రిపబ్లిక్’ మూవీ రివ్యూ

రిపబ్లిక్’ మూవీ రివ్యూ

మెగాహీరో సాయిధరమ్ తేజ్, దేవ కట్టా కాంబినేషన్ లో వచ్చిన ‘రిపబ్లిక్’ మూవీ ఈ రోజున ప్రేక్షకుల ముందుకు వచ్చింది . సోలో బ్రతుకే సో బెటర్ సినిమా తరువాత సాయిధరమ్ తేజ్ చాలా గ్యాప్ తీసుకొని డైరెక్టర్ దేవ కట్టా కాంబినేషన్ లో సినిమా ఎనౌన్స్ చేసిన తర్వాత ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి దేవ కట్టా డైరెక్షన్ లో వచ్చిన చివరి సినిమా డైనమేట్ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది .. డైనమేట్ సినిమా తరువాత దేవ కట్టా చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగాహీరో సాయిధరమ్ తేజ్ తో సినిమా ఎనౌన్స్ చేయాడం , అదే విధంగా ఈ సినిమా పొలిటికల్ సబ్జెక్ట్ కావడంతో ,ఇటు ప్రేక్షకులకు , మరియు ఇండస్ట్రీ లో అందరికి మరో ప్రస్థానం లాంటి సినిమా అవుతుంది అని అందరూ అనుకున్నారు .. దేవ కట్టా సినిమాలు ప్రేక్షకులు అంత త్వరగా జడ్జ్ చేయడం కష్టం , దేవ కట్టా సినిమాలు అంటే కమ్మర్షియల్ అంశాలు తక్కువ ఉంటాయి , సామాజిక అంశాలు చాలా అంతర్లీనంగా ఉంటాయి . సాయిధ‌ర‌మ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురై చికిత్స పొందుతుండ‌గా.. ఆయ‌న న‌టించిన సినిమా ‘రిప‌బ్లిక్’ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ‘ప్రస్థానం’తో త‌న‌దైన ముద్రవేసిన దేవాక‌ట్టా ద‌ర్శకుడు కావ‌డం.. సాయితేజ్ యువ ఐఏఎస్ అధికారిగా న‌టించ‌డంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ప్రత్యేక‌మైన ఆస‌క్తి ఏర్పడింది. కధ విషయానికి వస్తే పంజా అభిరామ్ (సాయి ధరమ్ తేజ్) చిన్న తనం నుంచి దారి తప్పిన సిస్టమ్ కి అపోజిట్ థాట్ ప్రాసెస్ తో పెరుగుతాడు. అమెరికాకి వెళ్ళాల్సిన వాడు కొన్ని కారణాల కారణంగా కలెక్టర్ కావాలని నిర్ణయించుకుంటాడు. మరోపక్క విశాఖవాణి (రమ్యకృష్ణ) పార్టీ అధికారంలోకి వస్తోంది. ఓటు బ్యాంక్ కోసం తెల్లేరును విషపూరితంగా మారుస్తారు. దాంతో లక్ష మంది వరకూ అనేక రకాలుగా ఎన్నో ఇబ్బందులు పడుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మైరా (ఐశ్వర్య రాజేష్) అన్నయ్య చనిపోతాడు. ఆ కేసుతో మొదలైన అభిరామ్ పోరాటం.. తెల్లేరు జాతకాన్ని ఎలా మార్చాడు.? ఆ తరవాత ఈ సిస్టమ్ వల్ల అతని జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? అనేది మిగిలిన కధ..

ప్లస్ పాయింట్స్ : ప్రస్థానం సినిమాలో ఏ విధమైన పొలిటికల్ డ్రామా అయితే ఉందొ , అదే విధంగా ఈ సినిమాలో పొలిటికల్ డ్రామా మరియు సిస్టమ్ లో
ప్రస్తుత రాజకీయాల గురించి, సిస్టమ్ లోని లొసుగులు గురించి సినిమాలో చర్చించిన అంశాలు అద్భుతంగా చిత్రీకరించారు .. ముఖ్యంగా డైర్ష్కుడు రాసుకున్న పొలిటికల్ సన్నివేశాలు, రమ్యకృష్ణ ట్రాక్.. జగపతిబాబు – సాయి తేజ్ మధ్య వచ్చే ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి .సాయిధ‌ర‌మ్ తేజ్ ఈ క‌థ‌ని న‌మ్మి భుజానికెత్తుకోవ‌డం అభినందించ‌గ‌ద‌గ్గ విష‌యం. సాయి తేజ్ ఈ సినిమా లో యువ ఐఏఎస్ అధికారిగా నటించి అందరి ప్రశంసలు అందుకున్నారు ..సాయి తేజ్ గత చిత్రాలకు భిన్నంగా ఈ చిత్రం ఉంటుంది అని మొదటి నుంచి దేవ కట్టా చెబుతూనేఉన్నారు .. అలాగే ఈ సినిమాలో సాయి తేజ్ కూడా సెటిల్డ్ పెర్ఫార్మెన్స్ తో తన పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. ఇంకా ఈ సినిమాలో మరో ముఖ్య పాత్ర కనిపించిన రమ్యకృష్ణ రాజకీయ నాయకురాలిగా తన నటనతో ప్రేక్షకుల అందరిని
బాగా ఆకట్టుకుంది. ఈ సినిమాలో మరో ఇంపార్టెంట్ రోల్ లో కనిపించిన జగపతిబాబు కూడా తన నటనతో ఆకట్టుకున్నారు. ఆయన కొన్ని ఏమోషనల్ సీన్స్ ను చాలా బాగా పండించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగానే చేసారు, అదే విధంగా దేవ కట్టా రాసిన డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ బాగున్నాయి.

తీర్పు :రిపబ్లిక్ అంటూ వచ్చిన ఈ పొలిటికల్ అండ్ ప్రాక్టికల్ ఎమోషనల్డ్రామాలో.. నేటి రాజకీయ వాస్తవ పరిస్థితులకు సంబంధించి ఇచ్చిన మెసేజ్, పొలిటికల్ డైలాగ్స్, అండ్ కొన్ని ఎమోషన్స్ వంటి అంశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. . ఓవరాల్ గా ఈ సినిమా, పొలిటికల్ జోనర్ లో సినిమాలను ఇష్ట పడే ప్రేక్షకులకు బాగా నచ్చుతుంది.