ఆనంద్ దేవరకొండ బర్త్ డే సందర్భంగా ‘బేబీ’… పోస్టర్ రిలీజ్

యువ హీరో ఆనంద్ దేవరకొండ నటిస్తున్న కొత్త సినిమా ‘బేబీ’. ఈ చిత్రాన్ని మాస్ మూవీ మేకర్స్ పతాకంపై ఎస్ కే ఎన్, దర్శకుడు మారుతి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వం వహిస్తున్నారు. విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మంగళవారం ఆనంద్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా సినిమా నుంచి కొత్త పోస్టర్ రిలీజ్ చేశారు.ఈ పోస్టర్ ఎలా ఉందో చూస్తే…*వాడిన రోజా పువ్వును హీరో ఆనంద్ దేవరకొండ పట్టుకుని తీక్షణంగా చూస్తున్నారు. రోజ్ ఫ్లవర్ ఇస్తూ ఆమె స్పందన కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ఓల్డ్ రోజ్ ఫ్లవర్ వెనక దాగి ఉన్న కథేంటి అనేది సినిమాలో చూడాలి. ఈ పోస్టర్ తో ఆనంద్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు టీమ్ మెంబర్స్*. న్యూ ఏజ్ లవ్ స్టొరీ గా తెరకెక్కుతున్న ‘బేబీ’ మూవీ ప్రస్తుతం చిత్రీకరణ తుది దశలో ఉంది.నిర్మాత: ఎస్. కే. ఎన్నిర్మాణ సంస్థ : మాస్ మూవీ మేకర్స్రచన, దర్శకత్వం: సాయి రాజేష్సినిమాటోగ్రఫీ: బాల్ రెడ్డిసంగీతం: విజయ్ బుల్గానిన్ఎడిటింగ్: ఎం.ఆర్ వర్మఆర్ట్: సురేష్సహా నిర్మాత: ధీరజ్ మోగిలినేనిఎగ్జిక్యూటివ్ నిర్మాత: దాసరి వెంకట సతీష్చీఫ్ సహాయ దర్శకుడు: మహేష్ అలంశెట్టిపీఆర్వో: ఏలూరు శీను & జి. ఎస్. కే మీడియా కొరియోగ్రఫీ:పొలాకి విజయ్.

శర్వానంద్ ఆశలు ఆ రెండు సినిమాల మీదనే…

ఈ సారి   సాలిడ్   హిట్   పక్కా  అంటున్న శర్వానంద్...

యంగ్ హీరో శర్వానంద్ నాలుగేళ్ళ క్రితం ‘మహానుభావుడు’ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్నారు ..ఈ సినిమా ట్రైలర్స్ ,అండ్ టీజర్స్ , సాంగ్స్ , మరియు శర్వానంద్ యాక్టింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. శర్వానంద్ కెరీర్ లో నే మహానుభావుడు సినిమా బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా , శర్వానంద్ యాక్టింగ్ ,కు మంచి పేరు వచ్చింది .. మహానుభావుడు సినిమా తరువాత శర్వానంద్ యంగ్ డైరెక్టర్ హను రాగావపుడి డైరెక్షన్ లో పడి పడి లేచే మనసు లాంటి ఫీల్ గుడ్ లవ్ స్టోరీ సినిమాలో నటించారు . ఈ సినిమా ట్రైలర్స్ , అండ్ టీజర్స్ , సాంగ్స్ మరియు డైరెక్టర్ హను రాగావపుడి మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది …. ఈ సినిమా తరువాత మరో హిట్ కోసం ఎదురుచూస్తున్న సమయంలో యంగ్ డైరెక్టర్ సుధీర్ వర్మ డైరెక్షన్ లో రణరంగం అనే మాస్ ఎంటర్ టైనర్ సినిమా లో నటించారు . ఈ సినిమా లో శర్వానంద్ యాక్టింగ్ కు ప్రేక్షకులు మంచి మార్కులు వేశారు . ఈ సీనిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , సాంగ్స్ ,మరియు సుధీర్ వర్మ టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకుంది .. .. రణరంగం సినిమా తర్వాత చేసిన జాను సినిమా కూడా ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయింది ..2021 లో వచ్చిన శ్రీకారం సినిమా కూడా శర్వానంద్ కు చేదు అనుభవం మిగిలిచింది …

శర్వానంద్ – సిద్దార్ద్ , మల్టీ స్టారర్ గా డైరెక్టర్ అజయ్ భూపతి కాంబినేషన్ లో తెరకెక్కిన సినిమా మహా సముద్రం . లాంగ్ గ్యాప్ తరువాత హీరో సిద్దార్ద్ టాలీవుడ్ లో రీ ఎంట్రీ , మరియు మల్టీ స్టారర్ గా తెరకెక్కడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . ఈ సినిమా మీద ఓవర్ కాన్ఫిడెంట్ తో ఉన్న డైరెక్టర్ అజయ్ భూపతి ఆశలు అన్ని నిరాశ అయినాయి . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ అండ్ సాంగ్స్ ,మరియు మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. దీంతో ఇప్పుడు శర్వా కు అర్జెంట్ గా ఓ హిట్ అవసరం ఎంతైనా ఉంది. ఈ నేపథ్యంలో యువ హీరో ఆశలన్నీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమాపైనే ఉన్నాయి. నేను శైలజ’ ‘చిత్రలహరి’ వంటి సూపర్ హిట్స్ అందుకున్న కిషోర్ తిరుమల ఈ చిత్రానికి దర్శకుడు. ఇందులో శర్వా సరసన లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. .ఈ సినిమాకు సంబంధించి షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ..ప్రస్తుతం పాన్ ఇండియా చిత్రాలతో పాటుగా హిందీ సినిమాలు చేస్తూ క్రేజీ హీరోయిన్ గా మారిపోయింది రష్మిక. ఆమె క్రేజ్ మరియు లక్ ఇప్పుడు శర్వా కు హెల్ప్ అయ్యే అవకాశం ఉంది అని తెలుస్తుంది .. శర్వానంద్ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు ‘ సినిమా తో పాటుగా ‘ఒకే ఒక జీవితం’ అనే తెలుగు తమిళ ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాడు . ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది .. శర్వానంద్ కెరీర్ ఇప్పుడు చాలా లో ఫెస్ లో ఉంది , అలానే తాను స్టోరీ సెలెక్షన్ లో కాస్త శ్రద్ద చూపిస్తే మరింత సక్సెస్ అవుతాడు , మరి ఈ రెండు సినిమాలతో అయిన హిట్ అందుకొని బౌన్స్ బ్యాక్ అవుతాడో అనేది చూడాలి .. శర్వా కెరీర్ మళ్ళీ గాడిలో పడాలంటే ఈ రెండు సినిమాలు సక్సెస్ అవ్వాల్సి ఉంటుంది. రాబోయే రోజుల్లో ఏమి జరుగుతుందో చూడాలి…

శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….

శర్వానంద్ – సినిమా లేటెస్ట్ అప్ డేట్ …….

2020 హీరో శర్వానంద్ కు పెద్దగా కలిసి రాలేదు అని చెప్పాలి .. శర్వానంద్ – సమంత కాంబినేషన్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా జాను .. తమిళంలో పెద్ద హిట్ అందుకున్న క్లాసిక్‌ సినిమా ‘96’. ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు ఈ సినిమాను తెలుగులో రీమేక్‌ చేయాలనుకున్నారు. హీరో శర్వానంద్‌, సమంత లతో ఈ సినిమాను మాతృకకు దర్శకత్వం వహించిన సి. ప్రేమ్‌కుమారే ఈ సినిమాను కూడా తెరెకెక్కించారు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్న బాక్స్ ఆఫీస్ దగ్గర అనుకున్నంతగా హిట్ సాధించలేకపోయింది .. జాను సినిమా ప్రేక్షకులను నిరుత్సాహపరిచిన ఫిల్మ్ క్రిటిక్స్ నుండి బెస్ట్ కాంప్లిమెంట్స్ అందుకుంది .. జాను సినిమా తో ప్రేక్షకులను డిస్సపాయింట్మెంట్ చేసిన శర్వానంద్ ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని శ్రీకారం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. జాను సినిమా లవ్ స్టోరీ మరియు రీమేక్ సినిమా కాబట్టి , ఎక్కడో ఒక చోట చిన్న చిన్న లోపల వల్ల ఈ స్టోరీ కి ప్రేక్షకులు అంతగా కనెక్ట్ కాలేకపోయారు .. జాను’ సినిమాతో నిరాశపర్చిన శర్వానంద్‌ ఈసారి లవ్‌స్టోరీని కాకుండా రైతుల స్టోరీని ఎంచుకున్నాడు. ” కుటుంబకథా చిత్రాలతో పాటు లవ్ స్టోరీస్‌తో ఆకట్టుకున్న శర్వానంద్.. వ్యవసాయం నేపథ్యంలో ‘శ్రీకారం’ అనే సోషల్ మెసేజ్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , డైలాగ్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది ..

శ్రీకారం సినిమా తరువాత హీరో శర్వానంద్ డైరెక్టర్ అజయ్ భూపతి డైరెక్షన్ లో మల్టీ స్టారర్ గా ‘మహా సముద్రం సినిమా తో ప్రేక్షకులముందుకు వచ్చాడు ..ఆర్‌ఎక్స్‌ 100’ సినిమాతో తొలి ప్రయత్నంలోనే సంచలన దర్శకుడిగా మారారు అజయ్‌ భూపతి. ఇప్పుడు తన సెకండ్ సినిమాగా ‘మహా సముద్రం’ మరోసారి తన సత్తా చూపించేందుకు సిద్ధమయ్యారు. శర్వానంద్‌, సిద్ధార్థ్‌, అదితిరావు హైదరీ, అను ఇమ్మాన్యుయేల్‌ ప్రధాన పాత్రల్లో మరియు పెద్ద స్టార్ కాస్టింగ్ తో దసరా కానుకగా అక్టోబరు 14న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు పదేళ్ళ తర్వాత తెలుగు ఇండస్ట్రీకి సిద్ధార్థ్ రీ ఎంట్రీ ఇవ్వడం, ఈ సినిమా ట్రైలర్‌, పాటలకు మంచి రెస్పాన్స్‌ రావడంతో ‘మహా సముద్రం’పై అంచనాలు పెరిగాయి. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకున్నది కానీ బాక్స్ ఆఫీస్ దగ్గర యావరేజ్ టాక్ తెచ్చుకుంది ..

డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ .. ఈ సినిమా ట్రైలర్స్ , టీజర్స్ , మేకింగ్ , డైలాగ్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ,రామ్ కెరీర్ లో బిగ్గెస్ట్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి సాలిడ్ హిట్ అందుకున్నాడు .. ‘ఇస్మార్ట్ శంకర్’ ..సినిమా తరువాత రామ్ డైరెక్టర్ కిషోర్ తిరుమల కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా రెడ్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు .. గతంలో రామ్ కు ‘నేను శైలజ’, ‘ఉన్నది ఒకటే జిందగీ’ వంటి హిట్లు ఇచ్చిన కిశోర్ తిరుమలతో ‘రెడ్’ అనే సినిమా చేశాడు. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది ..

రెడ్ సినిమా తరువాత డైరెక్టర్ కిషోర్ తిరుమల కొంత గ్యాప్ తీసుకొని హీరో శర్వానంద్రష్మిక కాంబినేషన్ లో ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమాను డైరెక్ట్ చేస్తున్నాడు .. ఈ సినిమా కు సంబందించి 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయినట్లు తెలుస్తుంది . శర్వానంద్ మరియు రష్మికలపై కీలక సన్నివేశాల చిత్రీకరణతో సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి అవుతుంది అని చిత్ర యూనిట్ తెలిపింది ..ఈ సినిమా లో శర్వానంద్ పాత్ర చాలా నాచురల్ గా మన చుట్టు ఉండే కుర్రాళ్లలో ఒకడిగా అనిపిస్తుందని చిత్ర యూనిట్ సభ్యులు చెబుతున్నారు.. షూటింగ్ మెజార్టీ పార్ట్ పూర్తి చేసుకోవడంతో ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ చెయ్యాలి అనే ప్లాన్ లో ఉన్నారు చిత్ర యూనిట్ .. . ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా టైటిల్ తోనే అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. విభిన్నమైన కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమా తో శర్వానంద్ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకుంటాడనే నమ్మకంతో ఉన్నారు అభిమానులు .. శర్వానంద్ ఇటీవల మహా సముద్రం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దసరా కానుకగా వచ్చిన ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంతగా హిట్ సాధించలేకపాయింది ..మహాసముద్రం సినిమా తరువాత హీరో శర్వానంద్ చేస్తున్న ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’ అనే సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ..హీరో శర్వా కూడా ఈ సినిమా తో సక్సెస్ దక్కించుకుని మళ్లీ ఫామ్ లోకి రావాలని ఆశ పడుతున్నాడు. ఈ సినిమా వచ్చే నెల వరకు షూటింగ్ పూర్తి చేసుకునేలా ప్లాన్ చేసింది చేసింది చిత్ర యూనిట్ .. ఈ . సినిమాను వచ్చే సమ్మర్ లో విడుదల చేస్తారనే టాక్ కూడా వినిపిస్తుంది. మొత్తానికి డైరెక్టర్ కిషోర్ తిరుమల – శర్వానంద్ కాంబినేషన్ లో వస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు’ సినిమా రిలీజ్ డేట్ ఎప్పుడు అనే విషయం తెలియాలి అంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు వెయిట్ చెయ్యాలిసిందే ..