జాతీయంగా న్యాయవ్యవస్థలో 33% దాటిన మహిళల వాటా..

women in the judiciary

తెలుగు సూపర్ న్యూస్,ఢిల్లీ ,ఏప్రిల్ 4, 2023 : దేశములో జస్టిస్ డెలివరి పై రాష్ట్రాల ర్యాంకింగ్ లో భారతదేశములో ఒకేఒక్కటైన 2022 ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) 18 పెద్ద, మధ్యస్థ పరిమాణము కలిగిన రాష్ట్రాలలో (ఒక్కొక్కటి ఒక కోటికి పైగా జనాభా కలిగినవి) కర్ణాటక మొదటి స్థానములో ఉంది, దాని తరువాత తమిళనాడు (2020: 2వ స్థానము), తెలంగాణ (2020: 3వ స్థానము), గుజరాత్ (2020: 6వ స్థానము) ఆంధ్రప్రదేశ్ (2020: 12వ స్థానము) అని ఈరోజు ప్రకటించింది. ఏడు చిన్న రాష్ట్రాల జాబితాలో (ఒక్కొక్కటి ఒక కోటి కంటే తక్కువ జనాభా కలిగినవి) సిక్కిం మొదటి స్థానములో ఉంది (2020: 2వ స్థానము), తరువాతి స్థానాలలో అరుణాచల్ ప్రదేశ్ (2020: 5వ స్థానము), త్రిపుర (2020: 1వ స్థానములో) ఉన్నాయి.

టాటా ట్రస్ట్స్ ద్వారా 2019లో ఇండియా జస్టిస్ రిపోర్ట్ (ఐజేఆర్) ప్రారంభించబడింది. ఇది మూడవ సంచిక. భాగస్వాములలో ఉన్నవారు సెంటర్ ఫర్ సోషల్ జస్టిస్, కామన్ కాస్, కామన్ వెల్త్ హ్యూమన్ రైట్స్ ఇనీషియేటివ్, దక్ష్, టిఐఎస్‎ఎస్ – ప్రయాస్, విధి సెంటర్ ఫర్ లీగల్ పాలసీ, ఐజేఆర్ డేటా భాగస్వామి హౌ ఇండియా లివ్స్.

కఠినమైన 24-నెలల పరిణామాత్మక పరిశోధన ద్వారా, ఐజేఆర్ 2022, ఇదివరకటి రెండు మాదిరిగానే, తప్పనిసరి సేవలను సమర్థవంతంగా అందించుటకు, తమ జస్టిస్ డెలివరీ నిర్మాణాలను ప్రారంభించడములో రాష్ట్రాల పురోగతిని ట్రాక్ చేసింది. అధీకృత ప్రభుత్వ వనరుల నుండి తాజా అధికారిక గణాంకాల ఆధారంగా, ఇది పోలీసు, న్యాయవ్యవస్థ, జైళ్ళు ,న్యాయ సహాయము వంటి జస్టిస్ డెలివరీ నాలుగు స్తంభాలులపై ఆధారపడిన సమాచారాన్ని ఒకచోటికి తీసుకొస్తుంది. ప్రతి స్తంభము రాష్ట్రము సొంతంగా ప్రకటించబడిన ప్రమాణాలు ,బెంచ్‎మార్కులకు వ్యతిరేకంగా బడ్జెట్లు, మానవ వనరులు, పనిభారము, వైవిధ్యము, మౌలికసదుపాయాలు,ధోరణుల (అయిదు-సంవత్సరాల కాలములో మెరుగుపరచే ఉద్దేశము) ద్వారా విశ్లేషించబడింది. ఈ మూడవ ఐజేఆర్ 25 రాష్ట్ర మానవ హక్కుల కమిషన్,సామర్థ్యాన్ని కూడా విడిగా అంచనావేసింది (మరింత సమాచారము కొరకు ఎస్‎హెచ్‎ఆర్‎సి సంక్షిప్తాన్ని చూడండి)

తెలంగాణ పనితీరు

ఈ సంవత్సరం మొదటి అయిదు పాల్గొనే రాష్ట్రాలలో నిలుచుటకు తెలంగాణ అన్ని స్తంభాలలో తన పనితీరును మెరుగుపరచుకుంది. తొమ్మిది స్థానాలను దాటుకుంటూ, ఈ రాష్ట్రము పోలీసింగ్ స్తంభములో మొదటి స్థానములో నిలిచింది. ఇది అన్ని స్తంభాలలో మొదటి అయిదు పర్ఫార్మింగ్ రాష్ట్రాలలో ఒకటిగా నిలిచింది. 2020,2022 మధ్య 61 పోల్చదగిన సూచికలలో, తమిళనాడు అన్ని స్తంభాలలో 34 సూచికలలో పురోగతి సాధించింది. ఇండియా జస్టిస్ రిపోర్ట్ , మూడవ సంచికలో, ఈ క్రింది కీలకమైన కారణాల కారణంగా రాష్ట్రము తన మూడవ స్థానాన్ని నిలబెట్టుకుంది:

అన్ని స్తంభాలలో మహిళల వాటాను పెంచడము – వరుసగా 27% , 53% గా ఉన్న ఉన్నత న్యాయస్థానము , జిల్లా న్యాయస్థానాలు రెండిటిలో మహిళా న్యాయమూర్తులను పెంచడము. ఇది పెద్ద ,మధ్యస్త-పరిమాణము రాష్ట్రాలలో అత్యధికము.


జైళ్ళలో సవరణాత్మక సిబ్బందిలో ఖాళీలు 2019 నుండి సున్నాగా ఉన్నాయి
న్యాయవ్యవస్థలో తలసరి ఖర్చు 2017-18 లో రూ. 140 నుండి 2020-21 లో రూ. 157 కు పెరిగింది
తెలంగాణ తన పోలీసు బడ్జెట్లో 2.6% పోలీసు సిబ్బంది శిక్షణ కొరకు కేటాయించింది, ఇది పెద్ద రాష్ట్రాలలో అత్యధికము.
ఉన్నత న్యాయస్థానములో న్యాయమూర్తుల ఖాలీలు 2018-19 లో 46% నుండి 2022 లో 21% కి తగ్గాయి.
he state nearly halved vacancies at both officer and constabulary levels in the police ఈ రాష్ట్రము పోలీసులలో అధికారులు, కానిస్టేబులరీ స్థాయిలలో ఖాళీలను సగానికి తగ్గించింది.

ఉన్నత న్యాయస్థానము స్థాయిలో కేస్ క్లియరెన్స్ 2018-19 లో 61% నుండి 2022 లో 103% పెరిగింది.

రాష్ట్రములోని అన్ని పోలీసు స్టేషన్లలో కనీసము ఒక్క సిసిటీవి ఉంది
న్యాయమూర్తులు, పోలీసు అధికారులు ,కానిస్టేబులరీలో రాష్ట్రము తన ఎస్టీ మరియు ఓబీసీ కోటాలను పూర్తి చేసింది.

Leave a Reply