అల్లు అర్జున్ కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో ‘పుష్ప’ 116 కోట్ల గ్రాస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.

పుష్ప రాజ్ అరాచకం మాములుగా లేదు…

 ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ హై వోల్టేజ్ యాక్షన్...

   

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి … వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా సుకుమార్ తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు .. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. .ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే అద్భుతమైన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో అల్లు అర్జున చాలా పవర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఈ సినిమాలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి .. అలానే ట్రక్ డ్రైవర్ గా అల్లు అర్జున నటన సూపర్బ్ గా ఉంది . అల్లు అర్జున యాక్టింగ్ లోని మరో కోణాన్ని సుకుమార్ బలే ప్రెజెంట్ చేసారు , ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లోనూ , మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లోను మంచి రెస్పాన్స్ వస్తుంది .. అదే విధంగా ఈ ట్రైలర్ లో అనసూయ , మరియు సునీల్ డైలాగ్స్ మరియు వారి లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు .ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన ఫహద్ ఫాసిల్ ట్రైలర్ చివరి షాట్ లో మంచి విలనిజం తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు . పుష్ప ట్రైలర్ కు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ వస్తుంది , అలానే ఈ ట్రైలర్ తో సినిమా మీద ఒక్క సారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి .డైరెక్టర్ సుకుమార్ -అల్లు అర్జున పడిన కష్టం ట్రైలర్ లో కనబడుతుంది .. అలానే మైత్రి మూవీ మేకర్స్ సినిమా విషయంలో ఖర్చు కు ఏమాత్రం వెనుకాడలేదు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది .. పుష్ప సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇంత అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ బాగా సంతోసపడుతున్నారు ..

.

మెగా ఆఫర్ దక్కించుకున్న రష్మిక…

మెగాస్టార్ సినిమాలో ఛాన్స్ దక్కించుకున్న రష్మిక...

మెగా స్టార్ చిరంజీవి -డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి , సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఆచార్య సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది . ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు ఈ నేపథ్యంలో మెగా స్టార్ చిరంజీవి , మలయాళంలో బ్లాక్ బస్టర్ హిట్టయిన లూసిఫర్ సినిమాను తెలుగులో రీమేక్ చేస్తున్నారు . మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ పనులు చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి ..

గడ్ ఫాదర్ సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి డైరెక్టర్ బాబీ తో సినిమా చేస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి ఇటీవలే పూజా కార్యక్రమాలు జరిగాయి , అలానే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ ఎనౌన్సుమెంట్ చేస్తూ డైరెక్టర్ బాబీ పోస్టర్ రిలీజ్ చేశారు .. డైరెక్టర్ బాబీ తో మెగా స్టార్ చిరంజీవి సినిమా పూర్తి కాగానే , చిరు ఓ యంగ్ డైరెక్టర్ తో సినిమా చేస్తున్నారు అని సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి ..టాలీవుడ్ లో చలో, భీష్మ వంటి సూపర్ హిట్ చిత్రాలను తెరకెక్కించిన యువ దర్శకుడు వెంకీ కుడుముల డైరెక్షన్లో చిరంజీవి సినిమా చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి .. భీష్మ సినిమా తరువాత డైరెక్టర్ వెంకీ కుడుముల ఏ సినిమా ఎనౌన్సుమెంట్ చేయలేదు , భీష్మ సినిమా తో డీసెంట్ హిట్ అందుకొన్న వెంకీ కుడుముల చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మహేష్ బాబు కోసం ఒక పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు కూడా కొన్ని కామెంట్స్ వినిపించాయి .. ఫైనల్ గా వెంకీ కుడుముల తన దగ్గర ఉన్న స్టోరీ తో మెగా స్టార్ చిరంజీవి కి వినిపించారు , ఈ స్టోరీ కి ఇంప్రెస్ అయినా మెగా స్టార్ , డైరెక్టర్ వెంకీ కుడుముల కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అని తెలుస్తుంది ..

డైరెక్టర్ వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో వస్తున్న సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన పాన్ ఇండియా హీరోయిన్ రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. వెంకీ కుడుముల – నాగ శౌర్య కాంబినేషన్ లో వచ్చిన మొదటి సినిమా చలో , ఈ సినిమాలో నాగశౌర్య సరసన – రష్మిక హీరోయిన్ గా నటించింది .. చలో సినిమాలో రష్మిక నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు , అలానే వెంకీ కుడుముల – నితిన్ కాంబినేషన్ లో వచ్చిన భీష్మ సినిమాలో సెకండ్ టైమ్ రష్మిక నే మల్లి రిపీట్ చేశారు ఈ యువ దర్శకుడు .. చిరంజీవి 150 వ సినిమా లో యంగ్ హీరోయిన్ కాజల్ ని సెలెక్ట్ చేశారు , ఆ తరువాత వచ్చిన సైరా నరసింహారెడ్డి సినిమాలో అనుష్క ,మరియు తమన్నా ని ఎంపిక చేసుకున్నారు , అలానే కొరటాల శివ చేస్తున్న ఆచార్య సినిమాలో చిరంజీవి సరసన కాజల్ సెలెక్ట్ అయింది . ప్రస్తుతము ఈ యంగ్ డైరెక్టర్ మెగా స్టార్ చిరంజీవి తో చేస్తున్న సినిమాలో హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి . మొత్తానికి వెంకీ కుడుముల – మెగా స్టార్ చిరంజీవి కాంబినేషన్ లో సినిమా లో మెగా స్టార్ చిరంజీవి సరసన హీరోయిన్ గా రష్మిక ను తీసుకోబోతున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సమెంట్ వచ్చేంత వరకు ఎదురుచూడాలిసిందే …

బిడ్డా ఇది నా అడ్డా… అల్లు అర్జున్ వార్నింగ్

పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ రిలీజ్

     

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి కి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . పుష్ప సినిమా టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎందుకు చెప్పారో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో మటుకు సాంగ్స్ , ఫైట్స్ , లొకేషన్స్ , హీరోయిజం , బన్నీ క్యారెక్టర్ లో సుకుమార్ ఎక్కడ తగ్గట్లేదు .. పుష్ప సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ చేసి , మూడు సాంగ్స్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం , ఆర్య , ఆర్య 2 సినిమాల తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రావడం అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి .

అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులు పుష్ప సీనిమా గురించి గోల చేస్తున్నారు .. పుష్ప సినిమా సబ్జెక్ట్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్ నటిస్తున్నది .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఈ క్రమంలో ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే నాల్గో పాట ను నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది సుకుమార్ టీమ్ ..ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది .. పుష్ప సినిమా నుండి వస్తున్న నాల్గో సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా అభిమానులను అలరించనుంది . సుకుమార్ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఒక స్టైల్ ఉంది అలానే మాస్ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు .. మొత్తానికి నవంబర్ 19న పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు …