భారతదేశంలో తమ కార్యకలాపాలను విస్తరిస్తూ తమ 154వ స్టోర్‌ను ప్రారంభించిన రాయల్ ఓక్..  

తెలుగు సూపర్ న్యూస్ ,హైదరాబాద్ 15 జూలై 2023: భారతదేశంలోని ప్రముఖ ఫర్నిచర్ బ్రాండ్ రాయల్ ఓక్  ఫర్నిచర్, హైదరాబాద్‌లోని మణికొండలో తన 154వ స్టోర్‌ను ప్రారంభించడం ద్వారా భారతదేశంలో తన కార్యకలాపాలను మరింతగా బలోపేతం చేసుకుంది. ఈ స్టోర్‌ను ప్రముఖ నటి కుమారి అనుపమ పరమేశ్వరన్ ఈరోజు ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో  రాయల్‌ ఓక్‌  ఫర్నిచర్‌ ఛైర్మన్‌ విజయ్‌ సుబ్రమణియం,  మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీ  మథన్‌ సుబ్రమణియం, డైరెక్టర్‌ మహేశ్వరి విజయ్‌ ;  హెడ్‌–రిటైల్‌ హెచ్‌ ఎస్‌ సురేష్‌ ; స్టేట్‌ హెడ్‌– ఆంధ్రప్రదేశ్ & తెలంగాణ  ప్రద్యుమ్న కరణం మరియు  సేల్స్‌ అండ్‌ మర్చండైజింగ్‌  హెడ్‌  ప్రశాంత్‌ ఎస్‌ కొటియన్‌ పాల్గొన్నారు.

దాదాపు 7000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ స్టోర్ విస్తృత  శ్రేణిలో  లివింగ్‌ రూమ్స్‌, బెడ్‌రూమ్స్‌, డైనింగ్‌ రూమ్స్‌  మరెన్నో వాటికి తగిన ఫర్నిచర్  అందిస్తాయి. వినియోగదారులు సోఫాలు, రిక్లైనర్స్‌, డైనింగ్‌  టేబుల్స్ , మ్యాట్రెసస్‌, బెడ్స్‌,  ఇంటీరియర్ డెకార్‌, సమగ్ర శ్రేణి ఆఫీస్‌, ఔట్‌ డోర్‌ ఫర్నిచర్‌ తో సహా అనేక రకాల స్టైలిష్, ఫంక్షనల్ వస్తువులను కస్టమర్‌లు కనుగొనవచ్చు. మణికొండ స్టోర్ హైదరాబాద్ ప్రాంతంలో రాయల్ ఓక్, 19వ స్టోర్. ఈ స్టోర్ ప్రతి సంవత్సరం 1 లక్ష కంటే ఎక్కువ మంది సందర్శకులను ఆకర్షించనుంది.

ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో రాయల్ ఓక్  ఫర్నిచర్ చైర్మన్ విజయ్‌ సుబ్రమణియం మాట్లాడుతూ  , ‘‘మా తాజా స్టోర్‌ను ప్రారంభించడం పట్ల చాలా సంతోషంగా వున్నాము. ఈ స్టోర్‌, సరసమైన ధరలలో అత్యుత్తమ ఫర్నిచర్, అందించాలనే  రాయల్‌ఓక్‌  నిబద్దత కు ప్రాతినిధ్యం వహిస్తుంది.ఈ స్టోర్,  మా వినియోగదారులకు అసాధారణమైన షాపింగ్‌ అనుభవాలను అందించగలదనే భరోసా కల్పించేందుకు మా బృందం తీవ్ర కృషి చేసింది.  అత్యంత ఆకర్షణీయమైన,పనితీరు కలిగిన ఫర్నిచర్ ను వినియోగదారులు ఇక్కడ ఎంచుకోవచ్చు. తమ ఇంటి కోసం ఖచ్చితమైన ఫర్నిచర్ ఎంచుకునేలా సహాయపడేందుకు   వినియోగదారులను స్వాగతించేందుకు మేము ఆసక్తిగా  ఎదురుచూస్తున్నాము’’అని అన్నారు.

ఆయనే మాట్లాడుతూ “ నగరంలోని ఈ ప్రాంతంలో చాలా మంది డెవలపర్‌లు భారీగా పెట్టుబడులు పెట్టడంతో రియల్ ఎస్టేట్‌లో నానాటికీ పెరుగుతున్న డిమాండ్‌ను గమనించినందున మేము మా తదుపరి స్టోర్ ప్రారంభం కోసం మణికొండను ఎంచుకున్నాము.  ఇది ఈ ప్రాంతంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాలలో మరింతగా వినియోగదారులకు సేవలను అందించటానికి బ్రాండ్‌కు అవకాశం కల్పిస్తుంది. ఈ సంవత్సరం నగరం లో మా కార్యకలాపాలను భారీగా విస్తరించటానికి ప్రణాళిక చేస్తున్నాము. దీనిలో భాగంగా నగర వ్యాప్తంగా మా స్టోర్స్ సంఖ్య ను 30 కు విస్తరించనున్నాము” అని అన్నారు. 

ఈ స్టోర్‌లో ప్రత్యేకంగా  ఎంపిక చేసిన,  సేకరించిన  “కంట్రీ కలెక్షన్‌” కూడా లభిస్తుంది. దీనిలో  అమెరికా, ఇటలీ, వియత్నాం,  టర్కీ,జర్మనీ, మలేషియా,ఇండియా  నుంచి  పూర్తి  వినూత్నమైన  ఫర్నిచర్‌  సైతం  లభించనుంది.

కొత్తగా ప్రారంభించిన స్టోర్‌ గురించి రాయల్ ఓక్ టీమ్‌ను అభినందించిన , కుమారి అనుపమ మాట్లాడుతూ, “నాణ్యత,కస్టమర్ సంతృప్తి కోసం కంపెనీ అంకితభావం మా అందరికీ స్ఫూర్తి. రాయల్ ఓక్ తమ అన్ని ప్రయత్నాలలో విజయాన్ని కొనసాగించాలని కోరుకుంటున్నాను! ” అని అన్నారు. 

తమ ప్రత్యేకమైన స్వతంత్ర దుకాణాలతో, రాయల్ ఓక్ తమ ఆధునిక, విలాసవంతమైన, సరసమైన ఫర్నిచర్‌తో ఏదైనా ఇంటి సౌందర్యాన్ని మెరుగుపరచడం లక్ష్యంగా పెట్టుకుంది. బ్రాండ్ తమ 3 మిలియన్లకు పైగా కస్టమర్ బేస్ జీవనశైలి అవసరాలను తీర్చుతోంది.

దేశవ్యాప్తంగా 200 కంటే ఎక్కువ అనుభవపూర్వక స్టోర్స్తో రాయల్ ఓక్ ప్రస్తుతం హైదరాబాద్, ముంబై, కోల్‌కతా,  చెన్నై, రాంచీ, న్యూఢిల్లీ, అహ్మదాబాద్ వంటి 116 కంటే ఎక్కువ ప్రదేశాలలో కార్యకలాపాలు నిర్వహిస్తుంది. 

Leave a Reply