పాన్ ఇండియా మీదనే ఫోకస్ పెట్టిన రౌడీ హీరో…

                      

 ఒక్క హిట్ తో అందరికి సమాధానం చెబుతాను  అంటున్న రౌడీ హీరో...

                      

ఇండస్ట్రీ లో అవకాశాలు రావడమే చాలా కష్టం .. వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక్కో మెట్టు పైకి ఎక్కుతూ వెళ్ళాలి .. ఇక అసలు విషయానికి వెళ్ళితే … ఓవర్ నైట్ స్టార్ హీరోలు అయిన హీరోల్లో రౌడీ హీరో విజయ దేవరకొండ ఒకరు .. పెళ్లి చూపులు మూవీ తో హీరోగా కెరీర్ మొదలు పెట్టి , అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ హీరో రేంజ్ కు ఎదిగాడు .. అర్జున్ రెడ్డి ఇచ్చిన సక్సెస్ తో వరుస సినిమాలతో ఫుల్ బిజీ గా మారాడు .. ఇక అర్జున్ రెడ్డి సినిమా తరువాత విజయ్ చేసిన మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఆశించినంత స్థాయి లో విజయం అందుకోలేకపోయాయి ..

2018 లో డైరెక్టర్ పరుశురామ్ – విజయ్ దేవరకొండ కాంబినేషన్ లో వచ్చిన రొమాంటిక్ కామిడీ మూవీ గీత గోవిందం . ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజయ్ ఇంటెన్స్ యాక్టింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. గీత గోవిందం సినిమాల తరువాత విజయ్ దేవరకొండ చేసిన మూవీస్ ఏవి బాక్స్ ఆఫీస్ దగ్గర ఆకట్టుకోలేకపోయాయి .. ఇక దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్కపెట్టుకోవాలి అన్న సామెత విజయ్ దేవరకొండకు వర్తిస్తుంది ..

విజయ్ దేవరకొండ సినిమాలు ఎలా ఉన్న ఈ రౌడీ హీరో కు ప్రేక్షకుల్లో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది .. ఇక 2019 లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ – ఎనర్జిటిక్ స్టార్ రామ్ కాంబినేషన్ లో తెరెకెక్కిన మాస్ యాక్షన్ మూవీ ఇస్మార్ట్ శంకర్ .. ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ సాంగ్స్ , రామ్ ఇంటెన్స్ యాక్టిన్గ్ పూరీ డైలాగ్స్ , పూరీ టేకింగ్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. ఈ మూవీ తో సక్సెస్ బిగ్ అందుకున్న డైరెక్టర్ పూరీ కొంత గ్యాప్ ఆ తీసుకొని రౌడీ హీరో విజయ్ తో పాన్ ఇండియా మూవీగా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నాడు .. ఈ కాంబినేషన్ గురించి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి ..

ఇక విజయ్ లైగర్ సినిమా తరువాత బ్యాక్ టు బ్యాక్ మూవీస్ లైన్ లో పెడుతున్నాడు .. తమిళ్ స్టార్ సూర్య కూడా సినిమాల విషయంలో ఫుల్ స్పీడ్ మీద ఉన్నాడు ఇటీవలే ‘ఈటి’ మూవీ ఆశించిన స్థాయిలో విజయం అందుకోలేకపోయిన బాధపడుతూ కూర్చోలేదు. బాలతోను .. వెట్రి మారన్ తోను రెండు సినిమాలు లైన్లో పెట్టాడు ఈ నేపథ్యంలో ఆల్రెడీ రెండు హిట్లతో ఉన్న వరుణ్ తేజ్ రిలీజ్ కి మరో రెండు సినిమాలు రెడీ చేశాడు. ఆ సినిమాల్లో ‘గని’ ఏప్రిల్ 8వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుండగా మరొక మూవీ మే 27న ‘ఎఫ్ 3’ పలకరించనుంది.

విజయ్ దేవరకొండ .. పూరి ఇద్దరూ కూడా చకచకా సినిమాలు చేసుకుంటూ వెళ్లేవారే. కానీ కరోనా కారణంగా ‘లైగర్’ మూవీ లేటు అవుతూ వచ్చింది. ఆగస్ట్ 25వ తేదీన ఈ సినిమా థియేటర్లకు రానుంది. ఈ లోగానే తమ కాంబినేషన్లో వెంటనే మరో సినిమాగా ‘ జన గణ మన’ ప్రాజెక్టును పట్టాలెక్కించారు. వచ్చే ఏడాది ఆగస్టులో ఈ సినిమాను విడుదల చేస్తున్నట్లు ప్రకటించారు ..

ఇక విజయ్ రేస్ లో వెనుక పడినట్లుగా తెలుస్తుంది .. కానీ విజయ ఆశలు అన్ని లైగర్ మూవీ మీద నే ఉన్నాయి , ఈ మూవీ కనుక హిట్ అయితే విజయ్ కెరీర్ మరో లెవెల్ లో ఉంటుంది .. ఇక లైగర్ మూవీ తరువాత కూడా విజయ్ పూరీ తోనే జన గణ మన’ సినిమాను లైన్ లో ఉంది , ఆ తరువాత సుకుమార్ , శివ నిర్వాణ సినిమాలు లైన్ లో ఉన్నాయి .. హిట్ అందుకికొని చాలా కాలం అయింది అని అంటున్న ప్రేక్షకులకు విజయ్ లైగర్ మూవీ తో గట్టిగా సమాధానం చెబుతాను అని ధీమాగా ఉన్నట్లు తెలుస్తుంది…


జనగణమన మొదలు పెట్టిన విజయ్ … పూరి

బాక్సర్ నుండి ఆర్మీ ఆఫీసర్ లుక్ లోకి మారిన రౌడీ హీరో విజయ్ దేవరకొండ…

రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , క్రియేటివ్ గా సినిమాలను తెరకెక్కించే అతి కొద్దీ మంది డైరెక్టర్స్ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒకరు .. పూరి డైలాగ్స్ , హీరో క్యారెక్టరైజేషన్ , హీరో కి ఒక డిఫరెంట్ మ్యానరిజమ్స్ క్రియేట్ చేయాలన్న , ఇండస్ట్రీ లో ఒక ట్రెండ్ సృష్టించాలి అన్నా అది కేవలం డైరెక్టర్ పూరీ కె సాధ్యం .. ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీ లో సినిమాలు గురించి చెప్పాలి అంటే శివ సినిమాకు ముందు శివ సినిమా తరువాత అని అనేవారు , కానీ ఇప్పుడు ఇప్పుడు పూరీ జగన్నాధ్ రాకముందు , పూరీ జగన్నాధ్ వచ్చినా తరువాత అని అంటున్నారు ..

పూరీ బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు కంటిన్యూ గా చేస్తున్నప్పటికీ కొన్ని సినిమాలు బాడ్ రివ్యూస్ వచ్చాయి .. దాంతో పూరీ జగన్నాద్ టైమ్ అయిపోయింది అని అనుకున్నారు ప్రేక్షకులు , ఈ కామెంట్స్ పూరీ ని చాలా బాధపెట్టాయి , అలానే పూరీ మధ్యలో ఫైనాన్షియల్ గా కూడా కొన్ని సమస్యలు ఎదురుకొన్నారు .. అయితే పూరి పెన్ పవర్ మాత్రం తగ్గలేదు . 2019 లో డైరెక్టర్ పూరీ – ఎనర్జిటిక్ స్టార్ కాంబినేషన్ లో వచ్చిన సైన్స్ ఫిక్షన్ సినిమా ఇస్మార్ట్ శంకర్ .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ సాంగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

ఇక అసలు విజయానికి వెళ్ళితే .. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ – విజయ్ దేవరకొండ తో పాన్ ఇండియా సినిమా గా లైగర్ మూవీని తెరకెక్కిస్తున్నారు .. ఈ మూవీ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ పాన్ ఇండియా హీరోగా మరో మెట్టు ఎక్కుతున్నాడు .. ఈ క్రమంలో లైగర్ మూవీ తరువాత డైరెక్టర్ పూరీ నెక్స్ట్ మూవీ ఏమిటి అనే బుజ్ సోషల్ మీడియా లో క్రియేట్ అయింది .. అసలు పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ జన గణ మన మూవీ గురించి గత కొంత కాలంగా సోషల్ మీడియా లో పెద్ద చర్చ జరిగింది .. అసలు పూరీ కూడా తన డ్రీమ్ ప్రాజెక్ట్ – జన గణ మన మూవీ మహేష్ బాబు తో తెరకెక్కిద్దాం అని అనుకున్నారు , కానీ కొన్ని కారణాల వల్ల ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు ..’విజయ్ దేవరకొండ చేస్తున్న లైగర్ మూవీ షూటింగ్ ప్రస్తుతం శెరవేగంగా జరుగుతుంది .. ఈ క్రమంలో మల్లి పూరీ తన డ్రీమ్ ప్రాజెక్ట్ ‘జన గణ మన” మూవీ ఏ స్టార్ హీరోతో ఈ మూవీ తెరకెక్కుతున్నదో అనే వార్తలు సోషల్ మీడియా లో బాగా వినపడినాయి .. అయితే ఫైనల్ గా ఈ వార్తలు అన్నిటికి డైరెక్టర్ ఫుల్ స్టాప్ పెడుతూ .. పూరి జగన్నాథ్ – విజయ్ దేవరకొండ తో ‘జన గణ మన’ సినిమాను అనౌన్స్ చేసాడు .. ఇది పూరి జగన్నాథ్ డ్రీమ్ ప్రాజెక్ట్ కావడం… విజయ్ దేవరకొండ లాంటి పెర్ఫామర్‌ హీరోగా ఉండటంతో.. సినిమాపై అప్పుడే అంచనాలు భారీగా ఉన్నాయి .. . ఈ సినిమా కథకు సంబంధించి ముంబైలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో పూరి జగన్నాథ్ క్లారిటీ ఇచ్చేశారు.

ఇదొక ఫిక్షన్ కథ అని చెప్పిన పూరి జగన్నాథ్… తన దేశం కోసం, తన దేశ పౌరుల కోసం ఒక సైనికుడు కనే కలనే ఈ సినిమా అని తెలిపారు. దేశభక్తి, యుద్ధం వంటి అంశాల మేళవింపుతో ఈ సినిమా ఉంటుందన్నారు. ఇందులో విజయ్ దేవరకొండ ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు తెలిపారు. ఈ సినిమా చేయాలని చాలా ఏళ్ల నుంచి ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని… విజయ్ దేవరకొండ వల్ల ఇన్నాళ్లకి ఆ కల నిజం కాబోతోందని చెప్పారు.

ఇదే ప్రెస్ మీట్‌లో నటి, నిర్మాత చార్మి మాట్లాడుతూ.. జన గణ మన సినిమాలో పూర్తి భిన్నమైన విజయ్ దేవరకొండను చూడబోతున్నారని పేర్కొన్నారు. ఇక విజయ్ దేవరకొండ మాట్లాడుతూ.. ఈ సినిమా స్క్రిప్ట్ విన్నప్పుడే చాలా ఎగ్జయిటింగ్ అనిపించిందని.. ఇందులో నటిస్తున్నందుకు చాలా గర్వంగా ఉందని అన్నారు.

. విజయ్ సబ్జెక్ట్‌కి పర్ఫెక్ట్ అని భావించడంతో అతనితో ఈ సినిమా తెరకెక్కిస్తున్నాడు. వచ్చే ఏడాది ఆగస్టు 3న జన గణ మన సినిమా రిలీజ్ చేయబోతున్నట్లు పూరి ప్రకటించేశాడు. ఈ ఇద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కిన లైగర్ సినిమా విడుదలకు ముందే.. మరో మూవీ అనౌన్స్ చేయడం హాట్ టాపిక్‌గా మారింది..