పెట్టుబడిదారులకు సులభంగా వ్యాపారం చేయడం కోసం CDSL బహు-భాషా కార్యక్రమాలను ప్రారంభించిన సెబీ ( SEBI) చైర్పర్సన్
![](https://telugusupernews.com/wp-content/uploads/2024/01/image-28.png)
తెలుగు సూపర్ న్యూస్,జనవరి 19 , 2024: తమ రజతోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని, ఆసియాలో మొట్టమొదటి లిస్టెడ్ డిపాజిటరీ అయిన సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ (ఇండియా) లిమిటెడ్ (CDSL), క్యాపిటల్ మార్కెట్ ల్యాండ్స్కేప్లో ఇంక్లూజివిటీ ,యాక్సెసిబిలిటీకి తన నిబద్ధతను వెల్లడించడానికి రెండు ప్రత్యేకమైన బహుభాషా కార్యక్రమాలను ప్రారంభించినట్లు వెల్లడించింది .
ఇటీవల జరిగిన రజతోత్సవ కార్యక్రమంలో ఈ కార్యక్రమాలను సెబీ చైర్పర్సన్ శ్రీమతి మాధబి పూరి బుచ్ ప్రారంభించారు.
![](http://telugusupernews.com/wp-content/uploads/2024/01/image-28.png)
ఈ కార్యక్రమం లో ఎండి & సీఈఓ శ్రీ నెహాల్ వోరా మాట్లాడుతూ, “మేము మా అద్భుతమైన ప్రయాణం 25 సంవత్సరాలను వేడుక చేసుకుంటున్న వేళ సెబీ చైర్పర్సన్ CDSL కీలకమైన కార్యక్రమాలను ప్రారంభించడం గౌరవం గా భావిస్తున్నాము.
ఇంక్లూజివిటీ మా ప్రధాన విలువ ద్వారా మార్గనిర్దేశం చేయబడిన ఈ కొత్త ఆవిష్కరణలు మాకు కీలక మైలురాయిగా నిలుస్తాయి . ఇన్క్లూజివ్ ట్రస్ట్ని నిర్మించడానికి పెంచడానికి అవసరమైన ప్రతి రంగంలోకి ప్రవేశించాలనేది మా ఆకాంక్ష” అని అన్నారు