ఆచార్య అంచనాలను పెంచేసిన సిద్దా టీజర్…

సిద్దా రోల్ లో రామ్ చరణ్ మైండ్  బ్లోయింగ్   పెర్ఫామెన్స్...   

 

మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న సినిమా ఆచార్య .. డైరెక్టర్ కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో ఆచార్య సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు . ఆచార్య సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది . ఆచార్య సినిమా లో రామ్ చరణ్ ఒక పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు , ఈ రోల్ కోసం ముందుగా డైరెక్టర్ కొరటాల శివ మహేష్ బాబు ను అనుకున్నారు , కానీ ఆ తర్వాత అనుకోకుండా రామ్ చరణ్ ఎంటరయ్యారు .. ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి – మరియు రామ్ చరణ్ కు సంబంధించి ఇద్దరినీ చూపిస్తూ ఒక పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో ఈ పోస్టర్ కు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ కు సంబంధించి ఇటీవలే నీలాంబరి అనే సాంగ్ రిలీజ్ చేయాగా ఈ సాంగ్ కు ప్రేక్షకుల్లో మంచి స్పందన లభించింది .. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో ఉంది .

ఆచార్య సినిమా షూటింగ్ దదాపు ముగింపు దశకు చేరుకుంది . ..ఆచార్య సినిమా రామ్ చరణ్ చేస్తున్న రోల్ గురించి తెలుపుతూ చిన్న టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఈ సినిమా లో రామ్ చరణ్ సిద్దా అనే పవర్ ఫుల్ రోల్ లో కనిపిస్తున్నారు . ఆచార్య సినిమాలో రామ్ చరణ్ రోల్ కు సంబంధించి టీజర్ చూస్తుంటే ఒక ఫుల్ క్లారిటీ వచ్చింది .. ఈ సినిమాలో రామ్ చరణ్ ధర్మస్థలి కి చెందిన వ్యక్తిగా సిద్దా క్యారెక్టర్ లో కనిపిస్తున్నారు … రామ్ చరణ్ సిద్దా క్యారెక్టర్ టీజర్ చూస్తుంటే అభిమానులకు మైండ్ బ్లోయింగ్ గా ఉంది .. ఈ సినిమాలో రామ్ చరణ్ స్టైలింగ్ , మరియు యాక్షన్ సీన్స్ లోను , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని మెగా స్టార్ చిరంజీవి తో పోటీ పడి నటించారు .. ఆచార్య సినిమా లో రామ్ చరణ్ రోల్ ను చాలా స్పెషల్ గా డిజైన్ చేశారు డైరెక్టర్ కొరటాల శివ అండ్ టీమ్ .. ప్రతుతం సిద్దా టీజర్ గురించి అభిమానులు సోషల్ మీడియా లో బాగా మాట్లాడుకుంటున్నారు ..ఖైది no 150 వ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి తో – రామ్ చరణ్ ఒక సాంగ్ లో డాన్స్ చేసి ఆకాసేపు ప్రేక్షకులను అలరించారు , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ స్క్రీన్ మీద కనిపించేది కాసేపు అయినా ప్రేక్షకులను బాగా అలరిస్తారు అని పూర్తి నమ్మకంతో ఉంది చిత్ర యూనిట్ .. ప్రస్తుతం ఈ టీజర్ యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది .మొత్తానికి రామ్ చరణ్ టీజర్ చూసి అభిమానులు సంతోషంగా ఉన్నట్లు తెలుస్తుంది …


బిగ్ బి తో స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ హెగ్డే …

లెజెండరి నటుడు అమితాబ్ స్క్రీన్ షేర్ చేసుకున్న పూజ హెగ్డే …

మన టాలీవుడ్ లో బాగా డిమాండ్ ఉన్న హీరోయిన్స్ లో పూజా హెగ్డే ఒకరు .. అక్కినేని నాగ చైతన్య – విజయ్ కుమార్ కొండా డైరెక్షన్ లో వచ్చిన ఒక లైలా కోసం సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయము అయింది ఈ మహారాష్ట్ర ముద్దుగుమ్మ ..మొదటి సినిమా లో తన అందం , అభినయం నటనతో ప్రేక్షకులను బాగా అక్కటుకొని ప్రేక్షకుల హృదయంలో మంచి స్థానం సంపాదించుకుంది .. ఒక లైలా కోసం సినిమా తరువాత ఈ ముద్దుగుమ్మ కు వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి ..ముకుంద , దువ్వాడ జగన్నాధం , అరవింద సమేత వీర రాఘవ ,మహర్షి , అల వైకుంఠపురములో , వాల్మీకి సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకోవడంతో పాటు మోస్ట్ డిమాండ్ ఉన్న హీరోయిన్ గా ఎదిగిపోయింది .. బొమ్మరిల్లు భాస్కర్ – అఖిల్ డైరెక్షన్ లో వచ్చిన రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో పూజ హెగ్డే అఖిల్ సరసన నటించి మరో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది ..ప్రస్తుతం హీరోయిన్ పూజ హెగ్డే చేతిలో వరుస సినిమాలు ఉన్నాయి , వాటిలో పాన్ ఇండియా సినిమా గా రాబోతున్న రాధే శ్యామ్ సినిమా లో యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ సరసన పూజ నటిస్తుంది , అలానే ఆచార్య సినిమాలో రామ్ చరణ్ సరసన ఒక స్పెషల్ రోల్ లో నటిస్తున్నది .. ఇటీవలే ఆచార్య, రాధేశ్యామ్ సినిమాల షూటింగ్స్ కంప్లీట్ చేసిన పూజ కొద్ది రోజులు మాల్దీవుల టూర్‌ను ఎంజాయ్‌ చేసి వచ్చింది. ఈ నేపథ్యంలో ఓ షూటింగ్‌ పాల్గొన్న ఆమె సెట్స్‌ ఫొటోలను షేర్‌ చేసింది. అయితే ఇందులో ఓ లెజెండరి నటుడు అమితాబ్ ఉండటం విశేషం. నటిగా ఏ హీరోయిన్ కి అయినా కొన్ని డ్రీమ్ రోల్స్ ఉంటాయి , అలానే పలానా యాక్టర్స్ తో పని చెయ్యాలి అని ఉంటుంది ..అలానే హీరోయిన్ పూజా కు కూడా బాలీవుడ్ ‘లెజెండ్ అమితాబ్ గారితో కలిసి వర్క్ చేయాలి, కోరిక ఉంది ఆ కోరిక ఇన్నాళ్లకు నెరవేరింది. వీరిద్దరి కలిసి ఉన్న పిక్ సోషల్ మీడియా లో షేర్ చేసింది .ప్రస్తుతం ఆ పిక్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది ..

మహేష్ – త్రివిక్రమ్ కాంబో లో బుట్టబొమ్మ అవుట్ …

మహేష్, త్రివిక్రమ్ సినిమా తప్పుకున్న పూజ హెగ్డే...

మహేష్ బాబు – డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబినేషన్ లవచ్చిన బ్లాక్ బస్టర్ సినిమా సరిలేరు నీకెవ్వరు .. ఈ సినిమా తరువాత మహేష్ బాబు కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారు పాట అనే సినిమా లో నటిస్తున్నారు , ఈ సినిమాను 14 రీల్స్ ప్లస్, మరియు జిఎంబి ఎంటర్టైన్మెంట్స్, ఇద్దరు కలిసి నిర్మిస్తున్నారు .. ఈ సినిమా పై మహేష్ అభిమానుల్లో భారీ అంచనాలే ఉన్నాయి . సర్కారు వారు పాట సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ రిలీజ్ చేయగా , వీటి పై ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది .సర్కారు వారి పాట మూవీని వచ్చే ఏడాది ఏప్రిల్ 1న విడుదల చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. సర్కారు వారు పాట సినిమా తరువాత మహేష్ బాబు – డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో సినిమా చేస్తున్నారు .. ఈ సినిమాకు సంబంధించి ఎనౌన్సుమెంట్ చేస్తూ చిన్న గ్లిమ్ప్స్ రిలీజ్ చేసారు ..

మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన అతడు , మరియు ఖలేజా సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ..వీరిద్దరి హ్యాట్రిక్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి , ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద భారీ అంచనాలే ఉన్నాయి . తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి వైరల్ అయింది , ఈ సినిమాలో హీరో మహేష్ బాబు సరసన హీరోయిన్ గా మొదట పూజా హెగ్డే అనుకున్నారు .. మహేష్ బాబు – పూజా హెగ్డే తో కలిసి మహర్షి సినిమాలో నటించారు , ఈ సినిమాలో వీరిద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది .. త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో వచ్చిన అరవింద సమేత వీర రాఘవ , మరియు అల వైకుంఠపురములో రెండు సినిమాల్లోనూ త్రివిక్రమ్ శ్రీనివాస్ పూజ నే సెలెక్ట్ చేశారు ..ప్రస్తుతం హీరోయిన్ పూజా హెగ్డే కు వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి ,, ఈ నేపథ్యంలో మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో రాబోతున్న సినిమా లో పూజా హెగ్డే తప్పుకున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ – మహేష్ బాబు కాంబినేషన్ లో రాబోతున్న హ్యాట్రిక్ సినిమాలో హీరోయిన్ గా పూజా హెగ్డే తప్పుకున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్సుమెంట్ వచ్చేంత వరకు ఎదురు చుడాలిసిందే ..

          


ఆచార్య సినిమా నుండి మెగా అభిమానులకు గుడ్ న్యూస్…

సిద్ద టీజర్ ను రిలీజ్ చేస్తున్న కొరటాల టీమ్...


    

మెగా స్టార్ చిరంజీవి సైరా నరసింహా రెడ్డి సినిమా తరువాత గ్యాప్ లేకుండా సినిమాలు చేస్తున్నారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత డైరెక్టర్ కొరటాల శివ తో ఆచార్యా అనే సినిమాలో నటిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి అభిమానుల్లో పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ ..ఆచార్య సినిమా షూటింగ్ దాదాపుగా కంప్లీట్ చేసుకొని , ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాల్ని జరుపుకుంటోంది. కొరటాల శివ భరత్ అనే నేను సినిమా తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని మెగా స్టార్ చిరంజీవి తో సినిమా చేస్తుండటం , అలానే ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ , మరియు రామ్ చరణ్ స్పెషల్ రోల్ లో నటించడం , ఇలా ఒక్కో ఇంట్రస్టింగ్ న్యూస్ తో ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. కొరటాల శివ – ఈ సినిమా మేకింగ్ విషయంలో , ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .

ఇప్పటికే ఈ సినిమా లో చిరంజీవి లుక్ విషయంలో అభిమానుల దగ్గర నుండి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. అలానే ఈ సినిమాలో రామ్ చరణ్ స్పెషల్ రోల్ కు సంబంధించి , మెగా స్టార్ – రామ్ చరణ్ ఇద్దరు కలిసి ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమా లో రామ్ చరణ్ తో పాటు పూజా హెగ్డే కూడా నటిస్తున్నది , ఇటీవలే వీరిద్దరి కాంబినేషన్ లో ఒక సాంగ్ రిలీజ్ అయింది , ఈ సాంగ్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది . తాజాగా రామ్ చరణ్ టీజర్ ఎప్పుడు రాబోతున్నది అనే విషయం సోషల్ మీడియా లో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది .. అలానే రామ్ చరణ్ చేస్తున్న సిద్ద క్యారెక్టర్ గురించి టీజర్ ఎప్పుడు రాబోతుంది అని అభిమానులు ఎదురుచూస్తున్నారు .. ఈ క్రమంలో మేకర్స్ ఈ సినిమాకి సంబంధించిన ప్రచార కార్యక్రమాల్ని చాలా స్పీడ్ గా చేస్తున్నారు. ఆచార్య సినిమా నుండి ఇంతకు ముందు విడుదలైన టీజర్, రెండు సింగిల్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకోవడంతో ఈ సినిమా నుంచి త్వరలోనే నిర్మాతలు ఓ అదిరిపోయే ఎనౌన్సమెంట్ రిలీజ్ చేస్తున్నారు .. ఆచార్య సినిమాలో రామ్ చరణ్ టీజర్ త్వరలో నే ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు డైరెక్టర్ కొరటాల టీమ్ అంతా సిద్ధం చేసుకుంటున్నారు .. ఇటీవల చెర్రీ, పూజల నీలాంబరి పాటను విడుదల చేయగా.. దీనికి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది . అయితే ఈ సారి రామ్ చరణ్ సిద్ధ పాత్రకు సంబంధించిన టీజర్ గ్లింప్స్ ను త్వరలోనే విడుదల చేస్తారని తెలుస్తుంది …

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

“రంగస్థలం ” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ వినయ విధేయ రామ” . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . . వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు . రాజామౌళి బాహుబలి సినిమా తరువాత చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో రామ్ చరణ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది .. రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ఆచార్య సినిమాలో క్యామియో రోల్ లో నటిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ , మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022ఫిబ్రవరి 4న విడుదల కానున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్బంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో ఆచార్య సినిమాలో ఉండే పాట ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాలో మొదటి సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది . తాజాగా ఈ సినిమా లో మరో సాంగ్ రిలీజ్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ను చరణ్ మంచి డాన్స్ స్టెప్పులతో రూపొందించారు. ఇంతకు ముందు వచ్చిన లాహె లాహె పాట ఎలా అయితే టెంపుల్ సిటీలో చిత్రీకరించారో.. ఈ పాటను కూడా అదే పరిసరాల్లో చిత్రీకరించినట్లుగా నీలాంబరి పాట ప్రోమోను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఇక నీలాంబరిగా పూజా హెగ్డే కూడా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. ఈ సాంగ్ ను . నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీపావళి తర్వాత రోజు అంటే రేపు ఈ పాట పూర్తి నిడివి తో మన ముందుకు వస్తున్నది … ఆచార్య సినిమా ఇంత ఆలస్యం అయినా కూడా అభిమానుల్లో ఈ సినిమా గురించి కొంత అయిన ఆసక్తి తగ్గలేదు. లాహె లాహె పాట మణిశర్మ సంగీత సారధ్యంలో వచ్చి భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. , మరి ఈ నీలాంబరి పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా లు ఆలపించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించారు. ఈ పాట లో రామ్ చరణ్ డాన్స్ చాలా ఈజ్ తో ఉంది .. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు … సినిమాలో ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు…