గాడ్ ఫాదర్ మూవీ లో గోల్డెన్ ఛాన్స్ దక్కించుకున్న స్టార్ డైరెక్టర్…

ఖైదీ నంబర్ 150 వ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న మెగా స్టార్ చిరంజీవి , ఆ తరువాత కొంత గ్యాప్ తీసుకొని స్టైలిష్ డైరైక్టర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో సైరా నరసింహారెడ్డి సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు .. తెలుగు తొలి స్వాతంత్ర్య సమరయోధుడు ఉయ్యాలవాడ నర్సింహారెడ్డి జీవిత కథ ఆధారంగా తెరెకెక్కిన ఈ మూవీ ట్రైలర్స్ టీజర్స్ , సాంగ్స్ విజువల్ గ్రాండియర్ , సురేందర్ రెడ్డి టేకింగ్ , పవర్ ఫుల్ డైలాగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డీసెంట్ హిట్ అందుకుంది ..

సైరా నరసింహారెడ్డి మూవీ తరువాత .. చిరంజీవి కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు .. ఈ మూవీ కి సంబంధించి , మోషన్ పోస్టర్ , టీజర్ లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ త్వరలనే రిలీజ్ చేస్తాను అని అఫీషియల్ ఎనౌన్సుమెంట్…

ఆచార్య మూవీ తరువాత … మెగా స్టార్ చిరంజీవి చేతిలో వరుసగా సినిమాలు లైన్ లో ఉన్నాయి ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ మోహన్ రాజా డైరెక్షన్ లో గాడ్ ఫాదర్ మూవీ చేస్తున్నారు .. ఈ మూవీ నుండి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వినిపిస్తూనే ఉంది .. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చాలా శెరవేగంగా జరుగుతుంది ..

ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది ..ఈ మూవీ లో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నట్లు మూవీ టీమ్ అఫీషియల్ ఎనౌన్సమెంట్ చేసింది .. మెగా స్టార్ చిరంజీవి రీ ఎంట్రీ కోసం పూరీ చాలా స్టోరీస్ రెడీ చేశారు , కానీ అప్పటికి అవి ఫైనలైజ్ కాక చిరు ఖైదీ నెంబర్ 150 వ సినిమా చేశారు .. ఇక వీరిద్దరి కాంబినేషన్ లో సినిమా కోసం మెగా అభిమానులు ఎంతో ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు .. అయితే పూరీ కూడా మెగా స్టార్ తో ఎప్పటికైనా సినిమా చెయ్యాలని పట్టుదలతో ఉన్నాడు . మొత్తానికి మెగా స్టార్ చిరంజీవి ని డైరెక్ట్ చేయడానికి సరైన సమయం కోసం ఎదురు చూస్తున్న డైరెక్టర్ పూరీ జగన్నాద్ కు గాడ్ ఫాదర్ మూవీ లో నటించే గోల్డెన్ ఛాన్స్ దక్కింది . గాడ్ ఫాదర్ మూవీ లో డైరెక్టర్ పూరీ జగన్నాధ్ ఒక కీ రోల్ లో నటిస్తున్నారు అని మెగా స్టార్ చిరంజీవి అఫీషియల్ గా ఎనౌన్స్ చేయడంతో ఈ మూవీ పై మరింత క్రేజ్ పెరిగింది .. మరి అసలు గాడ్ ఫాదర్ మూవీ లో పూరీ చేయబోయే పాత్ర ఎలా ఉండబోతోంది . పూరీ స్క్రీన్ టైమ్ ఈ మూవీ లో ఎంత సేపు ఉండబోతోందో ..తెలియాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే…


2022 కాలెండర్ నాదే అంటున్న మెగాస్టార్ చిరంజీవి…

ఫుల్ స్వింగ్ లో ఉన్న మెగాస్టార్...    

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. . .. ఆచార్య సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు లైన్ లో పెట్టారు , ఆచార్య సినిమా తరువాత మోహన్ రాజా డైరెక్షన్ లో గడ్ ఫాదర్ , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో భోళా శంకర్ , బాబీ డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి …

మెగా స్టార్ చిరంజీవి యంగ్ హీరోస్ తో సమానంగా పోటీ పడి తమ సినిమాలు ఎనౌన్సమెంట్ చేయడం అభిమానులకు ఎంతో సంతోషంగా ఉంది .. గతంలో మెగా స్టార్ చిరంజీవి , సూపర్ స్టార్ కృష్ణ , ఒకే సారి మూడు నాలుగు సినిమాల్లో షూటింగ్స్ లో పాల్గొనే వారు , ఇప్పుడు అదే పద్దతి ఫాలో అవుతున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ఈ నేపథ్యంలో 2022 లో నాలుగు సినిమాలు రిలీజ్ డేట్ విషయంలో పక్కా ప్లానింగ్ తో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి ..ఆచార్య సినిమా ను ఫిబ్రవరిలో నెల లో రిలీజ్ చేయనున్నారు .ఆచార్య సినిమా తరువాత గాడ్ ఫాదర్ సినిమా సమ్మర్ లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు ..గాడ్ ఫాదర్ సినిమా తరువాత భోళాశంకర్, మరియు బాబి దర్శకత్వంలో తెరకెక్కే చిత్రాన్ని కూడా అదే స్పీడ్ లో విడుదల చేయడానికి నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి ..ఇదే స్పీడ్ కంటిన్యూ చేస్తూ మెగా స్టార్ చిరంజీవి , డీవీవీ దానయ్య నిర్మాణంలో యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తో సినిమా కమిట్ అయ్యారు .. అలానే డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో ఒక సినిమా , ఇలా మొత్తంగా 2022 లో మెగా స్టార్ చిరంజీవి కాలెండర్ ఫుల్ డేట్స్ లాక్ అయినట్లు తెలుస్తుంది …