ఒకే సారి ముగ్గురు స్టార్ హీరో లను లైన్ లో పెట్టిన త్రివిక్రమ్…

మాటల మాంత్రికుడు ” 2020 లో డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ ఆల వైకుంఠపురములో మూవీ తో బిగ్గెస్ట్ హిట్ అందుకున్నాడు .. ఆల వైకుంఠపురములో మూవీ తరువాత త్రివిక్రమ్ కొంత గ్యాప్ తీసుకొని , ప్రిన్స్ మహేష్ తో హ్యాట్రిక్ మూవీ ని తెరకెక్కిస్తున్నాడు .. ఈ మూవీ కి సంబంధించి త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్ , కాస్టింగ్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు .. ప్రస్తుతం ప్రిన్స్ మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ డైరెక్షన్ లో సర్కారు వారి పాట అనే సినిమా చేస్తున్నాడు , ఈ సినిమా షూటింగ్ శెరవేగంగా జరుగుతుంది , సర్కారు వారి పాట సినిమా పూర్తి కాగానే మహేష్ త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్ లో జాయిన్ అవుతాడు

అసలు విషయానికి వెళ్ళితే .. సర్కారు వారు పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది .. ఈలోపు త్రివిక్రమ్ టైమ్ అసలు వృధా చేయకుండా , మధ్యలో బీమ్లా నాయక్ మూవీకి స్క్రీన్ ప్లే , డైలాగ్స్ ని అందించాడు , ప్రస్తుతం మహేష్ చేస్తున్న సర్కారు వారి పాట సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది అని తెలుసుకున్న త్రివిక్రమ్ , ఈ మూవీ స్క్రిప్ట్ వర్క్ కి ఇంకాస్త మెరుగులు దిద్దుతున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి .. మహేష్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ ది హ్యాట్రిక్ మూవీ కావడంతో ఈ మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇక డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మహేష్ బాబు తో సినిమా పూర్తి కాగానే ,, ఆ తరువాత తాను చేయబోయే తరువాత మూవీస్ ని కూడా లైన్ లో పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ,, ఈ క్రమంలో మరో రెండు బడా ప్రాజెక్ట్స్ ని లైన్ లో పెట్టినట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపిస్తున్నాయి .. అయితే ఈ బడా ప్రాజెక్ట్స్ లో నటించే స్టార్స్ ఎన్టీఆర్ , అల్లు అర్జున్ పేర్లు గట్టిగా వినపడుతున్నాయి , త్రివిక్రమ్ శ్రీనివాస్ అల్లు అర్జున్ తో హ్యాట్రిక్ మూవీస్ చేసాడు ,అలానే ఎన్టీఆర్ తో అరవింద సమేత వీర రాఘవ వంటి ఇండస్ట్రీ హిట్ అందించాడు , సో త్రివిక్రమ్ శ్రీనివాస్ కు – అల్లు అర్జున్ , ఎన్టీఆర్ కు మంచి స్నేహ బంధం ఉంది …

త్రివిక్రమ్ ఇటీవల ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్, అల్లు అర్జున్‌లను కలిసినట్లు తెలుస్తుంది .. ప్రస్తుతం ఎన్టీఆర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడు , ఆ తరువాత డైరెక్టర్ కొరటాల శివ డైరెక్షన్ ఒక సినిమా చేస్తున్నాడు , అలానే అల్లు అర్జున్ పుష్ప 2 మూవీ షూటింగ్ పనుల్లో బిజీగా ఉన్నాడు .. అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ త్రివిక్రమ్‌తో పని చేయడానికి ఎప్పుడు సిద్దమే … . ప్రస్తుతానికి ఈ రెండు ప్రాజెక్ట్‌ల కు సంబంధించి స్క్రిప్ట్‌లను సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తుంది … 2022 ముగిసేలోపు మహేష్ బాబు సినిమా షూటింగ్ , పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి, వచ్చే ఏడాది తన తదుపరి చిత్రాన్ని ప్రారంభించనున్నాడు త్రివిక్రమ్. ఎన్టీఆర్ ఖాతాలో ప్రస్తుతం కొరటాల శివ, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబు, అనిల్ రావిపూడి లతో సినిమాలు ఉన్నాయి. మరోవైపు అల్లు అర్జున్ “పుష్ప 2” సినిమా చేస్తూనే అట్లీ, బోయపాటి శ్రీను మూవీస్ లైన్ లో ఉన్నాయి ..ఇక త్రివిక్రమ్ శ్రీనివాస్ – స్లో అండ్ స్టడీ మెథడ్ , స్లో టేకింగ్ , కి ఫుల్ స్టాప్ పెట్టి , కాళీ సమయంలో పలు స్క్రిప్ట్ పనులు చకా చకా మొదలు పెడుతున్నాడు . అలానే మహేష్ బాబు ప్రాజెక్ట్ అయిన తరువాత అసలు గ్యాప్ లేకుండా రెండు ప్రాజెక్ట్స్ ను పట్టాలెక్కించే పని లో ఉన్నట్లు తెలుస్తుంది .. మొత్తానికి డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ , తన అప్ కమింగ్ ప్రాజెక్ట్స్ గురించి ఎక్కడ ఎనౌన్స్ చేయలేదు , కానీ సోషల్ మీడియా లో మాత్రం త్రివిక్రమ్ శ్రీనివిస్ చేయబోయే మూవీస్ గురించే చర్చ…

గని కి అండగా ఐకాన్ స్టార్…

2019 లో గద్దల కొండ గణేష్ మూవీ తో హిట్ అందుకున్నాడు , ఈ మూవీ తరువాత వరుణ్ తేజ్ కు చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది .. ఈ గ్యాప్ లో వరుణ్ తేజ్ రెండు మూవీస్ ని లైన్ లో పెట్టాడు , వాటిలో ఒకటి గని మూవీ , మరొకటి ఎఫ్ 3 మూవీ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఈ మూవీ తో డైరెక్టర్ కిరణ్ కొర్రపాటి టాలీవుడ్ ఇండస్ట్రీ లో కి దర్శకుడిగా గా పరిచయం అవుతున్నారు …

కరోనా కారణంగా గని మోవి గత కొన్ని నెలలుగా రిలీజ్ డేట్ వాయిదా పడుతూ వచ్చింది .. ఎట్టకేలకు ఈ మూవీ ఏప్రిల్ 8న థియేటర్లలో విడుదుల అవుతున్నది .. ఇక ఈ మూవీ నుండి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ టీజర్ కు ప్రేక్షకుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ మూవీ కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ ట్రైలర్ వరుణ్ తేజ్ అభిమానులకు బిగ్ విజువల్ ట్రీట్ .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ మూవీ కోసం వరుణ్ తేజ్ బాగా కష్టపడ్డాడు .. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో మూవీ ప్రమోషన్స్ ని స్పీడ్ అప్ చేసింది చిత్ర యూనిట్ .. ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ కోసం భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి .. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుకను చాలా గ్రాండ్ గా ఏర్పాటు చేయాలని చిత్ర యూనిట్ భావిస్తుంది .. ఈ క్రమంలో గని ప్రీ రిలీజ్ ఈవెంట్ ను ఏప్రిల్ 2న వైజాగ్ వేదికగా నిర్వహించనున్నట్లు మూవీ టీమ్ ప్లాన్ చేస్తుంది .. అయితే ఈ ప్రీరిలీజ్ ఈవెంట్ కు ముఖ్యఅతిథిగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వస్తున్నారు అని మూవీ టీమ్ ప్రకటించింది .. సుమారు రెండు ఏళ్ళ గ్యాప్ తరువాత వస్తున్న గని మూవీ మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి .. ఇక మూవీ రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రీ రిలీజ్ ఈవెంట్ భారీగానే ప్లాన్ చేసింది , మొత్తం మీద గని ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా అల్లు అర్జున్ హాజరు కావడం మెగా అభిమానులందరికి గుడ్ న్యూస్ ….

కొరటాల దర్శకత్వం లో అల్లు అర్జున్, ధనుష్ భారీ మల్టీస్టార్…

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది .. ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ ప్రారంబించింది డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. స్టోరీ నచ్చాలి , కధలో దమ్ము ఉండాలే గాని మన హీరోలు మల్టీ స్టారర్ సినిమా లు చేయడానికి ఎప్పుడు సిద్దమే .. ప్రస్తుతం డైరెక్టర్స్ ఆలోచనలు మారుతున్నాయి .. రొటీన్ మూవీస్ కు దూరంగా ఉంటూ , రియాలిటీ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు .. అలానే సినిమా ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది ..

ఇక అసలు విషయానికి వెళ్ళితే ….. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ హీరోలను బిగ్ స్క్రీన్ మీద ఒకే తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ఈ క్రమంలో నిర్మాతలు కూడా కాంబినేషన్స్ సెట్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు .. అయితే కొన్ని కాంబినేషన్స్ త్వరగా సెట్ అవుతాయి , కొన్ని సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది .. ఇక డైరెక్టర్స్ రూట్ మారుస్తూ రెగ్యులర్ మూవీస్ కి దూరంగా ఉంటూ విభిన్నమైన , కొత్తరకమైన కధలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు ….మల్టీ స్టారర్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు .. ఇద్దరు స్టార్ హీరోలను న్యాయం చెయ్యాలి .. ఇద్దరి పాత్రలు బ్యాలెన్స్ చేయాలి ..ఈ ఫార్ములాని ..డైరెక్టర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఇద్దరి హీరోలను బాగా బాలన్స్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు .. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ అవ్వడంతో , డైరెక్టర్స్ అందురు మల్లి మల్టీ స్టారర్ సినిమా లు చెయ్యాలనే ఆలోచనల మీద ఉన్నారు .. రాజామౌళి బ్రాండ్ సినిమాగా ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ క్రేజ్ నడుస్తుండగానే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సెట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ..

తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు …. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ….ఈ క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో దాన్నికంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు .. పుష్ప 2 మూవీ తరువాత కూడా పాన్ ఇండియా మూవీస్ తోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. , కొరటాల శివ దర్శకత్వంలో ధనుష్-అల్లు అర్జున్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమా కు బేస్ పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. మరి ఈ మల్టీ స్టారర్ మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే ….

పుష్ప దర్శకుడికి మెగాస్టార్ చిరంజీవి ప్రశంసలు…

పాన్ ఇండియా చిత్రం పుష్ప సినిమా సాధించిన బ్లాక్‌బస్టర్ విజయంతో అందరి ప్రశంసలు అందుకుంటున్న సృజనాత్మకత దర్శకుడు సుకుమార్‌ను మెగాస్టార్ చిరంజీవి అభినందనలతో ముంచెత్తారు. అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీస్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ నిర్మించిన ఈ పాన్ ఇండియా సినిమాను ఇటీవల మెగాస్టార్ వీక్షించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకుమార్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించి సినిమాను తనకెంతో బాగా నచ్చిందని, అన్ని భాషల్లో పుష్పకు లభిస్తున్న ఆదరణ పట్ల తనకెంతో ఆనందంగా వుందని, సినిమాలో పుష్పరాజ్‌గా అల్లు అర్జున్ నటన చక్కగా వుందని, సినిమాలోని ప్రతి అంశం ఎంతో అద్భుతంగా వుందని, దర్శకుడుగా సుకుమార్ పడిన తపన, కష్టం ప్రతి ఫ్రేములో కనిపించదని, అందుకు తగ్గ ప్రతిఫలం బ్లాక్‌బస్టర్ రూపంలో వచ్చిందని చిరంజీవి ఈ సందర్భంగా కొనియాడారు.

అల్లు అర్జున్ కలెక్షన్స్ సునామీ.. 2 రోజుల్లో ‘పుష్ప’ 116 కోట్ల గ్రాస్..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కించిన సినిమా పుష్ప. డిసెంబర్ 17న ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రానికి ఓపెనింగ్స్ అదిరిపోతున్నాయి. మొదటి రోజు 2021 ఇండియన్ బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచిన పుష్ప.. రెండో రోజు కూడా అదే జోరు చూపించాడు. తొలిరోజు 71 కోట్లు వసూలు చేసిన ఈ చిత్రం.. రెండో రోజు మరో 45 కోట్లు గ్రాస్ వసూలు చేసింది. తెలుగు ఇండస్ట్రీలో రికార్డులు తిరగరాస్తున్నాడు అల్లు అర్జున్. ముఖ్యంగా కరోనా సెకండ్ వేవ్ ముగిసిన తర్వాత అత్యధిక ఓపెనింగ్స్ తీసుకొచ్చిన ఇండియన్ సినిమాగా నిలిచింది పుష్ప. రెండో రోజు కూడా ఈ చిత్రానికి అన్నిచోట్ల హౌజ్ ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. మూడో రోజు కూడా అద్భుతంగా ఓపెన్ అయింది. అల్లు అర్జున్ మాస్ స్టామినాకు ఇది నిదర్శనం. ఆయన పర్ఫార్మెన్స్‌కు అంతా ఫిదా అయిపోతున్నారు. పుష్ప సినిమాను కేవలం అల్లు అర్జున్ కోసమే చూడొచ్చు అనేలా థియేటర్స్‌కు క్యూ కడుతున్నారు ఆడియన్స్. కేవలం తెలుగులోనే కాకుండా మిగిలిన రాష్ట్రాల్లోనూ మంచి ఓపెనింగ్స్ తెచ్చుకుంది ఈ చిత్రం. తమిళం, హిందీలో అయితే అంచనాలకు మించి అద్భుతమైన ఓపెనింగ్స్ తెచ్చుకుంటుంది పుష్ప. అల్లు అర్జున్ ఐకానిక్ ఇమేజ్‌కు ఇది నిదర్శనంగా నిలుస్తుంది. రెండు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమాకు 116 కోట్ల గ్రాస్ వచ్చింది. రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సునీల్, అనసూయ, జగదీష్ ప్రతాప్ భండారీ కీలక పాత్రల్లో నటించారు. మైత్రి మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా పుష్ప సినిమాను నిర్మించారు.

పుష్ప రాజ్ అరాచకం మాములుగా లేదు…

 ఊర మాస్ లుక్ లో అల్లు అర్జున్ హై వోల్టేజ్ యాక్షన్...

   

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి … వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా కాబట్టి ప్రేక్షకుల్లో భారీ అంచనాలే ఉన్నాయి , ఈ అంచనాలను ఎక్కడ తగ్గకుండా సుకుమార్ తగిన జాగ్రతలు తీసుకుంటున్నారు .. ఇప్పటికే పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. తాజాగా పుష్ప: ది రైజ్ పార్ట్ 1 ట్రైలర్ ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..

ఈ ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది .. .ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే అద్భుతమైన యాక్షన్-థ్రిల్లర్‌గా ఈ సినిమా తెరకెక్కుతుంది .ఈ సినిమాలో అల్లు అర్జున చాలా పవర్ ఫుల్ మాస్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఈ సినిమాలోని విజువల్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి .. అలానే ట్రక్ డ్రైవర్ గా అల్లు అర్జున నటన సూపర్బ్ గా ఉంది . అల్లు అర్జున యాక్టింగ్ లోని మరో కోణాన్ని సుకుమార్ బలే ప్రెజెంట్ చేసారు , ఈ ట్రైలర్ కు ప్రేక్షకుల్లోనూ , మరియు టాలీవుడ్ ఇండస్ట్రీ లోను మంచి రెస్పాన్స్ వస్తుంది .. అదే విధంగా ఈ ట్రైలర్ లో అనసూయ , మరియు సునీల్ డైలాగ్స్ మరియు వారి లుక్స్ కు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు .ఈ సినిమాలో విలన్ రోల్ లో కనిపించిన ఫహద్ ఫాసిల్ ట్రైలర్ చివరి షాట్ లో మంచి విలనిజం తో ప్రేక్షకులను థ్రిల్ చేస్తారు . పుష్ప ట్రైలర్ కు సోషల్ మీడియా లో భారీ రెస్పాన్స్ వస్తుంది , అలానే ఈ ట్రైలర్ తో సినిమా మీద ఒక్క సారిగా అంచనాలు భారీగా పెరిగిపోయాయి .డైరెక్టర్ సుకుమార్ -అల్లు అర్జున పడిన కష్టం ట్రైలర్ లో కనబడుతుంది .. అలానే మైత్రి మూవీ మేకర్స్ సినిమా విషయంలో ఖర్చు కు ఏమాత్రం వెనుకాడలేదు అని ట్రైలర్ చూస్తేనే తెలుస్తుంది .. పుష్ప సినిమా ట్రైలర్ యూట్యూబ్ లో ఇంత అదిరిపోయే రెస్పాన్స్ రావడంతో చిత్ర యూనిట్ బాగా సంతోసపడుతున్నారు ..

.

అల్లు అర్జున్ కోసం రంగంలోకి దిగిన సమంత…

పుష్ప సినిమా కోసం ఐటమ్ సమంత సాంగ్...

అల్లు అర్జున – డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న హ్యాట్రిక్ సినిమా పుష్ప .. ఆల వైకుంఠపురములో సినిమా తో బిగెస్ట్ హిట్ అందుకున్నా హీరో అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో పుష్ప అనే పాన్ ఇండియా సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు ..సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , గతంలో కూడా వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి ..పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేయగా వీటి పై అల్లు అర్జున అభిమానుల్లో మంచి రెస్పాన్స్ వచ్చింది . .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన ఫస్ట్ టైమ్ రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తుంది.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ చాలా స్పీడ్ గా జరుగుతుంది ,, డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమాను రెండు పార్ట్శ్ గా తెరకెక్కిస్తున్నారు .. పుష్ప సినిమాకు సంబంధించి రోజు ఎదో ఒక న్యూస్ సోషల్ మీడియా లో వస్తూనే ఉంది .. ..పుష్ప సినిమా ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నారు , తాజాగా ఈ ట్రైలర్ రిలీజ్ డేట్ ఎనౌన్సుమెంట్ చేస్తూ ఒక చిన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..ఈ పోస్టర్ లో డిసెంబర్ 6 న ట్రైలర్ రిలీజ్ అవుతుంది అని మేకర్స్ ఎనౌన్సమెంట్ చేశారు .. .ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తుంది .ఈ సినిమా లో డైరెక్టర్ సుకుమార్ ఐటమ్ సాంగ్ ప్లాన్ చేశారు . సుకుమార్ సినిమాలో ఐటమ్ సాంగ్ కంపల్సరీ గా ఉండాలిసిందే , సుకుమార్ మొదటి సినిమా నుండి చివరి సినిమా రంగస్థలం సినిమా వరకు తన ప్రతి సినిమాలో ఒక ఐటమ్ సాంగ్ పక్కాగా ఉంటుంది ..పుష్ప సినిమా విషయంలో నిర్మాతలు ఖర్చు విషయంలో ఎక్కడ రాజీ పడకుండా నిర్మిస్తున్నారు , ఈ సినిమా లో ఐటమ్ సాంగ్ కోసం డైరెక్టర్ సుకుమార్ సమంత ను రంగంలోకి దింపారు ..

ప్రస్తుతం అల్లు అర్జున్, సమంతల మధ్య వచ్చే ఐటమ్ నంబర్ ను రామోజీ ఫిల్మ్ సిటీలోని భారీ సెట్‌లో షూట్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సమంత అద్భుతమైన పోస్టర్‌ను షేర్ చేసింది .. ఈ పాట ఈ సంవత్సరం అద్భుతమైన సాంగ్ గా ఉంటుంది అని డైరెక్టర్ సుకుమార్ పూర్తి నమ్మకంగా ఉన్నారు …సమంత షేర్ చేసిన పిక్ లో సామ్ మొహం చూపకపోయినా, రంగురంగుల కాస్ట్యూమ్స్‌లో మెరిసిపోతున్న సామ్ తో పాటు ఈ పాట ఎలా ఉండబోతుందో ఓ ఐడియా ఇచ్చింది. ఈ సాంగ్ కు ప్రముఖ హిందీ కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందిస్తున్నారు .పుష్ప సినిమాకు సంబంధించి సమంత షేర్ చేసిన పిక్ సోషల్ మీడియా లో బాగా వైరల్ అయింది .. పుష్ప సినిమా లోని ఈ ఐటమ్ సాంగ్ కోసం అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు , మరి డైరెక్టర్ సుకుమార్ అల్లు అర్జున్ – సమంత లతో ఐటమ్ సాంగ్ ను ఏ రేంజ్ లో చూపిస్తారో తెలియాలంటే మరి కొద్దీ రోజులు ఆగలిసిందే ..

బిడ్డా ఇది నా అడ్డా… అల్లు అర్జున్ వార్నింగ్

పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ రిలీజ్

     

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా “అల వైకుంఠపురములో” , ఈ సినిమా వీరిద్దరి కి హ్యాట్రిక్ కాంబినేషన్ , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది . అల వైకుంఠపురములో సినిమా తరువాత అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప సినిమా ఎనౌన్స్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హ్యాట్రిక్ కాంబినేషన్ అవ్వడంతో ఈ సినిమా మీద ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి .. ఇప్పటికే పుష్ప సినిమా కు సంబంధించి టీజర్ , మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్స్ ను రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . పుష్ప సినిమా టీజర్ లో అల్లు అర్జున్ తగ్గేదేలే అనే డైలాగ్ ఎందుకు చెప్పారో కానీ తెలియదు కానీ ఈ సినిమాలో మటుకు సాంగ్స్ , ఫైట్స్ , లొకేషన్స్ , హీరోయిజం , బన్నీ క్యారెక్టర్ లో సుకుమార్ ఎక్కడ తగ్గట్లేదు .. పుష్ప సినిమా నుండి మూడు సాంగ్స్ రిలీజ్ చేసి , మూడు సాంగ్స్ కు అభిమానుల్లో మంచి స్పందన లభించింది .. స్టైలిష్ స్టార్ అల్లు అర్జున – సుకుమార్ కాంబినేషన్ లో వస్తున్న పాన్ ఇండియా సినిమా కావడం , ఆర్య , ఆర్య 2 సినిమాల తరువాత చాలా లాంగ్ గ్యాప్ తీసుకొని వీరిద్దరి కాంబినేషన్ లో హ్యాట్రిక్ సినిమాగా పుష్ప రావడం అభిమానుల్లో అంచనాలు బాగా పెరిగాయి .

అల్లు అర్జున్ ఏ ఫంక్షన్ కి చీఫ్ గెస్ట్ గా వచ్చిన అభిమానులు పుష్ప సీనిమా గురించి గోల చేస్తున్నారు .. పుష్ప సినిమా సబ్జెక్ట్ పెద్దది కావడంతో ఈ సినిమాను డైరెక్టర్ సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కిస్తున్నారు .. ఈ సినిమాలో అల్లు అర్జున సరసన రష్మిక మందన్నా ఫస్ట్ టైమ్ నటిస్తున్నది .. తాజాగా ఈ సినిమాకు సంబంధించి నాల్గో సాంగ్ ను విడుదల చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది .. ఈ క్రమంలో ‘ఏ బిడ్డ ఇది నా అడ్డ’అంటూ సాగే నాల్గో పాట ను నవంబర్ 19న విడుదల చేయబోతున్నట్లు ప్రకటిస్తూ ఓ కొత్త పోస్టర్‌ని విడుదల చేసింది సుకుమార్ టీమ్ ..ఈ పోస్టర్ లో అల్లు అర్జున్ లో గుబురు గడ్డం, పొడవైన జుట్టుతో ఎర్రటి నిలువు బొట్టు పెట్టుకుని సోఫాలో స్టైల్‌గా కూర్చున్నాడు. ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా లో బాగా వైరల్ గా మారింది .. పుష్ప సినిమా నుండి వస్తున్న నాల్గో సాంగ్ పక్కా మాస్ సాంగ్ గా అభిమానులను అలరించనుంది . సుకుమార్ సినిమాలో మాస్ సాంగ్స్ కు ఒక స్టైల్ ఉంది అలానే మాస్ సాంగ్స్ కంపోజింగ్ విషయంలో మ్యూజిక్ డైరెక్టర్ దేవి శ్రీ ప్రసాద్ కూడా చాలా జాగ్రత్తలు తీసుకుంటారు .. మొత్తానికి నవంబర్ 19న పుష్ప సినిమా నుండి నాల్గో సాంగ్ ఎలా ఉండబోతోందో అని అభిమానులు ఆశగా ఎదురుచూస్తున్నారు …

పుష్ప ని బయపెడుతున్న సునీల్…

పుష్ప లో సునీల్ లుక్ రచ్చ చేశాడు…

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో హ్యాట్రిక్ గా పుష్ప సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి . సుకుమార్ – అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురికి హ్యాట్రిక్ సినిమా , అలానే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు .. అల్లు అర్జున్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మరో మెట్టు ఎక్కడానికి బాగా కష్టపడుతున్నారు . పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . సుకుమార్ పుష్ప సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ న్యూస్ వదులుతూ అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెడుతున్నారు చిత్ర యూనిట్ .. ఇప్పటికే రిలీజ్ అయిన , మూడు లిరికల్ సాంగ్స్ కు అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు , దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు .. పుష్ప సినిమా కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తోంది .. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన రోల్ లో నటిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. సునీల్ కమీడియన్ నుండి హీరో మారి హిట్స్ అందుకొని మల్లి టైమ్ బాగోక , మల్లి క్యారెక్టర్ రోల్స్ మరియు సపోర్టింగ్ రోల్స్ , మరియు విలన్ రోల్స్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు .. డిస్కో రాజా , కలర్ ఫోటో , లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి సునీల్ , విలన్ క్యారెక్టర్ ఇచ్చిన కాన్ఫిడెంట్ గా చేయగలడు అని పేరు సంపాదించుకున్నాడు .. ప్రస్తుతము సునీల్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , సుకుమార్ మొదటి సినిమా ఆర్య లో సునీల్ నటించాడు , మల్లి చాలా కాలం తరువాత సునీల్ పుష్ప సినిమా లో నటిస్తున్నారు , సునీల్ కు ఏ క్యారెక్టర్ ఇచ్చిన ప్రాణం పెట్టి పని చేస్తాడు , అలానే సుకుమార్ ఆర్టిస్ట్ ల దగ్గర నుండి పెర్ఫార్మన్సెస్ బాగా రాబట్టగలడు , మరి సునీల్ లో సుకుమార్ ఎం చూశాడో తెలియదు గాని , పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప సినిమాలో సునీల్ కు బంపర్ ఆఫర్ దక్కింది అనుకోవాలి .. పుష్ప సినిమా లో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తున్నారు , ఈ పాత్ర కు సంబంధించి సునీల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ఈ పోస్టర్ లో సునిల్ లుక్స్ అదిరిపోయాయి , సునీల్ లుక్స్ బాగున్నాయి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి .. అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి సునీల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు ..సునీల్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బ్రేక్ పుష్ప చిత్రంతో అందుకోవడం ఖాయంగానే అనిపిస్తుంది …

1 2