కళ్యాణ లక్ష్మి ,షాది ముబారక్ దేశానికి ఆదర్శం… మంత్రి కొప్పుల ఈశ్వర్

కల్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకం దేశానికి ఆదర్శం అని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ గారు అన్నారు. జగిత్యాల జిల్లా గొల్లపల్లి మండలం ఇస్రాజ్ పల్లి గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమం లో భాగంగా 4 కోట్ల 16 లక్షల తో ఇస్రాజ్ పల్లె, గోవింద్ పల్లె, గుంజపడుగు గ్రామాలను కలుపుతూ BT రోడ్డు, మరియు DMFT 2019-20, 40 లక్షల నిధులతో CC రోడ్లుకు శంకుస్థాపన చేసి, గ్రామంలో అసంపూర్తిగా ఉన్న యాదవ సంఘ భవనం అభివృద్ది కి 9.20 లక్షల తో ప్రారంభించి, 19 మంది లబ్ధిదారులకు రూ. 19,02,204 లక్షల విలువ గల చెక్కులను పంపిణీ చేశారు.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ….👉కళ్యాణ లక్ష్మీ షాదీ ముబారక్ పథకం అనేది ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలో పుట్టింది. నిరు పేద ఆడపడుచులకు పెద్దన్నయ్య ల అండగా ఉంటున్నారు.👉టీఆర్ఎస్ ప్రభుత్వం పేద ప్రజలను ఆర్థికంగా ఆదుకునేందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుంది అని అన్నారు.కళ్యాణ లక్ష్మి పథకంతో పెదింటి ఆడబిడ్డల పెండ్లికి రూ.1,00116 వేలు ఆర్దిక సహాయం అందిస్తుందని అన్నారు.👉మహిళల సంక్షేమానికి ప్రభుత్వం పెద్ద పీట వేస్తుంది. అని అన్నారు రాష్ట్రంలోని మహిళల సంక్షేమానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని చెప్పారు.👉ప్రభుత్వ కార్యక్రమాలను ఉపయోగించుకుని మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో ఉండాలని సూచించారు..