ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పండి..మోడీ కి ఆడారి కిషోర్ సవాల్..

తెలుగు సూపర్ న్యూస్, మే 6, 2024:ప్రతిపక్షాలు ఇష్టానుసారంగా తప్పుడు ప్రచారం చేస్తున్న ల్యాండ్ టైట్లింగ్ ఆక్ట్ పై నోరు విప్పి, నిజాలు చెప్పాలని ప్రధాని నరేంద్ర మోడీ కి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనకాపల్లి లోక్ సభ ఇంచార్జి ఆడారి కిషోర్ కుమార్ బహిరంగ సవాల్ విసిరారు.

సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో అయన మాట్లాడుతూ ఈ చట్టం అద్భుతంగా ఉందని, తమ పార్టీ మద్దతు ఇస్తోందని, టీడీపీ నేత పయ్యావుల కేశవ్ అసెంబ్లీ లోనే చెప్పారన్నారు. ఈ చట్టం పై అవాస్తవాలు ప్రచారం చేస్తున్న టీడీపీ నేతలు చంద్రబాబు, లోకేష్ లపై సిఐడి కి ఫిర్యాదు చేశామని, వాళ్ళు విచారణ చేస్తారన్నారు.

సీఎం రమేష్..డబ్బు మదం కాదు, దమ్ముంటే నాతొ డిబేట్ కి రా

కేవలం డబ్బు మదం తప్ప మరో అర్హత తప్ప కూటమి ఎంపీ అభ్యర్థి సీఎం రమేష్ కు లేదని, దమ్ముంటే తనతో డిబేట్ కు రావాలని ఆడారి కిషోర్ కుమార్ సవాల్ విసిరారు. కడప నుంచి కోట్లాది రూపాయలతో వలస వచ్చి, అనకాపల్లి ని ఉద్ధరిస్తానని బీజేపీ అభ్యర్థిగా వచ్చారని, అతనికి కనీసం అనకాపల్లి ఎల్లలు కూడా తెలియదన్నారు.

గత పదేళ్లుగా రాజ్యసభగా సభ్యునిగా ఆంధ్ర ను ఏమాత్రం ఉద్దరించారో చెప్పాలన్నారు. తనకు ఏపీ లోని సమస్యలు పూర్తిగా అవగాహనా ఉందని, సీఎం రమేష్ కు దమ్ముంటే తనతో ఓపెన్ డిబేట్ కు రావాలని సవాల్ విసిరారు.

కడప, తెలంగాణ కు చెందిన వందలాదిగా వాహనాలు తరలించి అనకాపల్లి లో ప్రచారం వాడుతున్నారన్నారు. అతని చిత్తశుద్ధి ఇక్కడే తెలిసిందన్నారు. స్థానిక వాహనాలను వాడితే స్థాయి స్థానిక యువతకు కొంత ఉపాధి జరుగుతుందన్నారు. కనీసం ఈ మాత్రం సాయం కూడా స్థానికులకు చెయ్యడం ఇష్టపడని వ్యక్తి ఎంపీ అయితే ఏమి ఉద్ధరిస్తాడని మండిపడ్డారు.

ఇక అనకాపల్లి ఎమ్మెల్యే అభ్యర్థి కొణతాల రామకృష్ణ గతంలో మంత్రిగా ఉంది ఏమి ఉద్దరించాడో తమకు తెలుసునని, అతని గురించి వ్యాఖ్యానించడం కూడా సమయం వృధా అన్నారు.

ఈ సమావేశంలో స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ నాయకులూ తదితరులు పాల్గొన్నారు.

“ఆంధ్రప్రదేశ్ లోక్ సభ & శాసనసభలో ఎవరెవరు?” పుస్తకాన్ని ఆవిష్కరించిన జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్..

తెలుగు సూపర్ న్యూస్ ఆగస్టు 5,2023: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసన సభ స్థానాల నుంచి, రాష్ట్రంలోని లోక్ సభ స్థానాల నుంచి 1952 నుంచి 2019 వరకూ ఎన్నికైన ప్రజా ప్రతినిధుల పేర్లు, ఫోటోలు, ఆయా స్థానాల్లో సామాజిక సమీకరణాలు, ఏ పార్టీ ఎన్నిమార్లు గెలుపు సాధించింది అనే వివరాలతో సచిత్రంగా రూపొందిన పుస్తకం ‘ఆంధ్ర ప్రదేశ్ లోక్ సభ, శాసన సభలో ఎవరెవరు?’.

ఈ సమాచారాన్ని మారిశెట్టి మురళీ కుమార్ సేకరించి పుస్తకరూప మిచ్చారు. మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ చేతులు మీదుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ పుస్తకానికి పవన్ కళ్యాణ్ “ముందుమాట” కూడా రాశారు.

ఈ సందర్భంగా పుస్తక రచయిత మురళీ కుమార్ ను పవన్ కళ్యాణ్ అభినందించారు. ఈ పుస్తకం రాజకీయాల్లో ఉన్నవారికీ..ఈ రంగంపై ఆసక్తి ఉన్నవారికీ, ఉపయుక్తంగా ఉంటుందని ఆయన అన్నారు. ఈ పుస్తకం ఆగష్టు చివరి వారంలో మార్కెట్లో అందుబాటులోకి రానుందని మారిశెట్టి మురళి తెలిపారు.

ఆ ఎంపీ వ్య‌వ‌హారమంతా.. అప్పులు, బెదిరింపులే..

keshineni-nani

తెలుగు సూపర్ న్యూస్,హైదరాబాద్, జూలై 29,2022: ప్రజాప్రతినిధిగా ఉన్న వ్యక్తి ప్రజలందరికీ ఆదర్శంగా ఉండాలి. అటువంటిది. అడుగుతీస్తే అక్రమాలు.. అప్పులు.. మా డబ్బులు మాకివ్వండని అడిగిన బ్యాంకుల అధికారులపై దౌర్జన్య కాండ చూపిస్తున్నాడు ఓ ఎంపీ. గొప్ప‌ల‌కుపోయే బెజ‌వాడ ఎంపీ బ్యాంక్ అప్పులు ఇప్పుడు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి.

keshineni-nani

”న‌న్నే డ‌బ్బులు అడుగుతారా?” అంటూ బ్యాంకు రుణాలు తిరిగి చెల్లించమంటూ వ‌చ్చిన అధికారుల‌పై విరుచుకుప‌డుతాడు ఓ బ‌డా బాబు. ఈ సీన్ ఇటీవ‌ల వ‌చ్చిన “స‌ర్కార్ వారి పాట సినిమా”లోనిది. అచ్చం అలాంటి సీన్ రియ‌ల్ లైఫ్‌లోనూ చూపిస్తున్నాడు బెజ‌వాడ ఎంపీ కేశినేని నాని. ఈ పెద్ద‌మ‌నిషి తెర వెనుక న‌డిపించిన వ్య‌వ‌హారాలు ఇప్పుడు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. బ్యాంక్‌ల‌కు ఎగ‌నామం పెట్టే క్ర‌మంలో ఉచ్చులో చిక్కుకుంటున్న‌ట్టే క‌నిపిస్తోంది. కేశినేని అప్పుల భాగోతం బట్టబయలైయ్యింది. కోట్లాది రూపాయల అప్పులు బ్యాంక్ నుంచి తీసుకుని ఎంతకూ తిరిగి చెల్లించకపోవడంతో చేసేది లేక బ్యాంక్ అధికారులు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్ లో కేసు వేశారు. ఈ కేసు దాక తెచ్చుకోవ‌డం వెనుక కేశినేని వ్య‌వ‌హార శైలియే కార‌ణ‌మే చ‌ర్చ వినిపిస్తోంది.

యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో కేశినేని కార్గో అండ్ క్యారియర్ ప్రైవెట్ లిమిటెడ్ అనే కంపెనీ పేరు మీద గ‌తంలో కోట్లాది రూపాయలు అప్పులు తీసుకున్నారు. అప్పులు తీసుకునేటప్పుడు అధికారం, పదవి అడ్డుపెట్టి బ్యాంక్ అధికారుల ముక్కుపిండి మరీ లోన్ తీసుకున్నారు ఈ ఎంపీ గారు. సీన్ క‌ట్ చేస్తే.. ఇప్పుడు తిరిగి అప్పు చెల్లించండి అంటూ ఇటీవ‌ల‌ బ్యాంక్ అధికారులు అడుగుతుంటే.. మొండిత‌నం చూపించ‌డ‌మే కాదు త‌న‌నే అడుగుతారా అంటూ వారిపై ఫైర్ అయ్యార‌ట‌. నేనేంటో మీకు తెలుసా.. నేనెవరో మీకు మతి ఉండే మాట్లాడుతున్నారా.. నాతో పెట్టుకుంటే మీ పరిస్దితి ఎమవుతుందో ఆలోచించుకోండి.

టాటా బిర్లాకు అత్యంత ఆప్తుడినైన నన్ను మీరు అప్పు చెల్లించమంటారా.. అంటూ రెచ్చిపోయారంట. దీంతో బ్యాంక్ అధికారులు నోటీసులు పంపించే ప్ర‌య‌త్నం చేశార‌ట‌. ఎన్నిసార్లు నోటీసులు పంపించినా రిసీవ్ చేసుకోలేదంట ఈ ఎంపీగారు. దీంతో యూనియన్ బ్యాంక్ అధికారులు.. ఎంపీగారి ద‌గ్గ‌ర చేసేదేంలేక అప్పు వసూలు చేసేందుకు డెబిట్ రికవరీ ట్రిబ్యునల్‌లో కేసు వేశార‌ట‌. కేశినేని అప్పుల బాగోతం పై స్పందించిన ట్రిబ్యునల్ కేశినేని కార్గో అండ్ క్యారియర్, కేశినేని శ్రీనివాసరరావు పేరుతో పత్రికా ప్రకటన విడుదల చేసింది.

keshineni-nani

త‌మ‌కు న్యాయం చేయాంటూ ట్రిబ్యునల్ ను ఆశ్ర‌యించారంటే మన కేశినేని నానిగారి అప్పులు, ఆ తరువాత బెదిరింపుల బాగోతం ఏ స్దాయిలో ఉందో అర్దం చేసుకోవచ్చు. ఈ ఘ‌ట‌న పొలిటిక‌ల్ ప‌రంగా కేశినేనికి డ్యామేజ్ జ‌రుగుతుంద‌నే టాక్ బెజవాడలో గ‌ట్టిగా వినిపిస్తోంది. టాటా-బిర్లాలు త‌న‌కు దగ్గరే.. అని బడాయిలు చెప్పే ఈ పెద్దమనిషి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని బెజవాడలోని కేశినేని ఆంతరంగికులే చర్చించుకుంటున్నారు. ఇటువంటి కేసులు మాఫీ చేయించుకోవడానికి ఎంపీ పదవిని వాడుకుంటున్నారని బెజవాడ కోడైకూస్తోంది.

ఐదేళ్ల క్రితం వెన‌క్కి వెళితే 2017లో తన ట్రావెల్ సంస్థను మూసివేస్తున్నట్లు ప్రకటించి ఎంపీ కేశినేని పెద్ద చర్చకు తావిచ్చారు. బస్సులను అడ్డం పెట్టుకుని బ్యాంకుల నుంచి వందల కోట్లు తెచ్చుకున్నారంటూ విమ‌ర్శ‌లు కూడా వ‌చ్చాయి. బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి కేశినేని మరో విజయ్ మాల్యా లాగా తయారయ్యాడని అప్ప‌ట్లో ఎమ్మెల్యే చెవిరెడ్డి ఎద్దేవా చేశారు. బ్యాంక్ నుంచి తెచ్చుకున్న‌ డబ్బులను రాజకీయావసరాల కోసం ఖర్చు పెట్టడం వల్ల ట్రావెల్స్ నిర్వహణ భారం పెరిగి మూసివేశార‌నే టాక్ వినిపించింది. ట్రావెల్స్ సంస్థను మూసివేసిన కేశినేని ఆ త‌ర్వాత‌ కార్గో బిజినెస్ మొద‌లుపెట్టారు. దానికి కూడా బ్యాంక్ అప్పులు తీసుకోవ‌డంతో త‌ల‌కు మించి భారం అవ్వ‌డంతో ఆర్థికంగా దివాల తీసిన‌ట్టు బెజ‌వాడ‌లో ప‌లువురు చ‌ర్చించుకుంటున్నారు.

గ‌తంలో కేశినేని ట్రావెల్స్ నష్టాల ఊబిలో చిక్కుక‌పోగా.. ఇప్ప‌టికీ ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేని దుస్థితికి చేరిపోయిందట. దానికి తోడు గతంలో బ్యాంక్ ల నుంచి చేసిన అప్పులు కాస్తా మెడకు చుట్టుకుంటున్నాయి. మేకపోతు గాంభీర్యం.. ఛాలెంజ్‌లు విస‌ర‌డం.. త‌న అంత గొప్ప లీడ‌రే లేరు అన్న‌ట్టుగా మీడియా ముందు డైలాగ్‌లు కొట్టే కేశినేని నాని తీరు బ్యాంక్ అధికారుల నోటీసుతో అస‌లు రంగు బయటపడింది. టాటా-బిర్లాలు త‌న‌కు దగ్గరే.. అని బడాయిలు చెప్పే ఈ పెద్దమనిషి ఇప్పుడు పీకల్లోతు అప్పుల్లో ఉన్నారని బెజవాడలోని కేశినేని ఆంతరంగికులే చర్చించుకుంటున్నారు. ఇటువంటి కేసులు మాఫీ చేయించుకోవడానికి ఎంపీ పదవిని వాడుకుంటున్నారని కూడా బెజవాడ కోడైకూస్తోంది.