అనకాపల్లి వైఎస్ ఆర్సీపీ ఎంపీ క్యాండిడేట్ గా అడారి కిషోర్ కుమార్..?

తెలుగు సూపర్ న్యూస్, ఏప్రిల్ 24,2024: యువనేత జనహృదయనేత.. ఆడారి కిషోర్ కుమార్ ప్రజలకు అందుబాటులో ఉండే నాయకుడు అంతేకాదు ఆయనకు జనాల్లో మంచి ఆదరణ ఉంది. ఆయన రాజకీయ జీవితం మొదలైనప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ తరఫున ప్రజలకు ఎన్నో సేవలు అందించారు. క్రియాశీలకంగా వ్యవహరించి అనేక కార్యక్రమాలు, ఉద్యమాలు, ఆందోళనలు చేసి ప్రజలకోసం నిలబడ్డారు. ఆపదలో ఉన్నవారికి అవసరమైన సాయం అందిస్తూ జనాల సమస్యలను పరిష్కరించారు.

ఆడారి కిషోర్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ సరైన గౌరవం ఇవ్వలేదు. అయినప్పటికీ ఎన్నో సందర్భాలుగా ద్వితీయ స్థాయి నాయకులు కార్యకర్తలు ఇదే అభిప్రాయం బహిరంగంగా ఆయనతో చెప్పారుకూడా.. ఐనా గానీ కేవలం చంద్రబాబు మీద అభిమానంతో తెలుగుదేశం పార్టీ సిద్ధాంతాల మీద ఉన్న గౌరవంతో ఆడారి కిషోర్ కుమార్ ఎటువంటి పదవులు దక్కకపోయినా తెలుగుదేశం పార్టీకి ఎంతో సేవ చేశారు.

అనకాపల్లి ఎంపీ నియోజకవర్గంలో..

దాదాపు పద్నాలుగు లక్షల జనాభా కలిగిన అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రధానంగా కాపుల ఓట్లతో పాటు, వెలమ, గవర సామాజిక వర్గాల ఓటర్లు 75 శాతానికి పైగా ఉంటాయి. కాబట్టి ప్రధాన పార్టీలన్నీ ఎప్పుడు ఈ మూడు సామాజిక వర్గాలకు చెందిన నాయకులకే ఎంపీ టికెట్లు కేటాయిస్తూ ఉంటాయి.

అనకాపల్లి ఎంపీ స్థానానికి..

అయితే అనూహ్య పరిణామాల మధ్య.. తెలుగుదేశం పార్టీ నుంచి అనకాపల్లి పార్లమెంటు స్థానానికి టికెట్ ఆశావహులుగా ఉన్న ఆడారి కిషోర్ కుమార్ స్వయంగా సీఎం జగన్ సమక్షంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు.

స్కిల్ స్కాం వ్యవహారంలో..

స్కిల్ స్కాం వ్యవహారంలో చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు స్వయంగా వైజాగ్ విమానాశ్రయం రన్వే పైనే ఆందోళన చేసినందుకు ఆయనపై కేంద్ర సాయుధ బలగాల అధికారులు కేసులు కూడా పెట్టారు. నారా లోకేష్ యువగళం యాత్రకు కూడా.. ఆడారి కిషోర్ కుమార్ తన శక్తికి మించి ఆర్థికంగా ఎంతో ఖర్చు పెట్టారు.

ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో అనకాపల్లి పార్లమెంటు టికెట్ ఆయనకు ఇస్తారని స్పష్టమైన సమాచారం అందడంతో.. ఎన్నో ఏళ్లుగా తనని నమ్ముకున్న కార్యకర్తల కోసం వాళ్ల కోరిక మేరకు అడారి కిషోర్ కుమార్ వైయస్సార్సీపి తీర్థం పుచ్చుకున్నారు.

గత ఎన్నికల్లో..

గత ఎన్నికల్లో అనకాపల్లి పార్లమెంటు నుంచి విజయం సాధించి ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్న డాక్టర్ భీసెట్టి సత్యవతి ఆ సమయంలో వచ్చిన జగన్ వేవ్ ద్వారా మాత్రమే గెలిచారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.

తన పొలిటికల్ కెరీర్ లో..

ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో.. గ్రౌండ్ లెవెల్ లో తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకోవడంలో విఫలం అవడంతో… ప్రస్తుతం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆమెకు టికెట్ ఇవ్వలేదు. అనకాపల్లి పార్లమెంటు స్థానంలో బలమైన నేత కోసం ఎదురుచూస్తున్న వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆడారి కిషోర్ కుమార్ రూపంలో ఒక బలమైన నాయకుడు దొరికాడు. మరో రెండు మూడు రోజుల్లో అనకాపల్లి పార్లమెంటు సీటు అడారి కిషోర్ కుమార్ కు ప్రకటించే అవకాశం ఉంది.

జనాల మనిషిగా..

జగన్ మోహన్ రెడ్డికి తగ్గట్లుగా అడారి కిషోర్ కుమార్ కూడా.. దూకుడుగా వ్యవహరించగలిగే యువ నేత. ఆయన కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ అన్నివిధాలా ప్రజలకు తనవంతుగా సాయం అందిస్తున్నారు. అటు సామాజిక సమీకరణలతో పాటు ప్రజల్లో ఎంతగానో మంచి పేరు ఉన్న జనహృదయనేత అడారి. కాబట్టి కొన్ని రోజుల్లో అడారి కిషోర్ కుమార్ కు టికెట్ ప్రకటించాలని అనకాపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో అడారి కిషోర్ అభిమానులు, కార్యకర్తలు కోరుకుంటున్నారు.

Leave a Reply