కరీంనగర్,జగిత్యాలలో లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ కు 82,000 ఎకరాల భూమిని మంజూరు చేసిన తెలంగాణ ప్రభుత్వం

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, ఆగస్టు 11, 2023: తెలంగాణ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న నూనెల సంస్థ లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్‌కు , కరీంనగర్ ,జగిత్యాల జిల్లాల్లో 82,000 ఎకరాల భూమిని తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ,సహకార శాఖ మంజూరు చేసింది.

లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ మేనేజింగ్ డైరెక్టర్ మహావీర్ లోహియా మాట్లాడుతూ , “ముడి పామాయిల్ దిగుమతిపై భారతదేశం ఆధారపడటాన్ని తగ్గించి, దేశవ్యాప్తంగా ఉన్న పరిశ్రమల అవసరాలను తీర్చే ఈ కార్యక్రమం పట్ల మేము ప్రభుత్వాన్ని అభినందిస్తున్నాము. పరిశ్రమలో మా నైపుణ్యం, ప్రపంచ స్థాయి ప్రమాణాలు గత కొన్ని దశాబ్దాలుగా గుర్తించబడ్డాయి , ప్రభుత్వం ఈ కార్యక్రమంలో భాగంగా మేము ఎంపిక కావటాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాము” అని అన్నారు.

లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్:

లోహియా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఒక సాధారణ నూనె వెలికితీత యూనిట్ నుండి గగన్‌పహాడ్‌లోని ఒక పెద్ద అత్యాధునిక శుద్ధి కర్మాగారానికి, ఆ తర్వాత కాకినాడ,మంఖాల్‌ ప్లాంట్ల తో ఎదిగింది. వైవిధ్యభరితమైన ఈ వ్యాపార సంస్థ , ఇప్పుడు అనేక బ్రాండ్‌లను కలిగి ఉంది ,దేశవ్యాప్తంగా తమ కార్య కలాపాలను పెంచుతోంది. నాణ్యత హామీతో కార్యకలాపాలు నిర్వహిస్తున్న సంస్థ ను , కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు,VIMTA వంటి థర్డ్ పార్టీ ల్యాబ్‌లు నాణ్యతా ప్రమాణాల పరంగా పరీక్షలు చేస్తూ నాణ్యతకు నిరంతరం భరోసా ఇస్తున్నాయి.

● ఉత్తమ నాణ్యత కోసం ఐదుసార్లు CITD జాతీయ అవార్డు గెలుచుకుంది
● ఫోర్బ్స్‌లో ‘గమనించదగిన 5 అన్ లిస్టెడ్ ఎంటర్‌ప్రైజెస్’ గా జాబితీకరించబడినది
● భారత సైన్యం కోసం ఆమోదించబడిన విక్రేత
● FSSAI, హలాల్, HACCP ధృవీకరించాయి

Leave a Reply