లాలా భీమ్లా…అడవి పులి…డిజే వెర్షన్ లో విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ సాంగ్…

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతంపవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.”లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.

2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది. ‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISCసంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలిఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టిపి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీదర్శకత్వం: సాగర్ కె చంద్ర.

భీమ్లా నాయక్ సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్…

దీపావళి రోజున భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ రిలీజ్... 

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో ” భీమ్లా నాయక్” మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. ” భీమ్లా నాయక్” సినిమా టీజర్స్ , మరియు మోషన్ పోస్టర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి . మలయాళం లో సూపర్ హిట్ అయిన , అయ్యప్పనుమ్ కోషియుమ్ కు సినిమాకు ఇది రీమేక్ అవుతున్నది .. ఈ సినిమాలో మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రానా టీజర్ , మరియు పవన్ టీజర్ రిలీజ్ చేయగా , ప్రేక్షకుల్లో వీరిద్దరి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది ..పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం , మరియు రానా సరసన మొదట్లో ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి కానీ దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన అయితే రాలేదు .. మొత్తానికి ఇప్పుడీ , అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలుస్తుంది ..ఈ సినిమా లో టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది … తాజాగా ఈ సినిమాకు సంబంధించి .. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి ..
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. ఈ సినిమాకు సంబంధించి , రేపు అప్ డేట్ ఏమైనా చెప్తారేమో అంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. . దీపావళికి అది ఏమైనా ఇస్తారా అంటే కావచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. మొత్తానికి భీమ్లా నాయక్ రేపు ఉదయం 11 గంటల కు అప్ డేట్ సినిమా ఏమి చెప్పబోతున్నారు అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …