మెగాస్టార్ 154 మూవీ ఫస్ట్ లుక్ అదిరింది…

బాబీ  డైరెక్షన్ లో మెగా స్టార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ ...

మెగా స్టార్ చిరంజీవి చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ వి వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఠాగూర్ , తరువాత , మల్లి మెగా స్టార్ చిరంజీవి తో 150 వ సినిమా డైరెక్ట్ చేశారు . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ ,మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి – డైరక్టెర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు . ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ కాబట్టి ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ప్రాణం పెట్టి పని చేశారు , ఈ సినిమా లో బారి కాస్టింగ్ , భారీ సెట్టింగ్ , భారీ యాక్షన్ , మెగా స్టార్ యాక్టింగ్ ,మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు ..ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతము ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా స్టార్ చిరంజీవి మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు , వాటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఒకటి , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్‌’ సినిమా మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు.. ప్రస్తుతము ఆచార్య సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది , చిరంజీవి ఆచార్య సినిమా తరువాత , గాడ్ ఫాదర్ , ,మరియు మెహెర్ రమేష్ డైరెక్షన్ లో సినిమాలు రెడీ గా ఉన్నాయి , కానీ వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ -ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి , మెగా స్టార్ కోసం డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎంతో మంది డైరెక్టర్స్ ఎదురుచూస్తున్నారు , ఫైనల్ గా ఇప్పుడు ఈ అవకాశం యంగ్ డైరెక్టర్ బాబీ కి దక్కింది .మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక సాలిడ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు , ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. . బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈనెల 6వ తారీకున ఉదయం 11.43 కు లాంచనంగా జరుగబోతున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు ..ఈ సినిమా ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో ఫైనల్ గా సినిమా ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపారు …

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

“రంగస్థలం ” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ వినయ విధేయ రామ” . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . . వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు . రాజామౌళి బాహుబలి సినిమా తరువాత చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో రామ్ చరణ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది .. రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ఆచార్య సినిమాలో క్యామియో రోల్ లో నటిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ , మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022ఫిబ్రవరి 4న విడుదల కానున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్బంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో ఆచార్య సినిమాలో ఉండే పాట ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాలో మొదటి సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది . తాజాగా ఈ సినిమా లో మరో సాంగ్ రిలీజ్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ను చరణ్ మంచి డాన్స్ స్టెప్పులతో రూపొందించారు. ఇంతకు ముందు వచ్చిన లాహె లాహె పాట ఎలా అయితే టెంపుల్ సిటీలో చిత్రీకరించారో.. ఈ పాటను కూడా అదే పరిసరాల్లో చిత్రీకరించినట్లుగా నీలాంబరి పాట ప్రోమోను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఇక నీలాంబరిగా పూజా హెగ్డే కూడా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. ఈ సాంగ్ ను . నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీపావళి తర్వాత రోజు అంటే రేపు ఈ పాట పూర్తి నిడివి తో మన ముందుకు వస్తున్నది … ఆచార్య సినిమా ఇంత ఆలస్యం అయినా కూడా అభిమానుల్లో ఈ సినిమా గురించి కొంత అయిన ఆసక్తి తగ్గలేదు. లాహె లాహె పాట మణిశర్మ సంగీత సారధ్యంలో వచ్చి భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. , మరి ఈ నీలాంబరి పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా లు ఆలపించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించారు. ఈ పాట లో రామ్ చరణ్ డాన్స్ చాలా ఈజ్ తో ఉంది .. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు … సినిమాలో ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు…

బంపర్ ఆఫర్ దక్కించుకున్న మిల్కీ బ్యూటీ …

       మెగాస్టార్ సరసన మరోసారి నటిస్తున్న మిల్కీబ్యూటీ …

మెగాస్టార్ చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు .. మెగా స్టార్ చిరంజీవికి ఈ సినిమా 150 వ సినిమా కావడం విశేషం , ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. తండ్రి రీ ఎంట్రీ కోసం మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నిర్మాతగా మారి ఈ సినిమా విషయంలో ఖర్చు విషయంలో ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు .. మురుగదాస్ సినిమాను ఠాగూర్ గా రీమేక్ చేసి స్టార్ డైరెక్టర్ అయిన వి .వి. వినాయక్ మల్లి అన్నయ్య రీ ఎంట్రీ సినిమా కోసం ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను తెరకెక్కించి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు .. ఖైదీ నెంబర్ 150’ సినిమా తరువాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు .. సురేందర్ రెడ్డి – రామ్ చరణ్ కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా “ధ్రువ” .. ధ్రువ సినిమా తరువాత , డైరెక్టర్
సురేందర్ రెడ్డి లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో సైరా నరసింహారెడ్డి సినిమాను తెరకెక్కించారు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ సఫీస్ దగ్గర బిగెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు . కొరటాల శివ మహేష్ బాబు కాంబినేషన్ లో వచ్చిన “భరత్ అనే నేను ” సినిమా తరువాత కొరటాల శివ చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగాస్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేసాడు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా స్టార్ చిరంజీవి మరో ముద్దు సినిమాలు లైన్ లో పెట్టారు , వాటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఒకటి , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్‌’ సినిమా మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు .. ప్రస్తుతం కొరటాలా శివ డైరెక్షన్ లో వస్తున్న ‘ఆచార్య’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ఆచార్య సినిమా తరువాత మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న
‘గాడ్‌ ఫాదర్‌’ చిత్రీకరణ దశలో ఉంది. ఆ తరువాత ‘భోళా శంకర్‌’ను పట్టాలెక్కించేందుకు సిద్ధమయ్యారు . మెహర్‌ రమేష్‌ తెరకెక్కిస్తున్న చిత్రమిది. రామబ్రహ్మం సుంకర నిర్మాత. నవంబర్‌ 11న ఉదయం 7:45 గంటలకు లాంఛనంగా ఈ సినిమా ప్రారంభమవుతుందని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి . అన్నాచెల్లెళ్ల అనుబంధం చుట్టూ తిరిగే కథతో రూపొందుతోన్న ఈ సినిమాలో.. చిరుకు చెల్లిగా కీర్తి సురేష్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఆయనకు జోడీగా నటించే నాయికెవరన్నది ఇంకా ఖరారు కాలేదు. ఇప్పుడీ పాత్ర కోసం నటి తమన్నాను ఎంపిక చేసినట్లు వార్తాలు వినిపిస్తున్నాయి .సైరా నరసింహారెడ్డి సినిమా లో తమన్నా యాక్ట్ చేసింది , డైరెక్టర్ మెహెర్ రమేష్ మెగా స్టార్ చిరంజీవి సరసన తమన్నా అయితే బాగుంటుంది అని భావించి , తమన్నా ని కలిసి స్క్రిప్ట్ వినిపించారు అని ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి సరసన తమన్నా నటిస్తుంది అనే వార్తల్లో నిజం ఎంత వరకు ఉన్నదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

మరో క్రేజీ మల్టీ స్టారర్ సినిమా ని సెట్ చేకున్న డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల …

 పీరియాడికల్  బ్యాక్ డ్రాప్ తో  రానున్న  మల్టీ  స్టారర్  సినిమా ...

విభిన్నమైన సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల సినిమా అనగానే కుటుంబ బంధాలు , సెంటిమెంట్స్ , యూత్ ఫుల్ కంటెంట్స్ అన్ని కలిసి ఉంటాయి .. రొటీన్ కి బిన్నంగా శ్రీకాంత్ అడ్డాల స్టోరీస్ ఉంటాయి . క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణ వంశీ ఫ్యామిలీ ఎమోషన్స్ , సెంటిమెంట్స్ సీన్స్ , ఎలా చిత్రీకరిస్తారో , అలానే శ్రీకాంత్ అడ్డాల సినిమాలు కూడా ఎక్కువ ఫ్యామిలీ స్టోరీస్ , ఫ్యామిలీ ఎమోషన్స్ , సహజంగా ప్రేక్షకుల అందరికి కనెక్ట్ అయ్యేలాగా తెరకెక్కించే అతి కొద్దీ మంది దర్శకుల్లో , శ్రీకాంత్ అడ్డాల ఒకరు .దిల్ రాజు బ్యానర్ నుండి వచ్చిన దర్శకుల లిస్ట్ లో శ్రీకాంత్ అడ్డాల ఒకరు .. శ్రీకాంత్ అడ్డాల అసిస్టెంట్ డైరెక్టర్ గా నిర్మాత దిల్ రాజు బ్యానర్ లో ఎన్నో సినిమాలకు పని చేసి 2008 లో , ‘కొత్త బంగారు లోకం’ సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి ఎంటర్ అయ్యాడు .. మొదటి సినిమా తో మంచి సక్సెస్ అందుకొని సెన్సిబుల్ డైరెక్టర్ అనిపించుకున్నారు. ‘కొత్త బంగారు లోకం’ సినిమా ఇటు యూత్ కు ఫ్యామిలీ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయి బిగ్గెస్ట్ హిట్ అందుకోవడమే కాకుండా డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల కు మంచి పేరును తీసుకొచ్చింది ..

‘కొత్త బంగారు లోకం’ సినిమా తరువాత డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని , మల్టీస్టారర్ సినిమా గా ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు ‘ అనే సినిమాను డైరెక్ట్ చేశారు .. మల్టీస్టారర్ సినిమా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..అంతే కాకుండా ఈ సినిమా తర్వాతే టాలీవుడ్ లో ఈ జెనరేషన్ హీరోల మల్టీస్టారర్ ట్రెండ్ మొదలైయ్యింది. ప్రస్తుతం రూపొందుతున్న క్రేజీ మల్టీస్టారర్స్ కు బీజం వేసింది శ్రీకాంత్ అడ్డాలే అని దిల్ రాజు తెలిపారు .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు , వంటి ఇండస్ట్రీ హిట్ తరువాత , వచ్చిన “ముకుంద” మరియు , “బ్రహ్మోత్సవం ” రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా విజయం సాధించలేకపోయాయి .. “ముకుంద” మరియు “బ్రహ్మోత్సవం ” సినిమాల తరువాత నాలుగేళ్ళ గ్యాప్ తీసుకొని ‘నారప్ప’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..

‘నారప్ప’ సినిమా తో సక్సెస్ ట్రాక్ లోకి వచ్చిన డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల ఆ తరువాత సినిమా ఏ స్టార్ హీరో తో చేస్తాడా తన నెక్స్ట్ సినిమా ఉండబోతుందో అనే చర్చ సోషల్ మీడియా లో మోదలైయింది .. ‘నారప్ప’ ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ జోష్ మీదున్న శ్రీకాంత్ అడ్డాల ”అన్నాయ్” అనే ఓ భారీ యాక్షన్ సినిమా చేయనున్నట్లు శ్రీకాంత్ అడ్డాల సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్ లో భారీ బడ్జెట్ తో అల్లు అరవింద్ నిర్మిస్తున్నారు .. ”అన్నాయ్” సినిమా గుంటూరు బ్యాక్ డ్రాప్ లో రూపొందే భారీ పీరియాడికల్ డ్రామా అని.. అది కూడా మూడు భాగాలుగా తెరకెక్కే ట్రైయాలజీ అని శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమా సక్సెస్ మీట్ లో తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తెలిపారు .. . ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోందని వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ భారీ మల్టీస్టారర్ సినిమా కోసం చిరంజీవి – బన్నీ లను సంప్రదిస్తున్నారని వార్తలు వస్తున్నాయి .. . ఇప్పటికే మహేష్ – వెంకీ వంటి ఇద్దరు స్టార్ హీరోలను పర్ఫెక్ట్ గా హ్యాండిల్ చేసిన అడ్డాల.. వారి ఫ్యాన్స్ ని కూడా మెప్పించారు. ఇప్పుడు చిరు – బన్నీ లకు కూడా అదే విధంగా తెర మీద ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయని టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతము మెగా స్టార్ చిరంజీవి చేతిలో ఆచార్య , గాడ్ ఫాదర్ సినిమాలు , మరియు మెహెర్ రమేష్ , మరియు డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి .. అలానే అల్లు అర్జున్ పుష్ప సినిమా లో ఫుల్ బిజీగా ఉన్నారు ,గీతా ఆర్ట్స్ బ్యానర్ లో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్రకటిస్తారని టాక్ వినిపిస్తుంది .. మరి శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రాబోయే ఈ భారీ మల్టీస్టారర్ సినిమాకు సంబంధించి సోషల్ మీడియా లో వస్తున్న వార్తల్లో నిజం ఎంతవరకు ఉన్నదో తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే …

మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు

మెగాస్టార్ కోసం దివ్యాంగ అభిమాని సాహసం.. చలించిపోయిన చిరు

మెగాస్టార్ చిరంజీవికి అభిమానులు ఉండరు భక్తులే ఉంటారు అని నిరూపించే మరో ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. స్వయంకృషితో ఎదిగి టాలీవుడ్ నెం.1 స్థానానికి చేరిన చిరంజీవి అంటే ప్రాణం ఇచ్చే అభిమానులున్నారు. అలాంటి అభిమానులలో ఒకరైన డెక్కల గంగాధర్ ఎవరూ ఊహించని పని చేశారు. మెగాస్టార్ చిరును కలిసేందుకు డెక్కల గంగాధర్ అనే ఒక అభిమాని పాదయాత్ర ప్రారంభించారు. తూర్పు గోదావరి జిల్లా అమలాపురం నుంచి హైదరాబాద్ వరకు ఆయన పాదయాత్ర చేస్తూ వచ్చారు. ఉప్పలగుప్తం మండలం కిత్తనచెరువుకు చెందిన డెక్కల గంగాధర్‌ అనే అభిమాని అక్టోబర్ 3వ తేదీన కాలి నడకన హైదరాబాద్‌ బయలు దేరాడు.

మెగాస్టార్ చిరంజీవి నటించిన మాస్టర్‌ సినిమా విడుదలై 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా చిరంజీవిని చూడాలనే తపనతో పాదయాత్ర ప్రారంభించినట్టు గంగాధర్‌ పేర్కొన్నారు. చిరంజీవి నుంచి ఏమి ఆశించడం లేదని, కలిస్తే చాలని అదే పది వేలని భవిస్తూ 726 కి.మీ దూరం నడిచి హైదరాబాద్ వచ్చాడు డెక్కల గంగాధర్. ఈ మధ్య కాలంలో తమ తమ అభిమాన నటీనటుల కోసం పాదయాత్రలు చేయడం కామన్ అయిపోయాయి కానీ గంగాధర్ దివ్యాంగుడు. అమలాపురం తాలూకా ఉప్పలగుప్తం మండలానికి చెందిన కిత్తనచెరువు గ్రామ వాసి అయిన శ్రీ డెక్కల గంగాధర్ కాలినడకనే చిరంజీవి గారిని కలవాలనే ఉద్దేశంతో బ్లడ్ బ్యాంక్ కు చేరుకున్నాడు.

ఈ వార్త తెలిసిన శ్రీ చిరంజీవి గారు చలించి పోయి వెంటనే ఇంటికి పిలిపించుకుని గంగాధర్ తో సమయం గడిపారు. అనంతరం గంగాధర్ ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. అతని కుటుంబ నేపథ్యం, ఇతర విషయాలు అడిగి తెలుసుకున్న చిరంజీవి ఇలాంటి సాహసాలు మళ్లీ చేయవద్దని సున్నితంగా హెచ్చరించారు. అయితే తమ అభిమాన హీరోను చూస్తే చాలనుకున్న గంగాధర్ చిరంజీవి ఆతిధ్యానికి పులకించిపోయారు. చిరును కలవడంతో గంగాధర్ ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. తాను జీవితాంతం రుణపడి ఉంటాను అని ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు.