పైగా పన్ను ఎగవేశారు: ఐటీ శాఖ

మూడు రోజుల పాటు జరిపిన సోదాల్లో గుర్తించినట్లు వెల్లడి

ముంబయి: ప్రముఖ నటుడు సోనూసూద్ రూ.20 కోట్లకు పైగా పన్ను ఎగవేసినట్లు శనివారం ఆదాయపన్ను(ఐటీ) విభాగం వెల్లడించింది. ఇటీవల ఐటీ విభాగం సోనూసూద్ ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు నిర్వహించిన సంగతి తెలిసిందే. నిన్నటి వరకు మూడురోజులు పాటు ఈ సోదాలు చేపట్టింది. పన్ను ఎగవేత ఆరోపణలతో.. అధికారులు ఆయన ఆర్థిక లావాదేవీలను పరిశీలించారు. ఈ క్రమంలోనే ఐటీ విభాగం నుంచి ప్రకటన వెలువడింది.

అలాగే సోనూసూద్ ఫారిన్ కంట్రిబ్యూషన్( రెగ్యులేషన్) యాక్ట్‌ను ఉల్లంఘించారని ఐటీ అధికారులు పేర్కొన్నారు. దానికింద క్రౌడ్‌ ఫండింగ్ ద్వారా విదేశీ దాతల నుంచి రూ.2.1 కోట్లను సేకరించినట్లు తెలిపారు. సోనూసూద్‌తో పాటు ఆయన సహచరుల కార్యాలయాల్లో కూడా పన్ను ఎగవేతకు సంబంధించిన ఆధారాలను గుర్తించినట్లు వెల్లడించారు.

1 236 237 238