హాట్ లుక్స్ తో కురాళ్ళ ను కవిస్తున్న యాంకర్ …

ప్రాడక్ట్ ప్రమోషన్‌ లో హాట్ లుక్స్ తో అదరకొట్టిన యాంకర్ విష్ణు ప్రియ...

సినీ ఇండస్ట్రీ లో హీరోయిన్స్ కి మహా అయితే 5 ఏళ్ళు లైఫ్ టైమ్ పీరియడ్ ఉంటుంది , ఈ 5 ఏళ్ల కాల వ్యవధిలో గ్లామర్ హీరోయిన్ గాను , లేడి ఓరియెంటెడ్ రోల్స్ లోను సపోర్టింగ్ రోల్స్ లో ను నటించి , ఆ తరువాత డిమాండ్ తగ్గితే అమ్మ పాత్రలకు లేక టీవీ సీరియల్స్ లోనో మరియు యాంకర్ గానో యు టర్న్ తీసుకుంటున్నారు .. ప్రస్తుతము సీనియర్ హీరోయిన్స్ రోజా , ఇంద్రజ , రమ్య కృష్ణ టీవీ షోస్ చేస్తూ అడపా దడపా సినిమా చేస్తున్నారు , టీవీ యాంకర్స్ కు ఒకరి తో ఒకరికి గట్టి పోటీ ఉంటుంది .. టెలివిజన్ యాంకర్స్ లో అనసూయ , మరియు రష్మి కు గట్టి పోటీ ఉంటుంది , వీరిద్దరూ చేస్తున్న షోస్ లో ఒకరిని మించి ఒకరు అదిరిపోయే కాస్ట్యూమ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు .. ప్రస్తుతము టీవీ షో లో కొంత మంది యాంకర్స్ కాస్ట్యూమ్స్ విషయంలో లిమిట్ దాటేస్తున్నారు ,,యాంకర్లు ఒక పద్ధతిగా ఉండాలి అనే రూల్ ని పక్కన పెట్టి వారు ఇష్టము వచ్చినట్లు వారంటున్నారు .. టెలివిజన్ ఇండస్ట్రీకి వస్తున్నపుడే యాంకర్లు కూడా హీరోయిన్ల కంటే సూపర్‌గా గ్లామర్ షో చేయాలని అనుకుంటున్నారు . ఇప్పటికే తెలుగులో అనసూయ, రష్మి, వర్షిణి వంటి వాళ్లు హీరోయిన్లకు పోటీగా గ్లామర్ షో చేస్తున్నారు అని సోషల్ మీడియాలో కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి .. ఫన్ బకెట్‌తో పాపులర్ అయిన విష్ణుప్రియ.. ఆ తర్వాత యాంకర్‌గానూ మారింది ,, ఆ తరువాత సుడిగాలి సుధీర్‌తో చేసిన పోవే పోరా షోతో మోస్ట్ పాపులర్ అయింది. ఈ షోలో అందాలు విపరీతంగా ఆరబోసి బాగా పాపులర్ అయి వార్తల్లో కి ఎక్కింది .. ప్రస్తుతం తనకు అవకాశాలు వచ్చినా.. రాకపోయినా తన గురించి అందరూ మాట్లాడుకునేలా చేస్తుంది ఈ యాంకర్. హీరోయిన్లు మించే లా అందాలు ఆరబోస్తుండటం , కెమెరా ముందు హాట్ లుక్ పిక్స్ తో ప్రేక్షకులకి గట్టి షాక్ ఇస్తుంది , ఈ హాట్ లుక్ పిక్స్ కొన్ని సోషల్ మీడియా లో కనిపించడం ఈమె కానీ సినిమాల్లోకి వచ్చిందంటే హీరోయిన్లు కు గట్టి పోటీ ఇస్తుంది అని కొన్ని కామెంట్స్ వినిపిస్తున్నాయి , . ఇప్పటికే రెండు మూడు సార్లు హై ఓల్టేజ్ ఫోటోషూట్స్ చేసిన విష్ణుప్రియ.. ఇప్పుడు మరోసారి హాట్ ఫొటోలను సోషల్ మీడియా లో పెట్టి మిగతా యాంకర్స్ కు గట్టి షాక్ ఇచ్చింది .. తాజాగా ఓ ప్రాడక్ట్ ప్రమోషన్‌లో భాగంగా ఈ అమ్మడు రెచ్చిపోయిన తీరు చూసి అంతా షాకవుతున్నారు. తాజాగా చేసిన ఈ ఫొటోషూట్‌తో బాగా హాట్ లుక్స్ తో కనిపించి ఆకట్టుకుంది …

పుష్ప ని బయపెడుతున్న సునీల్…

పుష్ప లో సునీల్ లుక్ రచ్చ చేశాడు…

అల్లు అర్జున్ – త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా అల వైకుంఠపురములో .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .అల వైకుంఠపురములో సినిమా తో ఇండస్ట్రీ హిట్ అందుకున్న స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కొంత గ్యాప్ తీసుకొని డైరెక్టర్ సుకుమార్ తో హ్యాట్రిక్ గా పుష్ప సినిమా ఎనౌన్సుమెంట్ చేశారు .. సుకుమార్ – అల్లు అర్జున్ ది హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వచ్చిన ఆర్య , ఆర్య 2 సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయ్యాయి . సుకుమార్ – అల్లు అర్జున్ – దేవిశ్రీ ప్రసాద్ ముగ్గురికి హ్యాట్రిక్ సినిమా , అలానే ఈ సినిమాను పాన్ ఇండియా సినిమాగా తెరకెక్కిస్తున్నారు .. అల్లు అర్జున్ ఈ సినిమా తో పాన్ ఇండియా స్టార్ గా మరో మెట్టు ఎక్కడానికి బాగా కష్టపడుతున్నారు . పుష్ప సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , టీజర్ , మరియు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ . సుకుమార్ పుష్ప సినిమా మేకింగ్ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా తెరకెక్కిస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించి ఒక్కో సర్‌ప్రైజ్‌ న్యూస్ వదులుతూ అల్లు అర్జున్ అభిమానులను సంతోషపెడుతున్నారు చిత్ర యూనిట్ .. ఇప్పటికే రిలీజ్ అయిన , మూడు లిరికల్ సాంగ్స్ కు అభిమానుల్లో అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది .. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోంది. ఈ సినిమాలో మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాజిల్ కీలక పాత్రను పోషిస్తున్నారు , దీనికి సంబంధించి మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు .. పుష్ప సినిమా కు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియా లో వినిపిస్తోంది .. ఈ సినిమాలో సునీల్ ఒక ముఖ్యమైన రోల్ లో నటిస్తున్నట్లు కొన్ని రోజుల క్రితం సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి .. సునీల్ కమీడియన్ నుండి హీరో మారి హిట్స్ అందుకొని మల్లి టైమ్ బాగోక , మల్లి క్యారెక్టర్ రోల్స్ మరియు సపోర్టింగ్ రోల్స్ , మరియు విలన్ రోల్స్ చేస్తూ సునీల్ ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేస్తున్నారు .. డిస్కో రాజా , కలర్ ఫోటో , లో నెగిటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ చేసి సునీల్ , విలన్ క్యారెక్టర్ ఇచ్చిన కాన్ఫిడెంట్ గా చేయగలడు అని పేరు సంపాదించుకున్నాడు .. ప్రస్తుతము సునీల్ చేతిలో వరుస సినిమాలు లైన్ లో ఉన్నాయి , సుకుమార్ మొదటి సినిమా ఆర్య లో సునీల్ నటించాడు , మల్లి చాలా కాలం తరువాత సునీల్ పుష్ప సినిమా లో నటిస్తున్నారు , సునీల్ కు ఏ క్యారెక్టర్ ఇచ్చిన ప్రాణం పెట్టి పని చేస్తాడు , అలానే సుకుమార్ ఆర్టిస్ట్ ల దగ్గర నుండి పెర్ఫార్మన్సెస్ బాగా రాబట్టగలడు , మరి సునీల్ లో సుకుమార్ ఎం చూశాడో తెలియదు గాని , పాన్ ఇండియా సినిమాగా రాబోతున్న పుష్ప సినిమాలో సునీల్ కు బంపర్ ఆఫర్ దక్కింది అనుకోవాలి .. పుష్ప సినిమా లో సునీల్ మంగళం శ్రీను అనే పాత్రలో నటిస్తున్నారు , ఈ పాత్ర కు సంబంధించి సునీల్ పోస్టర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ .. ఈ పోస్టర్ లో సునిల్ లుక్స్ అదిరిపోయాయి , సునీల్ లుక్స్ బాగున్నాయి అంటూ సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి .. అరవింద సమేత వీర రాఘవ సినిమాతో బౌన్స్ బ్యాక్ అయి సునీల్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయిపోయారు ..సునీల్ ఎంతో కాలంగా వేచి చూస్తున్న బ్రేక్ పుష్ప చిత్రంతో అందుకోవడం ఖాయంగానే అనిపిస్తుంది …

ముగ్గురు ముద్దుగుమ్మల 3రోజెస్ …

అడల్ట్ కంటెంట్ తో వస్తున్న 3రోజెస్...

                 

ప్రేక్షకులు ఎప్పటికి అప్పుడు కొత్త రకమైన , సినిమాలను చూడటానికి ఇష్టపడుతున్నారు , ప్రేక్షకుల అభిరుచి మారింది , మాస్ సినిమాలు ఇష్టపడే వారు ఉన్నారు , కంటెంట్ సినిమాలు ఇష్టపడేవారు ఉన్నారు ..ప్రేక్షకులు సినిమా విషయంలో ఎప్పటికి అప్పుడు అప్ డేట్ అవుతున్నారు .. ఒకప్పుడు సినిమా అంటేనే థియేటర్స్ లో చూడాలి అని ఉండేది , కానీ ఇప్పుడు కాలం మారింది , సినిమా స్థాయి కూడా పెరిగింది , థియేటర్స్ కోసం సినిమా తీసే దర్సకులు ఉన్నారు , అలానే ప్రస్తుతం ,ఓటీటీ ప్లాట్ ఫామ్ కోసం సినిమాలు వెబ్ సిరీస్ చేసే దర్శకులు ఉన్నారు , ఇప్పుడు ఓటీటీ హవా నడుస్తుంది . ముఖ్యంగా మహమ్మారి కరోనా సమయంలో ప్రేక్షకులు ధియేటర్స్ లో సినిమాలు చూడటం వీలు కాదు , కాబట్టి నిర్మాతలు కూడా , తమ సినిమాను ,ఓటీటీ లోనే రిలీజ్ చేశారు .. ,ఓటీటీ ప్లాట్ ఓటీటీ సంస్థ నుండి వస్తున్న సినిమాలు , మరియు వెబ్ సిరీస్ ను ప్రేక్షకులు బాగా ఇష్టపడుతున్నారు .. ప్రేక్షకులను ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందించడానికి కృషి చేస్తోన్న ఓటీటీ ‘ఆహా’. బ్లాక్ బస్టర్ సినిమాలు – స్పెషల్ టాక్ షోలతో పాటుగా ఒరిజినల్ సిరీస్ లనూ స్ట్రీమింగ్ పెడుతోంది. ఇప్పుడు ”3 రోజెస్” అనే సరికొత్త వెబ్ సిరీస్ ను అందుబాటులోకి తీసుకురాబోతోంది. డైరెక్టర్ మారుతి ఇప్పటి వరకు ఓటీటీ లోకి అడుగు పెట్టలేదు , గోపీచంద్ తో పక్కా కమ్మర్షియల్ సినిమా తో ఫుల్ బిజీగా ఉన్న మారుతి “3 రోజెస్ ” షో తో డిజిటల్ లోకి అడుగు పెడుతున్నారు .. ఆహా లో బాలకృష్ణ తో అల్లు అరవింద్ ఒక షో చేస్తూ ప్రేక్షకులకు మరింత వినోదాన్ని అందిస్తుంటే , డైరెక్టర్ మారుతి కూడా “3 రోజెస్ సిరీస్ తో షో రన్నర్ గా వ్యవహరిస్తూ మరింత ఆనందాన్ని అందించడం విశేషం .. “3 రోజెస్” టీజర్ లో పాయల్ రాజ్ పుత్ – ఈషా రెబ్బా – పూర్ణ వంటి ముగ్గురు ముద్దుగుమ్మలు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. తెలుగు డిజిటల్ స్పేస్ లో ముగ్గురు హీరోయిన్స్ తో చేస్తున్న తొలి ఫీమేల్ సెంట్రిక్ ఒరిజినల్ సిరీస్ ఇదేనని తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ‘3 రోజెస్’ ఫస్ట్ లుక్ మరియు ముగ్గురు హీరోయిన్ల క్యారక్టర్ పోస్టర్స్ ప్రేక్షకులకు బాగా ఆకట్టుకున్నాయి. నవంబర్ 12న ఈ సిరీస్ ని ఆహా లో ప్రీమియర్ గా స్ట్రీమింగ్ ని పెట్టనున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేశారు. 3 రోజెస్’ సిరీస్ ఓటీటీ కంటెంట్ కావడంతో అడల్ట్ టచ్ తో పాటుగా కాస్త శృతి మించిన డైలాగ్స్ ఉన్నాయి .. బోల్డ్ కంటెంట్ తో వస్తున్న ఈ సిరీస్ ను ప్రేక్షకులు ఏ మేరకు ఆదరిస్తారో అనేది చూడాలి …

గని సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ …

గని సినిమా నుండి మరో పోస్టర్ రిలీజ్ ...

మెగా హీరోల్లో వరుణ్ తేజ్ స్టోరీస్ సెలెక్షన్ చాలా విభిన్నంగా ఉంటుంది . రొటీన్ సినిమాలకు దూరంగా ఉంటూ , కెరీర్ మొదటి నుంచి విభిన్నమైన స్టోరీస్ సెలెక్ట్ చేసుకొని ఒక్కో మెట్టు ఎక్కుతూ హీరో గా ఎదిగారు ..ముకుంద సినిమా తో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన వరుణ్ తేజ్ , మొదటి సినిమా ఫలితం ఎలా ఉన్నా , ఈ సినిమాలో తన నటనకు , ప్రేక్షకుల్లో మంచి మార్కులు పడ్డాయి .. ఆరు అడుగుల అందగాడు , మంచి ఫిజిక్ , యాక్టింగ్ లో ఈజ్ కనపరుస్తూ ప్రేక్షకులను ఆకట్టుకొని తనకంటూ అభిమానుల హృదయం లో మంచి స్థానం సంపాదించుకున్నారు .. పాన్ ఇండియా స్టార్ అవ్వడానికి కావలిసిన లక్షణాలు అన్ని వరుణ్ తేజ్ కు ఉన్నాయి , కానీ ఒక్క సాలిడ్ స్క్రిప్ట్ కోసం ఎదురుచూస్తున్నారు .. 2019 లో డైరెక్టర్ హరీష్ శంకర్ – వరుణ్ తేజ్ కాంబినేషన్ లో వచ్చిన చివరి సినిమా ‘గద్దలకొండ గణేష్‌’ . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ , వరుణ్ తేజ్ యాక్టింగ్ , వరుణ్ తేజ్ లుక్స్ , మరియు కామిడీ టైమింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర హిట్ టాక్ అందుకుంది .. ‘గద్దలకొండ గణేష్‌’ సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని “గని” మరియు ‘ఎఫ్ 3’ సినిమాలు చేస్తున్నారు ..మెగా హీరో వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా గురించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో రాబోతున్న ఈ సినిమా కోసం మెగా హీరో వరుణ్ తేజ్ చాలా స్పెషల్ గా విదేశాల్లో అంతర్జాతీయ స్థాయి ఛాంపియన్స్ వద్ద ట్రైనింగ్ తీసుకున్నట్లు తెలుస్తుంది .. . కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఈ సినిమాను అల్లు బాబీ మరియు సిద్దు ముద్ద లు సంయుక్తంగా అల్లు అరవింద్ సమర్పణలో నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్ , మరియు లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ప్రేక్షకుల్లో ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. గని సినిమాలో హీరోయిన్ గా వరుణ్ కు జోడీగా సాయి మంజ్రేకర్ నటించిన విషయం తెల్సిందే. గని సినిమా ను డిసెంబర్ 3న థియేటర్ల ద్వారా విడుదల చేస్తున్నారు .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి , మోషన్ పోస్టర్ ,మరియు వరుణ్ తేజ్ కు సంబంధించి ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేయగా , హీరోయిన్ పోస్టర్ రిలీజ్ చేయలేదు , మొదటి మోషన్ పోస్టర్ లో వరుణ్ తేజ్ బాక్సింగ్ చేస్తున్నట్లు గా పోస్టర్ రిలీజ్ చేసిన చిత్ర యూనిట్ , హీరోయిన్ కు సంబంధించి పోస్టర్ రిలీజ్ చేయలేదు , అంతే కాకుండా ఈ సినిమాలో వరుణ్ తేజ్ బాక్సింగ్ పోస్టర్ కాకుండా సినిమా రిలీజ్ డేట్ ఎనౌన్సమెంట్ చేస్తూ వరుణ్ తేజ్ , మరియు హీరోయిన్ సాయి మంజ్రేకర్ ఉన్న పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మొత్తానికి వరుణ్ తేజ్ నటిస్తున్న గని సినిమా దీపావళి సందర్భంగా రెండో పోస్టర్ రిలీజ్ చేయడం , ఈ పోస్టర్ లో మెగా హీరో వరుణ్ తేజ్ పక్కన హీరోయిన్ సాయి మంజ్రేకర్ ,గులాబీ పూలు పట్టుకొని ,హీరో వరుణ్ తేజ్ పక్కన ఉండటం ఈ పోస్టర్ ని చూసి మెగా హీరోలు అందరూ సంతోషపడుతున్నారు …

గోపీచంద్ పక్కా కమర్షియల్ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ …

పక్కా కమర్షియల్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్ …

ఆరు అడుగుల అందగాడు , మొదటి సినిమా తొలివలపు సినిమా తో హీరోతో టాలీవుడ్ లోకి అడుగు పెట్టిన గోపిచంద్ నెమ్మదిగా ఒక్కో మెట్టు ఎక్కుతూ స్టార్ హీరో గా ఎదిగారు .. ఆరు అడుగుల ఎత్తు , మంచి ఫిజిక్ , చిన్న స్మైల్ , యాక్టింగ్ లో ఈజ్ , కామిడీ టైమంగ్ , తో ప్రేక్షకులను ఆకట్టుకొని థియేటర్స్ లో క్లాప్స్ , విజిల్స్ వేయగలిగే స్టార్ హీరో గా ప్రూవ్ చేసుకున్నారు …గోపీచంద్ సినీ కెరీర్ తొలివలపు సినిమా తో స్టార్ట్ చేసిన , తానూ ప్రతినాయకుడిగా చేసిన జయం , నిజం , వర్షం సినిమాలతో బెస్ట్ విలన్ గా గుర్తింపు తెచ్చుకున్నారు .. పడి లేచిన కెరటం హీరో గోపీచంద్ , రొటీన్ కి బిన్నంగా స్టోరీస్ సెలెక్ట్ చేసుకుంటూ , హిట్స్ అండ్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా సినిమాలు చేస్తున్నారు .. ఒక్క సాలిడ్ స్క్రిప్ట్ , పడితే గోపీచంద్ ఫుల్ ఫామ్ లోకి వస్తాడు .. గోపీచంద్ మరియు డైరెక్టర్ శ్రీవాస్ ది హిట్ కాంబినేషన్ గతంలో వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన లక్ష్యం సీనిమా తరువాత 2104 లో లౌక్యం సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చి సూపర్ హిట్ అందుకున్నారు , లౌక్యం సినిమా తరువాత హీరో గోపీచంద్ చేసిన జిల్ , సౌఖ్యం , ఆక్సిజన్ , పంతం ,మరియు చాణుక్య సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంతగా విజయం సాధించలేకపోయాయి .. గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది ది కూడా హిట్ కాంబినేషన్ , వీరి కాంబినేషన్ లో వచ్చిన గౌతమ్ నంద సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర యావేరేజ్ టాక్ తెచ్చుకున్న హీరో గోపీచంద్ నటనకు ప్రేక్షకులు మంచి మార్కులు పడ్డాయి .. గోపీచంద్ – డైరెక్టర్ సంపత్ నంది కాబినేషన లో వచ్చిన రెండో సినిమా సీటీమార్‌ , స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ , మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .

సీటీమార్‌ సినిమా తో బిగ్గెస్ట్ హిట్ అందుకొని ఫుల్ ఫామ్ లోకి వచ్చాడు గోపిచంద్ … సీటిమార్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో బౌన్స్ బ్యాక్ అయి వరుస పెట్టి సినిమాలను లైన్ లో పెడుతున్నాడు , ఈ నేపథ్యంలో డైరెక్టర్ మారుతి డైరెక్షన్ లో పక్కా కమర్షియల్ అనే సినిమా లో నటిస్తున్నారు .ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. మారుతి మంచి రోజులు వచ్చాయి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఒక వైపు ఈ సినిమా థియేటర్లలో సందడి చేస్తూనే ఉండగా మరో వైపు పక్కా కమర్షియల్ సినిమాను కూడా ధియేటర్స్ లోకి త్వరగా తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలుస్తుంది .. దీపావళి సందర్భంగా ఈ సినిమా టీజర్ రిలీజ్ చేస్తున్నట్లు డేట్ ఫిక్స్ చేసుకొని చిన్న వీడియో రిలీజ్ చేశారు చిత్ర యూనిట్ . ఈ వీడియో లో గోపీచంద్ స్టైలిష్ లుక్స్ లో కనిపిస్తున్నారు .. పక్కా కమర్షియల్ సినిమా టీజర్ ఈనెల 8న సాయంత్రం 6 గంటలకు విడుదల చేయబోతున్నట్లుగా పక్కా కమర్షియల్ టీమ్ అధికారికంగా ప్రకటించారు. మొత్తానికి పక్కా కమర్షియల్ సినిమా టీజర్ రిలీజ్ డేట్ ఎనౌన్సుమెంట్ రావడంతో గోపీచంద్ అభిమానులు సంతోషంగా ఉన్నారు …..

మెగాస్టార్ 154 మూవీ ఫస్ట్ లుక్ అదిరింది…

బాబీ  డైరెక్షన్ లో మెగా స్టార్ సినిమా అఫీషియల్ ఎనౌన్సమెంట్ ...

మెగా స్టార్ చిరంజీవి చిరంజీవి దాదాపు 9 ఏళ్ల తరువాత ఖైదీ నెంబర్ 150’ సినిమా తో రీ ఎంట్రీ ఇచ్చారు. మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ వి వి వినాయక్ ది హిట్ కాంబినేషన్ , వీరిద్దరి కాంబినేషన్ లో వచ్చిన సినిమా ఠాగూర్ , తరువాత , మల్లి మెగా స్టార్ చిరంజీవి తో 150 వ సినిమా డైరెక్ట్ చేశారు . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ ,మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది . ఖైదీ నెంబర్ 150 సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి – డైరక్టెర్ సురేందర్ రెడ్డి కాంబినేషన్ లో ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ ఆధారంగా సైరా నరసింహారెడ్డి సినిమా చేసారు . ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి వారి జీవిత కధ కాబట్టి ఈ సినిమాలో మెగా స్టార్ చిరంజీవి ప్రాణం పెట్టి పని చేశారు , ఈ సినిమా లో బారి కాస్టింగ్ , భారీ సెట్టింగ్ , భారీ యాక్షన్ , మెగా స్టార్ యాక్టింగ్ ,మరియు డైరెక్టర్ సురేందర్ రెడ్డి టేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది ..

సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగా స్టార్ చిరంజీవి వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .. సైరా నరసింహారెడ్డి సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో ఆచార్య సినిమా చేస్తున్నారు ..ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి మోషన్ పోస్టర్స్ , టీజర్స్ , లిరికల్ సాంగ్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద భారీ అంచనాలను క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ప్రస్తుతము ఆచార్య సినిమా సెట్స్ మీద ఉండగానే మెగా స్టార్ చిరంజీవి మరో మూడు సినిమాలు లైన్ లో పెట్టారు , వాటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న ‘గాడ్‌ ఫాదర్‌’ సినిమా ఒకటి , మెహెర్ రమేష్ డైరెక్షన్ లో వస్తున్న భోళా శంకర్‌’ సినిమా మరియు బాబీ డైరెక్షన్ లో ఒక సినిమాకు కమిట్ అయ్యారు.. ప్రస్తుతము ఆచార్య సినిమాకు సంబంధించి షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది , చిరంజీవి ఆచార్య సినిమా తరువాత , గాడ్ ఫాదర్ , ,మరియు మెహెర్ రమేష్ డైరెక్షన్ లో సినిమాలు రెడీ గా ఉన్నాయి , కానీ వీటిలో మోహన్ రాజా డైరెక్షన్ లో వస్తున్న గాడ్ ఫాదర్ సినిమా ప్రీ -ప్రొడక్షన్ పనులు స్పీడ్ గా జరుగుతున్నాయి , మెగా స్టార్ కోసం డైరెక్ట్ చేసే అవకాశం కోసం ఎంతో మంది డైరెక్టర్స్ ఎదురుచూస్తున్నారు , ఫైనల్ గా ఇప్పుడు ఈ అవకాశం యంగ్ డైరెక్టర్ బాబీ కి దక్కింది .మెగా స్టార్ చిరంజీవి కోసం ఒక సాలిడ్ స్టోరీ రెడీ చేసుకున్నాడు , ఈ సినిమాకు సంబంధించి ఒక ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. . బాబీ దర్శకత్వంలో రూపొందబోతున్న సినిమా ఓపెనింగ్ అండ్ పూజా కార్యక్రమాలు ఈనెల 6వ తారీకున ఉదయం 11.43 కు లాంచనంగా జరుగబోతున్నాయి. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మిస్తున్నారు ..ఈ సినిమా ఎనౌన్స్ చేస్తూ సోషల్ మీడియా లో పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ .. మెగా స్టార్ చిరంజీవి – బాబీ కాంబినేషన్ లో ఫైనల్ గా సినిమా ఎనౌన్స్ చేస్తూ పోస్టర్ రిలీజ్ చేసి అభిమానులకు చిత్ర యూనిట్ గుడ్ న్యూస్ తెలిపారు …

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

ఆచార్య సినిమా నుండి రామ్ చరణ్ సాంగ్ ప్రోమో రిలీజ్..

“రంగస్థలం ” లాంటి ఇండస్ట్రీ హిట్ సినిమా తరువాత రామ్ చరణ్ బోయపాటి శ్రీను కాంబినేషన్ లో వచ్చిన సినిమా ‘ వినయ విధేయ రామ” . ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మేకింగ్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ టాక్ తెచ్చుకుంది . . వినయ విధేయ రామ సినిమా తరువాత రామ్ చరణ్ కొంత గ్యాప్ తీసుకొని రాజమౌళి కాంబినేషన్ లో మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు . రాజామౌళి బాహుబలి సినిమా తరువాత చేస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ సినిమాకు సంబంధించి రామ్ చరణ్ టీజర్ రిలీజ్ చేయగా అభిమానుల్లో రామ్ చరణ్ టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది .. రాజమౌళి – రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా తో పాటు ఆచార్య సినిమాలో క్యామియో రోల్ లో నటిస్తున్నారు , ఈ సినిమాకు సంబంధించి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పోస్టర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్ ..మెగా స్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో వస్తున్న ఆచార్య సినిమాకు సంబంధించి లిరికల్ సాంగ్ , మరియు మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమా మీద పాజిటివ్ వైబ్స్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. ఆచార్య సినిమా విడుదల కరోనా వల్ల చాలా ఆలస్యం అయ్యింది. ఎట్టకేలకు 2022ఫిబ్రవరి 4న విడుదల కానున్నది. ఈ సినిమాలో రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే నటిస్తున్న విషయం తెల్సిందే. దీపావళి సందర్బంగా రామ్ చరణ్ మరియు పూజా హెగ్డేల కాంబోలో ఆచార్య సినిమాలో ఉండే పాట ప్రోమోను విడుదల చేయడం జరిగింది. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు , ఇప్పటికే ఈ సినిమాలో మొదటి సాంగ్ ప్రేక్షకులను బాగా అలరించింది . తాజాగా ఈ సినిమా లో మరో సాంగ్ రిలీజ్ గురించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ బయటకు వచ్చింది .. నీలాంబరి అంటూ సాగే ఈ పాట ను చరణ్ మంచి డాన్స్ స్టెప్పులతో రూపొందించారు. ఇంతకు ముందు వచ్చిన లాహె లాహె పాట ఎలా అయితే టెంపుల్ సిటీలో చిత్రీకరించారో.. ఈ పాటను కూడా అదే పరిసరాల్లో చిత్రీకరించినట్లుగా నీలాంబరి పాట ప్రోమోను చూస్తుంటే అర్థం అవుతోంది. ఇక రామ్ చరణ్ సింపుల్ లుక్ లో కనిపిస్తున్నారు ..ఇక నీలాంబరిగా పూజా హెగ్డే కూడా క్యూట్ అండ్ స్వీట్ గా ఉంది. ఈ సాంగ్ ను . నవంబర్ 5 ఉదయం 11.07 గంటలకు విడుదల చేయబోతున్నారు. దీపావళి తర్వాత రోజు అంటే రేపు ఈ పాట పూర్తి నిడివి తో మన ముందుకు వస్తున్నది … ఆచార్య సినిమా ఇంత ఆలస్యం అయినా కూడా అభిమానుల్లో ఈ సినిమా గురించి కొంత అయిన ఆసక్తి తగ్గలేదు. లాహె లాహె పాట మణిశర్మ సంగీత సారధ్యంలో వచ్చి భారీగా వ్యూస్ ను దక్కించుకుంది. , మరి ఈ నీలాంబరి పాటను సింగర్ అనురాగ్ కులకర్ణి మరియు రమ్య బెహరా లు ఆలపించారు. అనంత శ్రీరామ్ ఈ పాటకు సాహిత్యంను అందించారు. ఈ పాట లో రామ్ చరణ్ డాన్స్ చాలా ఈజ్ తో ఉంది .. ఈ సాంగ్ కు శేఖర్ మాస్టర్ కొరియోగ్రాఫ్ చేశారు … సినిమాలో ఈ పాట చాలా కలర్ ఫుల్ గా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు…

పాన్ ఇండియా సినిమాను లైన్ లో పెట్టిన మాస్ మహారాజ్ రవితేజ…

బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఎనౌన్స్ చేస్తున్న మాస్ మహారాజ్  

మాస్ మహారాజ్ రవితేజ – గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ సినిమా ” క్రాక్” .. ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది .. క్రాక్ సినిమా కంటే ముందు వచ్చిన సినిమాలు డిసాస్టర్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రవితేజ కెరీర్ అయిపోయింది అన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వినిపించాయి .. ఇండస్ట్రీ లో మినిమమ్ గ్యారెంటీ ఉన్న హీరో రవితేజ , గత కొంత కాలంగా రవితేజ కు సరి అయినా హిట్స్ లేవు , రవితేజ – డైరెక్టర్ అనిల్ రావిపూడి – కాంబినేషన్ లో వచ్చిన రాజా ది గ్రేట్‌ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అందుకుంది .. రాజా ది గ్రేట్ సినిమా తరువాత చేసిన నేల టిక్కెట్టు , అమర్ అక్బర్ ఆంటోని ,డిస్కో రాజా , సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద డిసాస్టర్ గా నిలిచాయి .. మాస్ మహారాజ్ రవితేజ కు ఒక సాలిడ్ కంటెంట్ ఉన్న స్టోరీ పడితే చాలు మల్లి ఫామ్ లో వస్తాడు అని ప్రేక్షకులు నమ్మకంగా చెబుతుంటారు .. రాజా ది గ్రేట్‌ సినిమా తరువాత వచ్చిన సినిమాలు బాగా డిస్సపాయింట్మెంట్ అయ్యాయి , అంతే కాకుండా రవితేజ సినీ కెరీర్ గ్రాఫ్ కూడా బాగా పడిపోయింది .. రవితేజ సినిమా నుండి ఏ అంశాలు కోరుకుంటున్నారో , అవి ఒక సాలిడ్ స్క్రిప్ట్ లో ఉంటే చాలు రవితేజ దాన్ని నెక్స్ట్ లెవెల్ లో చుపిస్తానికి ట్రై చేస్తారు .. మాస్ మహారాజ్ రవితేజ ది – డైరెక్టర్ శ్రీను వైట్ల ది హ్యాట్రిక్ కాంబినేషన్ , గతంలో వీరిద్దరి కాంబో లో వచ్చిన వెంకీ సినిమా , మరియు దుబాయ్ శ్రీను సినిమాలు బిగ్గెస్ట్ హిట్స్ అయి , డైరెక్టర్ శ్రీను వైట్ల కు మంచి పేరు తీసుకొచ్చాయి . మాస్ మహారాజ్ రవితేజ – డైరెక్టర్ శ్రీను వైట్ల కాంబినేషన్ లో వచ్చిన హ్యటిక్ సినిమా “అమర్ అక్బర్ ఆంటోని ” .. ఈ సినిమా మాస్ మాహారాజ్ రవితేజ కు కెరీర్ లో ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడమే కాకుండా రవితేజ స్టోరీ సెలెక్షన్ సరిగ్గా లేనందువల్లే సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి అని సోషల్ మీడియా లో కామెంట్స్ వినిపిస్తున్నాయి ..అమర్ అక్బర్ ఆంటోని సినిమా తరువాత కొంత గ్యాప్ తీసుకొని మాస్ మహారాజ్ రవితేజ కాన్సెప్ట్ కంటెంట్ ఉన్న దర్శకుడిగా పేరు గాంచిన డైరెక్టర్ వీఐ ఆనంద్‌ డైరెక్షన్ లో డిస్కో రాజా సినిమా చేసారు ,సైన్స్‌ఫిక్షన్‌ అండ్‌ రివేంజ్‌ డ్రామా గా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర డిసాస్టర్ గా నిలిచింది ..రవితేజ చేసిన సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్ అవ్వుతున్నడంతో , ఇక రవితేజ కెరీర్ అయిపోయింది అని అనుకుంటున్న టైమ్ లో తనకు గతంలో హిట్స్ డాన్ శ్రీను , బలుపు లాంటి హిట్స్ ఇచ్చిన , డైరెక్టర్ గోపీచంద్ మలినేని తో క్రాక్ సినిమా తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు , ఈ సినిమా ట్రైలర్స్ అండ్ టీజర్స్ మరియు సాంగ్స్ తో ప్రేక్షకులను ఆకట్టుకొని బాక్స్ ఆఫీస్ దగ్గర బిగ్గెస్ట్ హిట్ అవ్వడమే కాకుండా డైరెక్టర్ గోపీచంద్ మలినేని కు మంచి పేరు తీసుకొచ్చింది ..

క్రాక్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ ఫామ్ మీద ఉన్న రవితేజ , ఆ తరువాత వరుస సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .గతంలో ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా పూర్తి అయిన తరువాతనే ఇంకో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్ళేవారు , కానీ , మాస్ మాహారాజ్ రవితేజ స్పీడ్ పెంచి ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పకుడే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు ..ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ చేతిలో ఖిలాడీ సినిమా , మరియు శరత్ మాండవ డైరెక్షన్ లో ఒక సినిమా , మరియు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి ., వీటితో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో ఒక సినిమా ఇలా వరుస సినిమాలను లైన లో పెట్టి తన డైరీ ని నింపేసాడు ..

క్రాక్ సినిమా ఇచ్చిన రిసల్ట్ తో ఫుల్ ఫామ్ మీద ఉన్న రవితేజ , ఆ తరువాత వరుస సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపారు .గతంలో ఏ స్టార్ హీరో అయినా ఒక సినిమా పూర్తి అయిన తరువాతనే ఇంకో సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్ళేవారు , కానీ , మాస్ మాహారాజ్ రవితేజ స్పీడ్ పెంచి ఒక సినిమా సెట్స్ మీద ఉన్నప్పకుడే మరొక సినిమాను లైన్ లో పెడుతున్నాడు ..ప్రస్తుతం మాస్ మహారాజ్ రవితేజ చేతిలో ఖిలాడీ సినిమా , మరియు శరత్ మాండవ డైరెక్షన్ లో ఒక సినిమా , మరియు త్రినాద్ రావు నక్కిన డైరెక్షన్ లో ఒక సినిమా లైన్ లో ఉన్నాయి ., వీటితో పాటు డైరెక్టర్ సుధీర్ వర్మ చేతిలో ఒక సినిమా ఇలా వరుస సినిమాలను లైన లో పెట్టి తన డైరీ ని నింపేసాడు .. రవితేజ నాలుగు సినిమాలను లైన్ లో పెట్టి , ఒక్కో సినిమా అప్ డేట్ నెమ్మది నెమ్మదిగా ఇస్తూ , తన సినిమాల పట్ల ప్రేక్షకులకు ఎంతో కీరియాసిటీని పెంచుతున్నారు.. రవితేజ లైన్ లో మరో సినిమాకు సంబంధించి మరో ఇంట్రస్టింగ్ న్యూస్ ఒకటి బయటకు వచ్చింది .. దీపావళి పండుగ సందర్భంగా రవితేజ -దొంగాట’ ఫేమ్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా ”టైగర్ నాగేశ్వరరావు” అనే చిత్రాన్ని అనౌన్స్ చేశారు.,, ఈ సినిమాను , తేజ్ నారాయణ అగర్వాల్ సమర్పణలో అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్ మీద భారీ బడ్జెట్ తో అభిషేక్ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో తెలుగు తమిళ కన్నడ మలయాళ హిందీ భాషల్లో ఈ సినిమాని విడుదల చేయనున్నారు. ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ‘అక్కడ దొంగలు దోపిడీదారులు ఉండేవారు. అదే విధంగా టైగర్ నాగేశ్వరరావు కూడా ఉన్నారు’ అని చిత్ర బృందం ట్వీట్ చేసింది.‘ఫీల్ ది సైలెన్స్ బిఫోర్ ది హంట్’ అంటూ రిలీజ్ చేసిన ”టైగర్ నాగేశ్వరరావు” అనౌన్స్ మెంట్ పోస్టర్ విశేషంగా ఆకట్టుకుంటోంది…

భీమ్లా నాయక్ సినిమా నుండి మరో ఇంట్రస్టింగ్ న్యూస్…

దీపావళి రోజున భీమ్లా నాయక్ గ్లిమ్ప్స్ రిలీజ్... 

వకీల్ సాబ్ సినిమా తరువాత పవన్ కళ్యాణ్ వరుసగా సినిమాలు లైన్ లో పెట్టి అభిమానులకు పెద్ద సర్‌ప్రైజ్‌ ఇచ్చారు . పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమా తరువాత ఎనౌన్స్ చేసిన సినిమాల మీద అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి . ప్రస్తుతం పవన్ క్రిష్ కాంబినేషన్ లో ‘హరి హర వీర మల్లు’ అలానే డైరెక్టర్ హరీష్ శంకర్ కాంబినేషన్ లో ఒక సినిమా , మరియు రానా తో ” భీమ్లా నాయక్” మల్టీ స్టారర్ సినిమా చేస్తున్నాడు .. ” భీమ్లా నాయక్” సినిమా టీజర్స్ , మరియు మోషన్ పోస్టర్స్ , మరియు రెండు లిరికల్ సాంగ్స్ రిలీజ్ చేసి ఈ సినిమా మీద పాజిటివ్ బజ్ క్రియేట్ చేసింది చిత్ర యూనిట్ .. పవన్ కళ్యాణ్ హీరోగా రానా కీలక పాత్రలో నటిస్తున్న భీమ్లా నాయక్ సినిమా సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు సోషల్ మీడియా లో కొన్ని కామెంట్స్ వినిపించాయి . మలయాళం లో సూపర్ హిట్ అయిన , అయ్యప్పనుమ్ కోషియుమ్ కు సినిమాకు ఇది రీమేక్ అవుతున్నది .. ఈ సినిమాలో మల్టీ స్టారర్ గా ప్రేక్షకుల ముందుకు రావడంతో ఈ సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి .. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి రానా టీజర్ , మరియు పవన్ టీజర్ రిలీజ్ చేయగా , ప్రేక్షకుల్లో వీరిద్దరి టీజర్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది ..పవన్ కళ్యాణ్ కు జోడీగా నిత్యా మీనన్ నటించడం , మరియు రానా సరసన మొదట్లో ఐశ్వర్య రాజేశ్‌ నటిస్తున్నట్లు సోషల్ మీడియా లో వార్తలు వినిపించాయి కానీ దీనికి సంబంధించి అధికారంగా ప్రకటన అయితే రాలేదు .. మొత్తానికి ఇప్పుడీ , అవకాశం మలయాళీ ముద్దుగుమ్మ సంయుక్త మేనన్‌ను వరించినట్లు తెలుస్తుంది ..ఈ సినిమా లో టైటిల్‌ పాత్రలో పవన్‌ కల్యాణ్‌ నటిస్తుండగా , మరో హీరోగా రానా కనిపించనున్నారు, ఈ సినిమాకు త్రివిక్రమ్‌ స్క్రీన్‌ప్లే, సంభాషణలు అందిస్తుడంతో సినిమా మీద భారీ క్రేజ్ ఏర్పడింది … తాజాగా ఈ సినిమాకు సంబంధించి .. ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ను రేపు ఉదయం 11 గంటలకు ఇవ్వబోతున్నారు అని వార్తలు వస్తున్నాయి ..
ఈ సినిమా షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది .. ఈ సినిమాకు సంబంధించి , రేపు అప్ డేట్ ఏమైనా చెప్తారేమో అంటున్నారంటూ వార్తలు వస్తున్నాయి. మరో వైపు సంక్రాంతికి ఆర్ ఆర్ ఆర్ సినిమా విడుదల కాబోతున్న నేపథ్యంలో భీమ్లా నాయక్ సినిమాను వాయిదా వేస్తారనే వార్తలు కూడా వస్తున్నాయి. . దీపావళికి అది ఏమైనా ఇస్తారా అంటే కావచ్చు అనే సమాధానం కూడా వినిపిస్తుంది. మొత్తానికి భీమ్లా నాయక్ రేపు ఉదయం 11 గంటల కు అప్ డేట్ సినిమా ఏమి చెప్పబోతున్నారు అంటూ అభిమానులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు …

మంచి రోజులు వచ్చాయి అని అంటున్న స్టార్ హీరోయిన్ మెహరీన్‌ …

ఛాలెంజ్ రోల్స్ లో నటించాలి అని అంటున్న మెహరీన్‌ …

2016 లో డైరెక్టర్ హను రాఘవపూడి – నాచురల్ స్టార్ నాని కాంబినేషన్ లో ప్రేక్షకులు ముందుకు వచ్చిన సినిమా “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” .. ఈ సినిమాతోనే మెహ్రీన్ పిర్జాదా టాలీవుడ్ ఇండస్ట్రీ కి పరిచయము అయింది .. “కృష్ణ గాడి వీర ప్రేమ గాథ” సినిమా పెద్ద హిట్ అవ్వడంతో ఈ అమ్మడికి వరుస ఆఫర్స్ వచ్చాయి ..తెలుగు సినిమాలతో పాటు హిందీ , తమిళ సినిమాలు కూడా చేసి మంచి హీరోయిన్ గా గుర్తింపు పొందింది .. చిన్న సినిమా పెద్ద సినిమా అని తేడా లేకుండా వచ్చిన ప్రతి ఆఫర్ ను వినియోగించుకొని , ఒక్కో మెట్టు ఎక్కి మంచి హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది .. మెహరీన్‌ చివరిగా చేసిన చాణక్య, ఎంత మంచివాడవురా , రెండు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర ఆశించినంత స్థాయి లో విజయం సాధించలేకపోయాయి .. ప్రస్తుతము హీరోయిన్ మెహ్రిన్ రెండు సినిమాలు లైన్ లో ఉన్నాయి ఎఫ్ 3 సినిమా ఒకటి మరోక సినిమా మారుతీ డైరెక్షన్ లో వస్తున్న ‘మంచి రోజులు వచ్చాయి’ .. మారుతి డైరెక్షన్ లో మెహరీన్‌ ” , మహానుభావుడు సినిమాలో నటించింది , దీపం ఉన్నప్పుడే ఇల్లు చక్కపెట్టుకోవాలి , వచ్చిన ప్రతి ఆఫర్ ను సద్వినియాగం చేసుకుంటూ ప్రేక్షకులకు నా నుండి ఏ సినిమాలు ఆశిస్తారో , అలాంటి సినిమాలు చేస్తాను అని మెహరీన్‌ తెలిపింది .. ప్రస్తుతము హీరో సంతోష్‌ శోభన్, మెహరీన్‌ జంటగా మారుతి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మంచి రోజులు వచ్చాయి’ సినిమాలో నటిస్తుంది . ఈ సినిమాను యూవీ కాన్సెప్ట్స్, మరియు మాస్‌ మూవీ మేకర్స్‌ పతాకాలపై వి సెల్యూలాయిడ్, ఎస్‌కేఎన్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 4న విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్‌ విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మంచి రోజులు వచ్చాయి’లో సాఫ్ట్‌వేర్‌ పద్దు పాత్రలో కనిపిస్తాను. ఇది ఓ కాలనీలో జరిగే కథ. ఇందులోని సన్నివేశాలు, పరిస్థితులను చాలామంది కోవిడ్‌ టైమ్‌లో ఎక్స్‌పీరియన్స్‌ చేసి ఉంటారు. సాధారణంగానే నేను ఫన్నీగా ఉంటాను. అందుకే అల్లరి సీన్స్, కామెడీ సీన్స్‌లో నటించడం చాలా ఈజీగా అనిపిస్తుంది. మా ఇంట్లో మా అమ్మ, నేను కరోనా బారిన పడి ఇటీవలే , కోలుకున్నాం. ‘మహానటి’లో కీర్తీ సురేశ్, ‘ఓ బేబీ’లో సమంత లాంటి పాత్రలు చేయాలని ఉంది. ప్రస్తుతం తెలుగులో ‘ఎఫ్‌ 3’, కన్నడలో శివరాజ్‌కుమార్‌తో ఓ సినిమా చేస్తున్నాను. మరికొన్ని తెలుగు కథలు వింటున్నాను , గ్లామర్ పాత్రలే కాకుండా , నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు చెయ్యాలి అని ఉంది ,భవిష్యత్తు లో మరిన్ని ఛాలెంజింగ్ రోల్స్ , డ్రీమ్ రోల్స్ చెయ్యాలని ఉందని తెలిపింది ..

1 138 139 140 141 142 143