కొరటాల దర్శకత్వం లో అల్లు అర్జున్, ధనుష్ భారీ మల్టీస్టార్…

ప్రస్తుతం టాలీవుడ్ లో మల్టీ స్టారర్ ట్రెండ్ నడుస్తుంది .. ఈ మల్టీ స్టారర్ ట్రెండ్ ప్రారంబించింది డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల .. శ్రీకాంత్ అడ్డాల డైరెక్షన్ లో వచ్చిన మల్టీ స్టారర్ మూవీ సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు .. స్టోరీ నచ్చాలి , కధలో దమ్ము ఉండాలే గాని మన హీరోలు మల్టీ స్టారర్ సినిమా లు చేయడానికి ఎప్పుడు సిద్దమే .. ప్రస్తుతం డైరెక్టర్స్ ఆలోచనలు మారుతున్నాయి .. రొటీన్ మూవీస్ కు దూరంగా ఉంటూ , రియాలిటీ సబ్జెక్ట్స్ ట్రై చేస్తున్నారు .. అలానే సినిమా ల విషయంలో ప్రేక్షకుల అభిరుచి కూడా మారింది ..
ఇక అసలు విషయానికి వెళ్ళితే ….. బాలీవుడ్ నుండి టాలీవుడ్ వరకు ఇప్పుడు మల్టీస్టారర్ సినిమాల హవా నడుస్తున్న సంగతి తెలిసిందే. తమ అభిమాన స్టార్ హీరోలను బిగ్ స్క్రీన్ మీద ఒకే తెరపై చూడాలని అభిమానులు కోరుకుంటున్నారు .. ఈ క్రమంలో నిర్మాతలు కూడా కాంబినేషన్స్ సెట్ చేయడానికి తెగ ప్రయత్నిస్తున్నారు .. అయితే కొన్ని కాంబినేషన్స్ త్వరగా సెట్ అవుతాయి , కొన్ని సెట్ అవ్వడానికి చాలా సమయం పడుతుంది .. ఇక డైరెక్టర్స్ రూట్ మారుస్తూ రెగ్యులర్ మూవీస్ కి దూరంగా ఉంటూ విభిన్నమైన , కొత్తరకమైన కధలను ఎంచుకుంటూ ఎప్పటికప్పుడు అప్ డేట్ అవుతున్నారు ….మల్టీ స్టారర్ సినిమా చేయడం అంటే మామూలు విషయం కాదు .. ఇద్దరు స్టార్ హీరోలను న్యాయం చెయ్యాలి .. ఇద్దరి పాత్రలు బ్యాలెన్స్ చేయాలి ..ఈ ఫార్ములాని ..డైరెక్టర్ రాజమౌళి ఆర్ ఆర్ ఆర్ మూవీ విషయంలో ఇద్దరి హీరోలను బాగా బాలన్స్ చేసి బిగ్గెస్ట్ సక్సెస్ అందుకున్నారు .. ఇక ఆర్ ఆర్ ఆర్ మూవీ సక్సెస్ అవ్వడంతో , డైరెక్టర్స్ అందురు మల్లి మల్టీ స్టారర్ సినిమా లు చెయ్యాలనే ఆలోచనల మీద ఉన్నారు .. రాజామౌళి బ్రాండ్ సినిమాగా ప్రస్తుతం థియేటర్లలో ఉన్న క్రేజీ మల్టీస్టారర్ సినిమా ఆర్ఆర్ఆర్ క్రేజ్ నడుస్తుండగానే ఇప్పుడు మరో క్రేజీ మల్టీస్టారర్ సినిమా సెట్ అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి ..
తమిళ స్టార్ హీరో ధనుష్ ఇప్పుడు తెలుగు సినిమాలపై స్పెషల్ ఫోకస్ పెడుతున్నాడు …. ఇప్పటికే శేఖర్ కమ్ముల దర్శకత్వంలో స్ట్రైట్ తెలుగు సినిమా చేస్తున్న ధనుష్.. ఇప్పుడు మరో పాన్ ఇండియా సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి ….ఈ క్రమంలో పుష్ప సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన అల్లు అర్జున్ పుష్ప 2తో దాన్నికంటిన్యూ చెయ్యాలని చూస్తున్నాడు .. పుష్ప 2 మూవీ తరువాత కూడా పాన్ ఇండియా మూవీస్ తోనే కెరీర్ ప్లాన్ చేసుకుంటారు. , కొరటాల శివ దర్శకత్వంలో ధనుష్-అల్లు అర్జున్ హీరోలుగా ఓ భారీ మల్టీస్టారర్ సినిమా కు బేస్ పడినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం ఎన్టీఆర్ తో సినిమా చేయనున్న కొరటాల శివ ఆ సినిమా తర్వాత ఈ మల్టీస్టారర్ సినిమాను పట్టాలెక్కించనున్నాడట. మరి ఈ మల్టీ స్టారర్ మూవీ ఎప్పుడు మొదలు అవుతుంది అనే విషయం పై పూర్తిగా క్లారిటీ రావాలి అంటే మరి కొద్దీ రోజులు ఆగాలిసిందే ….