ఒక్క రోజు ముందుగానే ఓటీటీ లో బీమ్లా నాయక్ రిలీజ్ —

Pawan kalyan

పవర్ స్టార్ స్టామినా చూపించిన భీమ్లా నాయక్ మూవీ బుల్లి తెరలో సందడి ఒక్క రోజు ముందే సందడి చేయబోతున్న భీమ్లా నాయక్ మూవీ..

మల‌యాళంలో అదో క‌ల్ట్ క్లాసిక్‌ అయిన అయ్య‌ప్ప‌యుమ్ కోషియ‌మ్‌ కు రీమేక్ గా భీమ్లా నాయక మూవీని తెరకెక్కించారు .. ఇక ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ సరసన నిత్య మీనన్ నటించగా , రానా సరసన సంయుక్త మీనన్ నటించింది .. వకీల్ సాబ్ మూవీ తరువాత చేసిన మరో రీమేక్ మూవీ కావడం విశేషం .. ఈ మూవీ లో పవన్ కళ్యాణ్ టైటల్ రోల్ భీమ్లా నాయక్ అనే పవర్ ఫుల్ పోలీస్ పాత్ర లో కనిపించగా , నెగిటివ్ షేడ్స్ లో ఉన్న డానియెల్ శేఖర్ పాత్ర లో రానా అద్భుతంగా నటించారు , ఇక క్లైమాక్స్ లో అయితే వీరిద్దరి యాక్టింగ్ థియేటర్స్ లో మంచి రెస్పాన్స్ వచ్చింది ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే .. పవర్ స్టార్ పవన్​ కల్యాణ్​, రానా దగ్గుబాటి ప్రధాన పాత్రల్లో నటించిన మల్టీస్టారర్ చిత్రం ‘భీమ్లా నాయక్’. ఈ మూవీ ఫిబ్రవరి 25 న ప్రేక్షకుల ముందుకు వచ్చింది .. ఇక ఈ మూవీ ట్రైలర్స్ , టీజర్స్ , సాంగ్స్ , పవన్ కళ్యాణ్ ఇంటెన్స్ యాక్టింగ్ , త్రివిక్రమ్ డైలాగ్స్ తో ప్రేక్షకులను బాగా ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ అందుకుంది .. థియేటర్స్ లో రిలీజ్ అయిన బిగ్ మూవీస్ హిట్ అవ్వడంతో పాటు అతి కొద్దీ రోజుల్లోనే ఓటీటీ ప్లాట్ ఫామ్ లో రిలీజ్ చేస్తున్నారు మేకర్స్ .. ఇక తాజగా భీమ్లా నాయక్ మూవీని కూడా ఆహా వేదికగా మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ మూవీ స్ట్రీమింగ్ తేదీలో చ్చిన్న మార్పు జరిగింది. ఇందుకు ఒక్కరోజు ముందుగానే అంటే మార్చి 24న ఆహాలో భీమ్లా నాయక్ మూవీ స్ట్రీమింగ్ అవుతుంది అనే విషయాన్ని మేకర్స్ సోషల్ మీడియా ద్వారా అధికారికంగా ప్రకటించారు. డైరెక్టర్ సాగర్ కె చంద్ర దర్శకత్వం వహించిన ఈ సినిమా ఫిబ్రవరి 25న విడుదలైన ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక ఈ మూవీ విడుదలైన మూడు రోజుల్లోనే వంద కోట్లు వసూలు చేసింది. ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్యదేవర నాగవంశి నిర్మించారు. అయితే ముందుగా ఈ సినిమాను ఆహాలో మార్చి 25న స్ట్రీమింగ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్. కానీ అదే రోజున జక్కన్న తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ విడుదల కాబోతుండడంతో ఒక్కరోజు ముందుగానే మార్చి 24 న స్ట్రీమింగ్ అవుతున్నట్టు ప్రకటించింది ఆహా. మొత్తానికి బీమ్లా నాయక్ మూవీ ఒక్క రోజు ముందుగా ఓటీటీ లో స్ట్రీమింగ్ అవుతున్నదుకు అభిమానులు పండగ చేసుకుంటున్నారు.


లాలా భీమ్లా…అడవి పులి…డిజే వెర్షన్ లో విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ సాంగ్…

నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ సినీ అభిమానుల ఆనందోత్సాహాలను అంబరాన్ని తాకేలా చేసిన గీతంపవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో సితార ఎంటర్ టైన్మెంట్స్ నిర్మిస్తున్న చిత్రం ‘భీమ్లా నాయక్’. స్క్రీన్ ప్లే- సంభాషణలు సుప్రసిద్ధ దర్శకుడు, రచయిత ‘త్రివిక్రమ్’ అందిస్తుండగా నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రానికి దర్శకుడు సాగర్ కె చంద్ర.”లాలా భీమ్లా…అడవి పులి”….డిజే వెర్షన్ లో ఈ రోజు విడుదల అయిన ‘భీమ్లా నాయక్‘ గీతం. ‘భీమ్లా నాయక్‘ చిత్రం నుంచి గతనెల 7 వ తేదీన ఇదే “లాలా భీమ్లా అడవి పులి” గీతం విడుదల అయిన విషయం విదితమే. ఈ చిత్రానికి సంభాషణలు, స్క్రీన్ ప్లే సమకూరుస్తున్న త్రివిక్రమ్, ఈ గీతాన్ని రచించటం విశేషం. మాటల్లో మాత్రమే కాదు పాటలో సైతం ఆయన తనదైన శైలిని పలికించారన్నది స్పష్టం చేసిందీ గీతం. సామాజిక మాధ్యమాలలో సైతం హోరెత్తింది ఈ గీతం. ఇదే గీతాన్ని ఇప్పుడు డీజే వెర్షన్లో మరో మారు విడుదల చేసింది చిత్ర బృందం.

2021 కి వీడ్కోలు పలుకుతూ..నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుతూ విడుదల చేసిన ఈ గీతం సినీ అభిమానుల ఆనందోత్సాహాలను మరోమారు అంబరాన్ని తాకేలా చేసింది. ‘భీమ్లా నాయక్‘ పోరాట సన్నివేశాల్లో భాగంగా ఈ గీతం కనిపిస్తుంది. తమన్ స్వరాలు, అరుణ్ కౌండిన్య గాత్రం మరింత హుషారు ను కలిగిస్తే మూడు నిమిషాల ముప్ఫై ఏడు సెకన్లు ఉన్న ఈ పాటలో కనిపిస్తున్న దృశ్యాలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తాయి. ‘భీమ్లా నాయక్‘ చిత్రం ఫిబ్రవరి 25,2022 న విడుదల కానుంది. ఈ దిశగా చిత్ర నిర్మాణ కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి.పవన్ కళ్యాణ్, రానా దగ్గుబాటి ల కాంబినేషన్ లో నిర్మితమవుతున్న ఈ చిత్రంలో నిత్య మీనన్, సంయుక్త మీనన్ నాయికలు. ప్రముఖ నటులు, రావు రమేష్, మురళీశర్మ, సముద్ర ఖని, రఘుబాబు, నర్రా శ్రీను , కాదంబరికిరణ్, చిట్టి, పమ్మి సాయి, చిత్రంలోని ఇతర ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. సంభాషణలు, స్క్రీన్ ప్లే: త్రివిక్రమ్ ఛాయాగ్రాహకుడు: రవి కె చంద్రన్ ISCసంగీతం: తమన్.ఎస్ ఎడిటర్:‘నవీన్ నూలిఆర్ట్ : ‘ఏ.ఎస్.ప్రకాష్వి.ఎఫ్.ఎక్స్. సూపర్ వైజర్: యుగంధర్ టిపి.ఆర్.ఓ: లక్షీవేణుగోపాల్సమర్పణ: పి.డి.వి. ప్రసాద్ నిర్మాత: సూర్యదేవర నాగవంశీదర్శకత్వం: సాగర్ కె చంద్ర.

భీమ్లా నాయక్ విడుదల వాయిదా?

సంక్రాంతి సీజన్ అంటేనే సినిమాల హవా. అభిమాన హీరో ల సినిమాలు విడుదల అవుతాయి. ప్రతి సంక్రాంతి కి భారీ సినిమాలు విడుదల అయ్యే అవకాశం ఎక్కువ… ఆర్ ఆర్ ఆర్ జనవరి 7న విడుదల కానున్నది. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ భీమ్లా నాయక్ 12న విడుదల చేయనున్నట్లు నిర్మాతలు అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే…కాని ఇప్పుడు నిర్మాతలు వెనక్కి తగ్గినట్లు తెలుస్తుంది.కొన్ని కారణాల వలన సినిమా విడుదల వాయిదా వేస్తున్నట్లు సమాచారం… నిర్మాతలు ఫిబ్రవరి ఫస్ట్ వీక్ లో భీమ్లా నాయక్ ను థియేటర్స్ లో కి తీసుకురావటానికి సన్నాహాలు చేస్తున్నారట.

చిరంజీవి ఆచార్య ఫిబ్రవరి 4న విడుదల చేస్తున్నట్లు ఇప్పటికే ప్రకటన వచ్చింది. కానీ ఆచార్య లో కొన్ని ఎపిసోడ్స్ ను రీ షూట్ చేస్తున్నారట. అందుకే ఈ సినిమా కూడా వాయిదా పడే అవకాశం ఉంది. ఆచార్య మార్చి నెలలో విడుదల చేయనున్నారు.
అన్నయ్య సినిమా రావాల్సిన నెలలో తమ్ముడి సినిమా విడుదల చెయ్యటానికి రెడీ అవుతున్నారట. మొత్తానికి కొంతమంది సినీ నిర్మాతలు కలసి పవన్ కళ్యాణ్ సినిమా ను వాయిదా వేయించారు.

జనవరి 7న, ఆర్ ఆర్ ఆర్, జనవరి 14న ప్రభాస్ రాధే శ్యామ్, జనవరి 15 న నాగార్జున బంగార్రాజు విడుదల కానున్నాయి.

భీమ్లా నాయక్ సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్…

దీపావళి రోజున భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ రిలీజ్... 

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో ” భీమ్లా నాయక్” మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. ” భీమ్లా నాయక్” సినిమా టీజర్స్ , మరియు మోషన్ పోస్టర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి . మలయాళం లో సూపర్ హిట్ అయిన , అయ్యప్పనుమ్ కోషియుమ్ కు సినిమాకు ఇది రీమేక్ అవుతున్నది .. ఈ సినిమాలో మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రానా టీజర్ , మరియు పవన్ టీజర్ రిలీజ్ చేయగా , ప్రేక్షకుల్లో వీరిద్దరి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది ..పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం , మరియు రానా సరసన మొదట్లో ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి కానీ దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన అయితే రాలేదు .. మొత్తానికి ఇప్పుడీ , అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలుస్తుంది ..ఈ సినిమా లో టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది … తాజాగా ఈ సినిమాకు సంబంధించి .. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి ..
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. ఈ సినిమాకు సంబంధించి , రేపు అప్ డేట్ ఏమైనా చెప్తారేమో అంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. . దీపావళికి అది ఏమైనా ఇస్తారా అంటే కావచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. మొత్తానికి భీమ్లా నాయక్ రేపు ఉదయం 11 గంటల కు అప్ డేట్ సినిమా ఏమి చెప్పబోతున్నారు అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

సోషల్ మీడియా లో వైరల్ అవుతున్న పవన్ – రానా లేటెస్ట్ పిక్ …..

           భీమ్లా  నాయక్  సినిమా  లేటెస్ట్   వర్కింగ్  స్టీల్..                                               

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. మలయాళంలో పెద్ద విజయవంతమైన ‘అయ్యప్పానుమ్‌ కోశియుమ్‌’ సినిమాను తెలుగులో తెలుగు లో రీమేక్ చేస్తున్నారు .. ఈ సినిమా కు సంబంధించి ఫస్ట్ లుక్ , మోషన్ పోస్టర్ , టైటిల్ ఎనౌన్సుమెంట్ చేసినప్పటినుంచి ఈ సినిమా మీద భారీ అంచనాలు ఏర్పడ్డాయి , పవన్ కళ్యాణ్ మరియు రానా కాంబినేషన్ లో వస్తున్న ఈ సినిమా మీద ఇటు ఇండస్ట్రీ లోను ,అభిమానుల్లోనూ ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. భీమ్లా నాయక్‌ సినిమా నుండి పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ కు సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ ,ఇప్పటికే పవన్ టీజర్ కు సంబంధించి సోషల్ మీడియా లో పవన్ అభిమానుల నుంచి భారీ లెవెల్ లో మంచి రెస్పాన్స్ వస్తుంది .. పవన్ కళ్యాణ్ టీజర్ తో పాటు రానా టీజర్ కూడా రిలీజ్ చేసి , అభిమానులకు ఈ సినిమా మీద అంచనాలను పెంచేలా చేసింది చిత్ర యూనిట్ .. టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది ……ఈ సినిమా కు సంబంధించి ఓక పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది , ఈ పిక్ లో పవన్ కళ్యాణ్ , రానా ఇద్దరు కలిసి విశ్రాంతి తీసుకున్నటు ఈ పిక్ లో కనబడుతుంది .. పవన్ కళ్యాణ్ గళ్ళ లుంగీ సాధారణ బ్లూ షర్ట్ లో కనబడుతుంటే , రానా వైట్ అండ్ వైట్ షర్ట్ పంచ కట్టు తో ఈ పిక్ సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది .. ఈ పిక్ చూసి అభిమానులు ఎంతో సంతోషపడుతున్నారు ..