కో-బ్రాండెడ్ ఫ్యూయల్ క్రెడిట్ కార్డును ప్రవేశ పెట్టిన ఇండియన్ ఆయిల్, కోటక్..
![](https://telugusupernews.com/wp-content/uploads/2023/03/image-61-860x280.png)
తెలుగు సూపర్ న్యూస్,ముంబై,11మార్చి 2023: కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ (“KMBL”/Kotak), ఇండియన్ ఆయిల్, కో-బ్రాండెడ్ ఇంధన క్రెడిట్ కార్డ్ ను మార్కెట్ లోకి ప్రవేశ పెట్టాయి. ఇండియన్ ఆయిల్, కోటక్ క్రెడిట్ కార్డ్ రూపే నెట్వర్క్ లో అందుబాటులో ఉంటుంది.
దేశంలోని 34వేలఫ్యూయల్ స్టేషన్ల నెట్వర్క్ తో ఇండియన్ ఆయిల్ అతిపెద్ద చమురు మార్కెటింగ్ కంపెనీగా ఉంది. ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ కస్టమర్లు దేశంలోని ఏదైనా ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లో ఆయిల్ కొనుగోలు చేయడం ద్వారా రివార్డ్ పాయింట్లను పొందవచ్చు. ఇండియన్ ఆయిల్ ఫ్యూయల్ స్టేషన్లలో ఉచిత ఇంధనాన్ని పొందడానికి ఈ రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోవచ్చు.
ముంబైలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్, కన్స్యూమర్ అసెట్స్ ప్రెసిడెంట్, అంబుజ్ చందనా, కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ బిజినెస్ హెడ్ క్రెడిట్ కార్డ్స్, ఫ్రెడరిక్ డిసౌజా, ఇండి యన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్ అండ్ ఈస్ట్) విజ్ఞాన్ కుమార్, నేషనల్ పేమెంట్స్ కార్పొ రేషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ ప్రవీణా రాయ్ ఈ కార్డ్ ని ఆవిష్కరించారు.
ఇండియన్ ఆయిల్, కోటక్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు..
![](http://telugusupernews.com/wp-content/uploads/2023/03/image-61-1024x682.png)
- ఇండియన్ ఫ్యూయల్ స్టేషన్లలో ఇంధనం కొనుగోలుపై రివార్డ్ పాయింట్లుగా 4శాతం తిరిగి పొందవచ్చు.
-నెలకు రూ. 300 వరకు డైనింగ్, కిరాణా, ఇతర చెల్లింపులపై రివార్డ్ పాయింట్లుగా 2శాతం తిరిగి పొందవచ్చు.
-నెలకు రూ. 200 వరకు 1శాతం ఇంధన సర్ఛార్జ్ మాఫీని పొందొచ్చు. -నెలకు రూ. 100 వరకు 48 రోజుల వరకు వడ్డీ రహిత క్రెడిట్ వ్యవధి
-స్మార్ట్-ఈఎంఐ
-కార్డ్ కోల్పోయిన పక్షంలో జీరో లయబిలిటీ
-కాంటాక్ట్ లెస్ కార్డ్ -ట్యాప్ అండ్ పే కోటక్ మహీంద్రా బ్యాంక్ లిమిటెడ్ క్రెడిట్ కార్డ్స్ బిజినెస్ హెడ్ ఫ్రెడరిక్ డిసౌజా మాట్లాడుతూ.. “మా ఉత్పాదనల శ్రేణిలో ఇంధనాలకు సంబంధించింది కూడా కలిగి ఉన్నందుకు మేం చాలా సంతోషిస్తు న్నాం. కస్టమర్లు తమ కొనుగోళ్లన్నింటినీ ఈ కార్డ్ ద్వారా చేసేందుకు ప్రోత్సహించేలా ఈ ఉత్పాదన రూపొందించాం. ఇండియన్ ఆయిల్ స్ట్రాంగ్ బ్రాండ్, పంపిణీ నెట్వర్క్ ఈ భాగస్వామ్యానికి గొప్ప బలం. వినియోగదారులకు వినూత్న చెల్లింపు పరిష్కారాలను విస్తరించడంలో, డిజిటల్ చెల్లింపులను విస్తృ తంగా స్వీకరించడంలో రూపే ప్లాట్ఫామ్ మాకు సహాయం చేస్తుంది” అని అన్నారు.
“ఇండియన్ ఆయిల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (రిటైల్ సేల్స్- నార్త్ & ఈస్ట్), మిస్టర్ విజ్ఞాన్ కుమార్ మాట్లాడుతూ, “ఇండియన్ ఆయిల్ మన గౌరవనీయ ప్రధాన మంత్రి ఆశించిన విధంగా డిజిటల్ ఇండియాకు కట్టుబడి ఉంది. ఈ భాగస్వామ్యంతో ఇండియన్ ఆయిల్ ఇంధన స్టేషన్లన్నింటిలో డిజి టల్ ఇంటరాక్షన్స్ ను నిర్ధారించే దిశగా మరో నిర్దిష్ట అడుగు వేస్తున్నాం”.
“మా కస్టమర్ విలువ ప్రతిపాదనలు మరియు అనుభవాలను మెరుగుపరచడం అనేది ఎల్లప్పుడూ ఇండియన్ ఆయిల్లో మాకు ప్రాధాన్య అంశంగా ఉంటుంది. కోటక్ మహీంద్రాతో ఈ సహకారం మా కస్టమర్లకు తిరుగులేని, మెరుగుపరిచిన ఆఫర్ల సమూహానికి సరైన జోడింపు అని నేను విశ్వసిస్తున్నాను.
భారత ప్రభుత్వ ఆత్మనిర్భర్ భారత్ ఆశ యాన్ని బలోపేతం చేస్తూ ఇండియన్ ఆయిల్ కోటక్ క్రెడిట్ కార్డ్ ప్రత్యేకంగా రూపే ప్లాట్ఫామ్లో ప్రారంభిస్తుందని తెలియజేసేందుకు కూడా నేను సంతోషిస్తున్నాను’’ అని అన్నారు.
“కస్టమర్-ఫస్ట్ అనుభవాలను అందించడానికి ఎన్పీసీఐ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆవిష్కరణ, సాంకేతికత అనేవి మెరుగైన, గొప్ప వినియోగదారు అనుభవాన్ని అందించడానికి కీలకమైన సాధనాలుగా మేం భావిస్తాం. మేం మా కస్టమర్ల కోసం సరళీకృతమైన, అత్యుత్తమ-తరగతి ఆఫర్లను తీసుకురావడానికి నిరంతరం కృషి చేస్తున్నాం.
ఇండియన్ ఆయిల్ కోటక్ రూపే క్రెడిట్ కార్డ్ కార్డ్ హోల్డర్లకు ఇంధనం, కిరాణా, డైనింగ్ ఖర్చులపై అనేక అధికారాలను అందిస్తుంది, రూపే కాంటాక్ట్లెస్ టెక్నాలజీతో తిరుగు లేని చెల్లింపు అనుభవాన్ని సృష్టిస్తుంది’’ అని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా రిలేషన్షిప్ మేనేజ్మెంట్, మార్కెటింగ్ చీఫ్ రజీత్ పిళ్లై పేర్కొన్నారు.